పెద్దపల్లి నియోజకవర్గంలో తారాస్థాయికి చేరుకున్న టీఆర్ఎస్ వర్గ పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం టీఆర్ఎస్లో అగ్గి రాజేస్తోంది. అధికారులు చేస్తున్నారో లేక ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెరవెనక చక్రం తిప్పుతున్నారో అర్థం కావడం లేదన్నది కేడర్ చెప్పేమాట. ఇటీవల మంత్రి హరీష్రావు పర్యటనలో జరిగిన నాటకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చగా మారాయి. ప్రొటోకాల్ రగడ వర్గపోరు తీవ్రతను బయటపెట్టింది.
మంత్రి హరీష్రావు ప్రారంభించిన మాతాశిశు కేంద్రం శిలాఫలకంపై మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు కన్నా పైన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేరు చెక్కించారు. దీనిపై కొప్పుల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అధికారుల వైఖరిపై అనుమానం వ్యక్తం చేస్తూ జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొన్ని సందర్భాలలో ఎమ్మెల్యే చెప్పినట్టే అధికారులు చేస్తున్నారని.. అలా జరగకుండా చూడాలని కోరారట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
గతంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఫొటో పెట్టలేదని ఎమ్మెల్యే మనోహర్రెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ వర్గీయులు. తాజా గొడవ మరో లెవల్కు చేరుకుందని చర్చ జరుగుతోంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని కొప్పుల అనుచరులతోపాటు జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. దాంతో రాత్రికి రాత్రి శిలాఫలకాన్ని అధికారులు తొలగించేశారు. ఈ అంశంలో మొదలైన రచ్చ.. ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి తలనొప్పిగా మారిందనే ప్రచారం జరుగుతోంది.
ప్రొటోకాల్ అంశాలపై పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్లో జరుగుతున్న వరుస ఘటనలపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయిందట. ఎమ్మెల్యే మనోహర్రెడ్డి తీరుపై పార్టీలో కొందరు అసహనం వ్యక్తం చేయడం.. పోలీసులతో కేసులు పెట్టించడం మీద ఫిర్యాదులు అందాయట. ఉద్దేశపూర్వకంగానే కొందరు పార్టీ నేతలను అవమానిస్తున్నారని.. ఎమ్మెల్యే చెప్పకుండా అధికారులు ప్రొటోకాల్ వివాదంలో ఎందుకు ఇరుక్కుంటారని ఎదురుదాడి చేస్తున్నారట. మొత్తానికి విభేదాలు పార్టీలోని కిందిస్థాయి సిబ్బందిని.. అధికారులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సుప్రీమ్గా ఉండాలని చూస్తారు. ప్రారంభోత్సవాల్లో మరొకరి పెత్తనాన్ని సహించలేరు. అది సొంత జిల్లాకు చెందిన మంత్రులైనా గ్యాప్ మెయింటైన్ చేస్తుంటారు. పెద్దపల్లి రగడ కూడా ఆ కోవలోనే చూడాలని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి.. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు పార్టీ పెద్దలు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!