Gorantla Madhav : మాధవ్ వీడియోపై అనంతపురం జిల్లా టీడీపీ నేతల మౌనం వెనుక ఆంతర్యమేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధవ్ ఏపీతోపాటు ఢిల్లీలో కూడా రచ్చ చేస్తుంటే.. అనంత జిల్లా నేతలు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు? వైసీపీ నేతలంటే తమ పార్టీ నేత కాబట్టి సైలెంట్ గా ఉండటంలో అర్థం, పర్థం వుంది. కానీ అనంత టీడీపీ నేతలు సైతం ఎందుకు మౌనంలో మునిగి తేలుతున్నారు? సైలెన్స్ వెనక అసలు కథ వేరే వుందా?
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ఇష్యూలో, టీడీపీ నేతలు వైసీపీని నేరుగా టార్గెట్ చేసి విమర్శలు దాడి చేస్తున్నారు. ఇంతా జరుగుతుంటే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు మాత్రం మౌనంగా ఉంటున్నారు. వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే తమ పార్టీ నేత గురించి ఎందుకు మాట్లాడటం అనుకొని ఉండొచ్చు. అందునా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నారు. కానీ టీడీపీ నేతల మౌనం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అంటూ కొందరు పేరాలకు పేరాలు ఆరా తియ్యడం మొదలెట్టారు..
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
టీడీపీ అధిష్టానం ఓవైపు మాధవ్ విషయాన్ని క్యాష్ చేసుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే.. జిల్లా నేతలు మాత్రం ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించలేదు. దీనికి కారణాలను ఒక్కసారి పరిశీలిస్తే.. మాధవ్ కురుబ సామాజక వర్గానికి చెందిన కావడమే. ఎందుకంటే జిల్లాలో కురుబల జనాభా చాలా ఎక్కువగా ఉంది. హిందూపురం పార్లమెంట్ లో అయితే అన్ని నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎవరైనా మాధవ్ ను కించపరిచేలా మాట్లాడితే కురుబలు మాధవ్ ను ఓన్ చేసుకున్న నేపథ్యంలో, ఓట్ బ్యాంక్ కు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇదే సామాజిక వర్గానికి చెందిన పార్థసారధి మీడియా సమావేశం పెట్టి ఈ ఘటనపై స్పందిస్తున్నారు…విజువల్స్
టీడీపీ నేతల మౌనం వెనుక ఇంకో కోణం కూడా ఉందన్న ప్రచారం సాగుతోంది. మాధవ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టీడీపీ నేతలపై నిఘా పెట్టినట్టు సమాచారం. వారు తరచూ బెంగళూరుతో పాటు అటు వైపు ఉన్న ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు.. ప్రధానంగా రిస్టార్ట్ సెంటర్లు, మసాజ్ సెంటర్లు ఇలాంటి వాటిపై వైసీపీ నేతల నిఘా ఉందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బళ్లారి, గౌరిబిదునూరు, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్న నేతల మీద ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో కానీ ఇదే అంశంపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది.
మొత్తం మీద మాధవ్ వ్యవహారం.. కేవలం వైసీపీకి మాత్రమే కాదు.. ఇటు టీడీపీ నేతలకు కూడా తలనొప్పిగా మారింది. స్పందిస్తే ఒక తలనొప్పి.. స్పందించకపోతే ఇంకో తలనొప్పి అన్నట్టుగా మారింది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!