Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record What Did The Trs Ministers And Mps In Delhi

ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంపీలు ఏం సాధించారు…?

Published Date :December 26, 2021 , 11:10 am
By Manohar
ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ఎంపీలు ఏం సాధించారు…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

అయిననూ పోయిరావలె హస్తినకు అని.. ఢిల్లీ వెళ్లారు మంత్రులు, టీఆర్ఎస్‌ ఎంపీలు. తిరిగొచ్చేశారు కూడా. మరి.. ధాన్యం సేకరణపై ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు అధికారపార్టీకి ఈ టూర్‌ ఏ మేరకు ఉపయోగపడుతుంది?

ఇండియా గేట్‌ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల బృందం

Also Read

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
  • Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..
  • Off The Record: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి వింత కష్టం..!
  • Off The Record: అవనిగడ్డ కూటమిలో పరాకాష్టకు చేరిన ఆధిపత్య పోరు!

ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దగ్గర తాడోపేడో తేల్చుకుంటాం.. చర్చలు జరిపి తీపి కబురుతో తిరిగొస్తాం అని ప్రకటించిన మంత్రులు, ఎంపీల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. వారం రోజుల హస్తిన టూర్‌ ముగిసింది. ఢిల్లీ వెళ్లిన రెండు రోజుల తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ లభించింది. ఆ తర్వాత ఆయన కోరిన రెండు రోజుల గడువు ముగిసింది. మళ్లీ పీయూష్‌గోయల్ అపాయింట్‌మెంట్ కోరినా అటువైపు నుంచి స్పందన లేక తిరుగు ప్రయాణం అయ్యారు మంత్రులు, ఎంపీలు. వస్తూ వస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా సేకరించిన ధాన్యాన్ని ఇండియా గేట్‌ ముందు పారబోస్తామని హెచ్చరించారు. దీనితో ఈ వ్యవహారం రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత హీట్ పుట్టించబోతుంది అన్న వాదనలు మొదలయ్యాయి.

కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు వ్యూహరచన..!

తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్.. బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రతినిధుల బృందం డిమాండ్ చేసినట్టుగా కేంద్రం నుంచి లేఖ తీసుకుని రాకుండా తిరిగొచ్చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హస్తినకు వెళ్లిన వాళ్లు ఏం సాధించారు అనే కోణంలో విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. అయితే ప్రభుత్వ పరంగా చేయాల్సిన అన్ని ప్రయత్నాలను ప్రతినిధుల బృందం చేసిందని.. రానున్న రోజుల్లో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని అధికారపార్టీ వాదన. ఇండియా గేట్‌ దగ్గర ధాన్యం పారబోస్తామన్న మంత్రుల కామెంట్స్ ఇప్పడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి.

నిరసనల్లో అదే ఊపు కొనసాగిస్తారా?

ఇప్పటికే ధాన్యం సేకరణపై రాష్ట్రంలో దశల వారీగా ఉద్యమం చేపట్టింది ప్రభుత్వం. స్వయంగా సీఎం కేసీఆర్‌ ధర్నాలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు నిరసనలతో హోరెత్తించారు. తర్వాత నియోజకవర్గాల స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లారు నాయకులు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన కామెంట్స్‌పై భగ్గుమన్నారు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు. అదే ఊపును ఇకపైనా కొనసాగించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఒకవైపు విమర్శలకు బదులిస్తూనే.. బీజేపీని.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా రాజకీయ వ్యూహ రచన చేస్తోంది టీఆర్ఎస్‌. ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు అనే ప్రశ్నల పట్టించుకోకుండా భవిష్యత్‌ కార్యాచరణపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెడుతోందట అధికారపార్టీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Delhi
  • telangana
  • TRS
  • trs ministers
  • TRS MPs

తాజావార్తలు

  • Story Board: ట్రంప్‌ ప్రపంచాన్ని నిండా ముంచేశాడా..? అమెరికా, ఇరాన్‌ ఇప్పట్లో కోలుకోవా..?

  • Benjamin Netanyahu: ప్రొస్టేట్ క్యాన్సర్‌ను జయించిన నెతన్యాహూ..

  • Microsoft’s ‘Rule of 70’: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. మైక్రోసాఫ్ట్ తెచ్చిన ‘రూల్ ఆఫ్ 70’ వెనుక అసలు కథ ఇదే!

  • TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..!

  • Stop SIP: మార్కెట్ పడిపోతుందని SIP ఆపేస్తున్నారా..? అయితే మీరు కచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions