టీఆర్ఎస్, బీజేపీ సరికొత్త కొట్లాట వేడి రాజేస్తోందా..?
కొంతకాలంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధాన పరంగా పలు అంశాలపై కేంద్రాన్ని గట్టిగానే కార్నర్ చేస్తోంది రాష్ట్రంలోని అధికారపక్షం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రోడ్డోక్కి కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ నిరసన చేపట్టారు. తెలంగాణలో పొటికల్ టెంపరేచర్ పెరిగిన తర్వాత రెండు పార్టీల మధ్య సెగలు మరింతగా రాజుకుంటున్నాయి. ఇప్పుడు రెండు పక్షాల మధ్య కొత్త అంశం సరికొత్త కొట్లాటకు వేడి రాజేస్తోంది.
రుణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతోంది. మోడీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానాలపై నిప్పులు తొక్కుతున్నారు గులాబీ నాయకులు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనను కేంద్రానికి వినిపించారు. అక్కడి నుంచి సరైన స్పందన లేదని తెలుస్తోంది. దీంతో రుణం కోసం రణం చేయాలని రాష్ట్రంలోని అధికారపక్షం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ యుద్ధం మూడు దశల్లో ఉంటుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే.. వైఖరి మార్చుకోవాలని ఢిల్లీకి లేఖ రాయడం అందులో మొదటిది. స్పందన లేకపోతే.. ఈ నెలాఖరులో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి మోడీ ప్రభుత్వ తీరును శాసనసభలో ఎండగట్టే ప్రయత్నం చేయడం రెండోది. ఈ సందర్భంగా కేంద్రం చేస్తున్న అప్పులు.. ఆర్థిక విధానాలను అసెంబ్లీ ప్రత్యేక భేటీలో ప్రస్తావించే ఆలోచనలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
మొదటి, రెండు దశల యుద్ధానికి కేంద్రం చలించకపోతే.. సమస్యను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న వెసులుబాటులను టీఆర్ఎస్ సర్కార్ పరిశీలించే అవకాశం ఉంది. ఇలా మూడు విధానాల్లో పోరాటం చేస్తూనే.. ప్రజల్లో అటెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమాలకూ రూపకల్పన చేస్తున్నారు గులాబీ నేతలు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వ వైఖరివల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ పాలకులు. పైగా రాష్ట్రంలో రాజకీయ వేడి నెలకొని ఉండటంతో ఈ అంశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లి పొలిటికల్గా పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారట. రుణ అనుమతుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకుంటుందో లేదో తెలియదు. కానీ.. రుణం కోసం చేసే రగడ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!