Congress : ఆ జాతీయ పార్టీ ఇంచార్జ్ హైదరాబాద్ లో రహస్యంగా చేసిందేంటి.? ఎవరినైనా కలిశారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ పర్యటనలో ఆ జాతీయ పార్టీ ఇంఛార్జ్ ఏం చేశారు? రహస్యంగా ఎవరైనా కలిసి మాట్లాడారా? రాష్ట్ర పార్టీ నేతలకు కూడా తెలియకుండా చేయాల్సిన అంత సీక్రెట్ వ్యవహారాలేంటి? ఇంతకీ ఆయన ఎవరు? హైదరాబాద్లో రహస్యంగా ఏం చేశారు? లెట్స్ వాచ్…!
మాణిక్యం ఠాగూర్. AICC తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్. హైదరాబాద్కు వచ్చుడే తక్కువ. అలాంటిది తాజా పర్యటనలో పెద్ద రాజకీయ చర్చకు తెరతీశారు. ఆదివారం ఉదయం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. రాజకీయ వ్యూహకర్త సునీల్తో కలిసి బయటకు వెళ్లారు ఠాగూర్. ఎక్కడికి వెళ్లారు? ఎవరితో భేటీ అయ్యారు అనేది రహస్యంగా ఉంచారట. దాంతో ఆ సీక్రెట్ ఏంటనే ఉత్కంఠ గాంధీభవన్ వర్గాల్లో పెరిగిపోతోంది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్. ఇప్పటికే రెండు దఫాలుగా పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సర్వేలు చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన ఓ అడుగు ముందుకేసి… ఏ నియోజకవర్గంలో ప్రత్యర్ధి పార్టీలలో బలమైన నాయకులు ఎవరనే లిస్ట్ తయారు చేశారట. ఆ జాబితాను రాహుల్ గాంధీకి అందజేసినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఠాగూర్, రేవంత్ అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే ఠాగూర్ పర్యటనల్లో సీక్రెట్ మీటింగ్లకు కొంత స్పేస్ ఇచ్చారట.
గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా ప్రచారంలో ఉన్న కొందరిని ఠాగూర్, రేవంత్లు రహస్యంగా కలిసి మాట్లాడినట్టు టాక్. అధికారపార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారట. వారిలో ఒకరు సిటీ ఎమ్మెల్యే కాగా.. ఇంకొకరు ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ్యుడిగా తెలుస్తోంది. అధికార TRS నుంచి నాయకులు బయటకు రావడం మొదలుపెట్టారు అనే చర్చ తేవడంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చూస్తుంది కాంగ్రెస్. దాంట్లో భాగంగానే TRSకి చెందిన మేయర్లు.. ZP ఛైర్మన్లకు కాంగ్రెస్ కండువా కప్పేస్తోంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టినట్టు సందేహిస్తున్నారు.
టీఆర్ఎస్ని ఇరకాటంలోకి నెట్టడంతోపాటు.. బీజేపీని కూడా రాజకీయంగా దెబ్బతీయాలనే ప్లాన్లో ఉంది కాంగ్రెస్. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారితో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లినట్టు చెబుతున్నారు. ఠాగూర్ రహస్య భేటీలో ఒక బీజేపీ సీనియర్ నేతతో సమావేశమైనట్టు ప్రచారం జరుగుతోంది. వివరాలు ఎక్కడా లీక్ కాకుండా కాంగ్రెస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. విషయం బయటకు వస్తే చేరికలు ఆగిపోతాయని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సి ఉన్నా.. భారీ వర్షాలతో బ్రేక్ పడింది. ఈ సమయంలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆగినట్టు సమాచారం. మరి.. ఠాగూర్ రహస్య సమావేశాలు పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో.. ఎంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకొంటారో చూడాలి.
తాజావార్తలు
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!