TDP : అప్పట్లో పొగిడి పనులు చేయించుకున్నా నాయకులే ఇప్పుడు రివర్సవుతున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం టీడీపీలో మెదటినుంచీ రెండువర్గాలు. ఒకటి కింజరాపు కుటుంబం.. రెండోది మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వర్గం. అయినప్పటికీ తనదైనశైలిలో రాజకీయాలు నెరుపుతూ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసారు అప్పల సూర్యనారాయణ. 2014లో అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మిదేవి ఇరవైవేల ఓట్ల తేడాతో ధర్మాన ప్రసాదరావును ఓడించారు. 2019లో మాత్రం స్వల్ప తేడాతో ఓడిపోయారు. నాటి నుంచి చాపకింద నీరులా పార్టీలో అంతర్గత పోరు కోనసాగుతోందట. నియెజకవర్గం మినీ మహానాడు వేదికగా శ్రీకాకుళం టీడీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గుండ కుంటుంబాన్ని ధిక్కరిస్తున్న రూరల్ నేతలు.. యువతకు పట్టం కట్టాలని కొత్త స్వరం అందుకున్నారు. ఈ డిమాండ్స్ గుండ శిబిరాన్ని కలవర పెడుతున్నట్టు సమాచారం.
గుండ ఫ్యామిలీకి టిక్కెట్ రాకుండా చేయటానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారంట కింజరాపు కుటుంబం. నిన్నమెన్నటి వరకూ ఎంపీ రామ్మోహన్నాయుడు వర్గం యువతకి టికెట్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అచ్చెన్నాయుడి మనుషులగా మద్రపడిన కొందరు లక్ష్మీదేవికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టేశారట. దీంతో కింజరాపు ఫ్యామిలీ పేరు చెబితేనే మండిపడుతున్నారట మాజీ ఎమ్మెల్యే లక్ష్మిదేవి. శ్రీకాకుళం అసెంబ్లీలో పార్టీ పరిస్థితి ఏంటో నివేదిక ఇవ్వాలని టీడీపీ అధిష్ఠానం పరిశీలకులను నియమించినట్టు తెలుస్తోంది. లక్ష్మీదేవికి వ్యతిరేకంగా కొందరు లోకల్ లీడర్లను అచ్చెన్న అండ్ కో వెనకేసుకొస్తున్నట్టు టాక్.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ఈ పరిణామాలపై గుర్రుగా ఉన్న గుండ కుటుంబం.. అచ్చెన్న బ్యాచ్పై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు సమాచారం. అక్కడే తాడోపేడో తేల్చుకుంటామని అనుచరుల దగ్గర చెబుతోందట. ఇప్పటికీ శ్రీకాకుళంలో తమకు పట్టు సడలలేదని.. తమను కాదని వేరెవరు వచ్చినా పార్టీకి ప్రతికూలతే ఎదురవుతుందని సన్నిహితుల దగ్గర అంటున్నారట. దీంతో రానున్న రోజుల్లో సిక్కోలులో టీడీపీ లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా మారతాయని కేడర్ భావిస్తోంది. ఒకవైపు అధిష్ఠానం తిరిగి పుంజుకోవాలని చూస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆధిపత్యపోరాటం కేడర్ను కలవరపెడుతోందట. మరి.. ఈ విషయాన్ని టీడీపీ పెద్దలు గ్రహించారో లేదో అని ఒకరినొకరు ఆరా తీస్తున్నారట తెలుగు తమ్ముళ్లు.
తాజావార్తలు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్మేట్.!
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!