టీఆర్ఎస్, బీజేపీ సరికొత్త కొట్లాట వేడి రాజేస్తోందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు పక్షాల మధ్య కొత్త అంశం సరికొత్త కొట్లాటకు వేడి రాజేస్తోంది.
రుణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానాలపై నిప్పులు తొక్కుతున్నారు గులాబీ నాయకులు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రానికి వినిపించారు. అక్కడి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. దీంతో రుణం కోసం రణం చేయాలని రాష్ట్రంలోని అధికారపక్షం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం మూడు దశల్లో ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే.. వైఖరి మార్చుకోవాలని ఢిల్లీకి లేఖ రాయడం అందులో మొదటిది. స్పందన లేకపోతే.. ఈ నెలాఖరులో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి మోడీ ప్రభుత్వ తీరును శాసనసభలో ఎండగట్టే ప్రయత్నం చేయడం రెండోది. ఈ సందర్భంగా కేంద్రం చేస్తున్న అప్పులు.. ఆర్థిక విధానాలను అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ప్రస్తావించే ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
మొదటి, రెండు దశల యుద్ధానికి కేంద్రం చలించకపోతే.. సమస్యను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న వెసులుబాటులను టీఆర్ఎస్ సర్కార్ పరిశీలించే అవకాశం ఉంది. ఇలా మూడు విధానాల్లో పోరాటం చేస్తూనే.. ప్రజల్లో అటెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమాలకూ రూపకల్పన చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వ వైఖరివల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ పాలకులు. పైగా రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొని ఉండటంతో ఈ అంశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లి పొలిటికల్గా పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారట. రుణ అనుమతుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకుంటుందో లేదో తెలియదు. కానీ.. రుణం కోసం చేసే రగడ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!