Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- పాక్ బహవల్పూర్లో జైషే మహ్మద్ స్థావరం పునర్నిర్మాణం..
- ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న మర్కజ్ సుభానల్లా ఉగ్ర స్థావరం..
- స్వయంగా పాక్ ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా దాడులు చేసింది. ఈ దాడుల్లో పీఓకే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, ట్రైనింగ్ క్యాంపుల్ని ధ్వంసం చేసింది. ఇందులో ముఖ్యంగా పీఓకేలోని మురిద్కే ఉన్న లష్కరే తోయిబా కార్యాలయం, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులోని బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్ర కార్యాలయాలను భారత్ ధ్వంసం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ (JeM) మార్కజ్ సుభాన్ అల్లా ప్రధాన కార్యాలయం ధ్వంసం చేయడం ఆపరేషన్ సిందూర్లోనే హైలెట్గా నిలిచింది. భారత్ 2025 మే 7న చేసిన దాడిలో జైష్ చీఫ్ మసూద్ అజార్ బంధువులు కూడా మరణించారు.
ఇదిలా ఉంటే దాడులు జరిగిన 15 నెలల తర్వాత జైష్ మళ్లీ తన కార్యాలయాన్ని పునర్నిర్మించుకుంది. గతేడాది మేలో భారత దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ కాంపౌండ్కు కొత్త మార్బుల్, పెయింట్, ప్లాస్టర్ వేశారు. దెబ్బతిన్న గోపురాలను కూడా తిరిగి నిర్మించారు. ప్రధాన హాల్లోని దాడుల ఆనవాళ్లను తొలగించి భవనాన్ని పునరుద్ధరించారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
జైషే కార్యాలయం నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా 25 కోట్ల పాక్ రూపాయాలను అందించినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 11 కోట్ల రూపాయల్ని ప్రధాన హాల్ పునర్నిర్మాణానికి ఖర్చు చేసినట్లు సమాచారం. ఇదే కాకుండా ప్రధాన కాంప్లెక్స్ను ఆనుకుని ఉన్న మద్రసా అల్ సబీర్, జైషే కమాండర్ల నివాస ప్రాంతాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇక్కడ కొత్త నిర్మాణ పనులు జరుగుతున్నట్లు సమాచారం.
మార్కజ్ సుభాన్ అల్లా అంతర్జాతీయ సరిహద్దు నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. 18 ఎకరాల్లో విస్తరించిన ఈ కాంప్లెక్స్ను ఉస్మాన్-ఓ-అలీ క్యాంపస్ అని కూడా పిలుస్తారు. ఇందులో మసీదుతో పాటు జైష్ కార్యకలాపాలకు సంబంధించిన పలు సౌకర్యాలు ఉన్నాయి. నిజానికి పాక్ ప్రభుత్వం 2002లో జైషే మహ్మద్ను నిషేధించినప్పటికీ, ఆ సంస్థ దేశంలో కార్యకలాపాలు సాగిస్తోంది. 2001 పార్లమెంట్ దాడి, 2016 పఠాన్కోట్ ఎయిర్బేస్ దాడి, 2019 పుల్వామా ఆత్మాహుతి దాడులను జైషే మహ్మద్ నిర్వహించింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!