TRS : తెలంగాణ రాజకీయంలో కొత్తపుంతలు తొక్కుతున్న తూర్పు వర్గపోరు
నన్నపనేని నరేందర్.. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే. ఇంకొకరు బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మూడో వ్యక్తి గుండు సుధారాణి, వరంగల్ మేయర్. ఈ ముగ్గురి మధ్య వరంగల్ తూర్ప టీఆర్ఎస్ రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. కోల్డ్వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకరంటే ఒకరికి పడదు. ముగ్గురి మధ్య అనేక సందర్భాలలో అభిప్రాయభేదాలు బయటపడ్డాయి కూడా. గత ఏడాది దసరా సమయంలోనే రచ్చ రచ్చ అయింది. తాజాగా పట్టణ ప్రగతి కార్యక్రమం ఆ వర్గపోరును పీక్స్కు తీసుకెళ్లడంతో పార్టీలో చర్చగా మారింది.
బస్వరాజు సారయ్య గతంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. మేయర్ గుండు సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువగా రాజకీయాలు చేసేవారు. ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సైతం గతంలో వరంగల్ మేయర్గా చేశారు. ఇలా అందరికీ ఈ సెగ్మెంట్తో ఉన్న సంబంధాలు తూర్పు టీఆర్ఎస్లో సెగలు రేపుతున్నాయి. ఎమ్మెల్యేకు, మేయర్కు ఉప్పు నిప్పులా ఉంది రాజకీయం. సుధారాణి మేయర్ అయిన తర్వాత అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే నరేందర్కు సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా తూర్పులో మేయర్ పర్యటనలు చేయడంపై నరేందర్ వర్గం కుతకుతలాడుతోందట. దాంతో ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లు నిత్యం కాలు దువ్వే పరిస్థితి ఉంది.
Also Read
వరంగల్ నగరంలోని కొత్తవాడలో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ సారయ్య, మేయర్ సుధారాణి హాజరయ్యారు. లోకల్ ఎమ్మెల్యే నరేందర్ లేకపోవడంతో గొడవ రేగింది. స్థానిక శాసనసభ్యుడు లేకుండా ప్రొగ్రామ్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడంతో మేయర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఓరుగల్లు అభివృద్ధికి అధికారపార్టీ నేతలు కలిసి కట్టుగా పనిచేయాల్సింది పోయి.. ఎవరికి వారుగా కుంపట్లు రాజేయడంపై టీఆర్ఎస్ శ్రేణులు కలవర పడుతున్నాయట. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కార్యక్రమాలను వరంగల్ నగరంలో మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. ఆ జాబితాలో పట్టణ ప్రగతి కూడా చేరిపోయింది.
నియోజకవర్గాల్లో ఆధిపత్యం కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ప్రభుత్వ అధికారులకు సంకటంగా మారింది. ఒకరి మాట వింటే ఇంకొకరి కోపం వచ్చి ఇబ్బందుల్లో పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పార్టీ కేడర్ సైతం పనులు చేయించుకోవడానికి ఎవరిని ఆశ్రయిస్తే ఎవరికి కోపం వస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇలాంటి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉందనేది స్థానికంగా వినిపించే మాట. ఎన్నికల నాటికి ఈ వర్గపోరు ఇంకా శ్రుతిమించే సంకేతాలు కనిపిస్తున్నాయట. మరి.. వరంగల్ తూర్పు టీఆర్ఎస్లో ఆధిపత్య మంటలను చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!