BJP: లక్ష్మణ్ నే ఎందుకు ఎంపిక చేశారు ? మోడీ స్కెచ్ ఏంటి ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్నిగంటల ముందు బీజేపీ జాతీయ నాయకత్వం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆయన ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణ నుంచి ఒకరికి రాజ్యసభ అవకాశం వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సీటును తెలంగాణకే ఎందుకు ఇచ్చింది? అందులోనూ లక్ష్మణ్నే ఎందుకు ఎంచుకుంది అనేది ప్రస్తుతం చర్చగా మారింది.
తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెరిగింది. ఇక్కడ పార్టీ యాక్టివిటీ పెరగడంతోపాటు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ వ్యూహరచనలు చేస్తోంది బీజేపీ అధిష్ఠానం. ఈ క్రమంలోనే ప్రస్తుతం లక్ష్మణ్ను రాజ్యసభకు పంపుతున్నట్టు కొందరు విశ్లేషిస్తున్నారు. మిషన్ తెలంగాణలో మరో అడుగు పడినట్టుగా లెక్కలు వేస్తున్నారు నాయకులు. అయితే బీజేపీలో చాలా మంది సీనియర్లు రాజ్యసభ ఆశించారు. ఒక్క తెలంగాణనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ బీజేపీ సీనియర్లు కాచుకుని ఉన్నారు. వారందరినీ కాదని తెలంగాణకు ఛాన్స్ ఇచ్చింది కాషాయం పార్టీ.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
ఈ సమయంలో తెలంగాణ బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు రాష్ట్ర బీజేపీలో చాలా మంది సీనియర్లు పోటీ పడ్డారు. చాలాపేర్లు చర్చల్లోకి వచ్చాయి. కానీ.. వారెవరికీ పిలుపు రాలేదు. టీడీపీ నుంచి బీజేపీకిలోకి వచ్చిన మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎంపీలు జితేందర్రెడ్డి, విజయశాంతి, పార్టీ సీనియర్ నేత మురళీధర్రావుతోపాటు ఒకరిద్దరు పారిశ్రామిక వేత్తల పేర్లు వినిపించాయి. ఏపీ నుంచి టీజీ వెంకటేష్, సుజనా చౌదరి పేర్లనూ చర్చల్లో పెట్టారు. ఒక బలమైన సామాజికవర్గానికి పట్టం కడతారని చర్చ సాగింది. కానీ.. వాటన్నింటినీ తోసిరాజని డాక్టర్ లక్ష్మణ్ను ఎంపిక చేయడంతో కాషాయ శిబిరం ఉలిక్కి పడింది.
బీజేపీ పెద్దలు పార్టీలో పాత కాపుకే పట్టం కట్టారు. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన లక్ష్మణ్కు ఛాన్స్ ఇవ్వడంతో.. రాజకీయంగా మైలేజ్ వస్తుందని లెక్కలేస్తున్నారట. మున్నూరు కాపు సామాజికవర్గానికి పెద్దపీట వేయడం వల్ల ఆ వర్గం బీజేపీవైపు ఆకర్షితం అవుతుందని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అదే సామాజికవర్గం. మున్నూరు కాపు ఈక్వేషన్ ఏపీలోనూ కొంత పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుందన్నది పార్టీ వర్గాల మాట. మొత్తానికి బీసీ, మున్నూరుకాపు లెక్కల్లో బీజేపీ వేసిన ఈ ఎత్తుగడ చుట్టూనే చర్చ సాగుతోంది. అయితే.. ఇటీవల టీఆర్ఎస్ నుంచి గాయత్రి రవికి రాజ్యసభ ఇచ్చింది. ఏపీలో వైసీపీ బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది. దీంతో ఈ సమీకరణాల్లో భాగంగానే బీజేపీ కూడా బీసీ మంత్రాన్ని జపించి లక్ష్మణ్కు అవకాశం ఇచ్చిందనేవారూ ఉన్నారు. మరి.. ఈ లెక్కలు.. ఎక్కాలు కాషాయ శిబిరానికి తెలంగాణలో ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!