YSRCP Kondapi Leader : అక్కడి వైసీపీలో కోప తాపాలు ఏ మాత్రం తగ్గడం లేదా.? నేతల్లో మార్పు రావడం లేదా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొండెపి వైసీపీలో కోప తాపాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఠాల కుమ్ములాటలతో చేజేతులా సీటు పోగొట్టుకున్నా అక్కడి నేతల్లో మార్పు లేదట. గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం రిపేర్లు చేసినా.. సేమ్ సీన్. కొత్త ఇంఛార్జ్కి అప్పుడే చుక్కలు చూపిస్తోంది ప్రత్యర్థి వర్గం. ప్రత్యర్థి పార్టీల మీద చేయాల్సిన నెగిటివ్ ప్రచారాన్ని.. సొంతపార్టీ మీదే కరపత్రాలు వేసి మరీ చేస్తున్నారట. శ్రుతి మించి రాగాన పడుతున్న కొండెపి కుమ్ములాటలు ఏ రేంజ్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మాదాసి వెంకయ్య.. వరికూటి అశోక్బాబు. ఈ ఇద్దరి చుట్టూనే కొండపి వైసీపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అశోక్బాబు వైసీపీ కొండపి ఇంఛార్జ్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. గతంలో ఇంఛార్జ్గా పనిచేసిన మాదాసి వెంకయ్య అనుచరులతో కలిసి ప్రత్యేకగా ప్రొగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. నియోజవర్గం ఒకటే అయినా.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ.. ఎవరి వర్గం వాళ్లదే. అస్సలు పడదు. రోజుకో కొత్త గొడవ సెగలు రేపుతూ ఉంటుంది. తాజాగా గోడపై రాతల చెరిపివేత.. కరపత్రాల పంపిణీ నిప్పు రాజేసింది.
Also Read
కొండపి వైసీపీ కార్యాలయ గోడ మీద ఉన్న ఇంచార్జ్ వరికూటి అశోక్ బాబు పేరుపై కొందరు తెల్లటి పెయింట్ వేశారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పొక్కి పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. ఆ మధ్య టంగుటూరులో వైసీపీ ప్లీనరీ సమయంలోనూ అశోక్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని పలు బడ్డీ బంకుల వద్ద కరపత్రాలు పంపిణీ చేవారు. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తికి ఇంఛార్జ్ పదవి ఎలా ఇస్తారని ఆ కరపత్రాల్లో ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నష్టం కలిగించిన వారికి అశోక్బాబు సాయ పడ్డారని వాటిల్లో ఆరోపించారు కూడా. అక్కడితో ఆగకుండా.. బాలినేని, వైవీ సుబ్బారెడ్డిలపై గతంలో అశోక్బాబు నోరు పారేసుకున్నారని.. అలాంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించితే ఓటమి తప్పదని ఆ కరపత్రాల్లో హెచ్చరించడం చర్చగా మారింది.
ఆ కరపత్రాలను ఎవరు ముద్రించారు? ఎందుకు పంపిణీ చేశారు? ఇందులో మాదాసి వర్గం ప్రాత్ర ఉందా లేదా అని కొండపి వైసీపీలో ఒక్కటే చర్చ. టీడీపీకి చెందిన పక్క నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండపి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. పార్టీలో ఈ రచ్చ పీక్స్కు వెళ్తోంది. ఈ గ్రూపుల గోల పైస్థాయిలోనే కాకుండా మండలాలకు కూడా పాకింది. పార్టీ ఇంఛార్జ్ గా ఎవరు ఉన్నా ఓ వర్గం మాత్రమే వారితో కలిసి ఉంటోంది. రెండోవర్గం వైరిపక్షంగా మారిపోతుంది. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మాదాసి వెంకయ్య.. మొన్నటి వరకూ కొండేపి వైసీపీ ఇంఛార్జ్. ఆయన పార్టీలో చేరే వరకూ ఇంచార్జ్ గా ఉన్న అశోక్ బాబు కలసి పనిచేయక పోవటంతో ఓడిపోయామనేది మాదాసి వర్గం అనుమానం.
మాదాసి వెంకయ్యను డీసీసీబీ చైర్మన్ను చేసింది వైసీపీ అదిష్టానం. ఇంకోవైపు ఇంఛార్జ్ పదవి పోయినా టంగుటూరులోనే తన మకాం ఏర్పాటు చేసుకున్న అశోక్ బాబు అండ్ టీమ్ మాదాసి వర్గానికి ఎప్పుడూ చెక్ పెడుతూ ఉండేది. ఇంతలో ఇంఛార్జ్ పదవి నుంచి వెంకయ్యను తప్పించి అశోక్ బాబుకు తిరిగి పగ్గాలు అప్పగించింది. ఆ హోదాలో లోకల్ వైసీపీ నేతలు, కార్యకర్తలతో అశోక్బాబు సమావేశాలు ఏర్పాటు చేస్తే.. అందులో మాదాసి వర్గం కనిపించలేదు. ఇప్పుడు గోడపై రాతల చెరిపివేత.. కరపత్రాల వరకు సమస్య శ్రుతిమించింది. వీటి వెనక ఎవరున్నారో కానీ.. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేసుకుంటున్న పరిస్థితి. మరి.. ఈ సమస్యను వైసీపీ అధిష్ఠానం పరిష్కరిస్తుందా? గత ఎన్నికల్లో చేజారిన సీటులో ఈసారి పాగా వేసేందుకు ఏం చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!