హరీష్రావు, వినోద్కుమార్లకు హుజురాబాద్ బాధ్యతలు…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతలను టీఆర్ఎస్ ఆ ఇద్దరు నేతలకు అప్పగించిందా? వెంటనే వారు రంగంలోకి దిగిపోయారా? క్షేత్రస్థాయి కార్యకర్తలు.. లోకల్ లీడర్స్తో టచ్లోకి వెళ్లారా? హుజురాబాద్లో గులాబీ పార్టీ అనుసరిస్తున్న కొత్త వ్యూహం ఏంటి? ఇంతకీ ఎవరా నాయకులు? లెట్స్ వాచ్!
అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఐదు ఉపఎన్నికలు
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఉపఎన్నికలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ వ్యూహాలు ఇతర పార్టీలకు భిన్నంగా.. దూకుడుగా ఉంటాయి. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అయిదు ఉపఎన్నికలను ఎదుర్కోంది. మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు నారాయణఖేడ్, పాలేరు ఉపఎన్నికల్లో రెండుచోట్లా గెలిచింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూర్నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలను ఫేస్ చేసింది. హుజూర్నగర్ ఉపఎన్నిక బాధ్యతను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకుంది అధికారపార్టీ. ఆ తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నిక బాధ్యతలు మంత్రి హరీష్రావు చేపట్టారు. ఆ ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయింది గులాబీపార్టీ. నాగార్జున్సాగర్ ఉపఎన్నికను పార్టీ పెద్దలు నేరుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి గెలుచుకున్నారు.
హుజురాబాద్ బాధ్యత ఇద్దరు సీనియర్లకు అప్పగింత
ప్రతి ఉపఎన్నికనూ అధికారపార్టీ సీరియస్గానే తీసుకుంది. ఇంఛార్జులను పెట్టి పాగా వేయడానికి ప్రయత్నించింది. పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆ ఇంచార్జ్లు నియెజకవర్గంలో క్షేత్రస్థాయిలో అమలు చేశారు. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్పై టీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇద్దరు సీనియర్ నేతలకు హుజుర్నగర్ బైఎలక్షన్ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వినోద్కుమార్, హరీష్రావులకు ఉపఎన్నిక బాధ్యతలు?
జిల్లా మంత్రులతో ఇప్పటికే సమాలోచనలు
ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ నియెజకవర్గ ఉపఎన్నికకు టీఆర్ఎస్ రెడీ అవుతోంది. మండలాల వారీగా ఇంచార్జీలను నియమించారు. మొత్తంగా నియెజకవర్గ ఉపఎన్నికను పర్యవేక్షించేందుకు ఇద్దరు సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారట. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, మంత్రి హరీష్ రావులకు హుజురాబాద్ వ్యవహారాలను పర్యవేక్షించాలని పార్టీ పెద్దలు సూచించారట. దీంతో ఆ నియెజకవర్గానికి సంబంధించి.. అక్కడి నేతలు, మండలాల ఇంఛార్జులతో వీరిద్దరూ టచ్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏమైన ప్రతినిధి బృందాలు ఉంటే తీసుకువచ్చి.. వీరితో భేటీలు ఏర్పాటు చేయిస్తున్నారట. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులతోనూ ఎన్నికల వ్యూహంపై సమాలోచనలు చేసినట్టు టాక్.
ఎన్నడూ లేని విధంగా ఇద్దరికి బాధ్యతలు
మొత్తంగా హుజురాబాద్ ఉపఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. గతంలో ఏన్నడూ లేని విధంగా ఇద్దరు సీనియర్ నేతలకు ఎలక్షన్ వ్యవహారాలను అప్పగించడం అంటే … ఉపపోరు ఓ రేంజ్లో ఉంటుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!