Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో గొడవ
- పాకిస్తాన్ టీమ్, అభిమానులకు ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ..
- మైదానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న పాక్- ఇంగ్లాండ్ ఫ్యాన్స్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న చిన్న జట్లపై భారీ విజయాలు సాధిస్తూ, తమను తాము టాప్ జట్టుగా చెప్పుకునే పాకిస్తాన్, జింబాబ్వే, నేపాల్ లాంటి అసోసియేట్ జట్లపై చెలరేగే బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ ను ‘కింగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ప్రయాణం ఆశించినంత సాఫీగా కొనసాగడం లేదు. భారత్ చేతుల్లో ఓడిన తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్–8కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో లక్కీగా ఒక పాయింట్ను ఖాతాలో వేసుకుంది.
Read Also: Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్లో గెలిచినా సెమీఫైనల్ చేరాలనే పాకిస్తాన్కు బాగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఆతిథ్య శ్రీలంక క్రికెట్ జట్టుపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, న్యూజిలాండ్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలని ఆశిస్తుంది.
Read Also: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
కాగా, పల్లెకెలేలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇంగ్లాడ్ రెండు వికట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో హ్యారీ బ్రూక్ సేన సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఓటమిపై ఓ ఇంగ్లాండ్ అభిమాని చేసిన కామెంట్కు ఆగ్రహించిన దాయాది దేశ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త కొట్టుకునే స్థాయికి చేరడంతో.. ఇతర క్రికెట్ ఫ్యాన్స్ జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ మొత్తం ఘటనను ఓ శ్రీలంక క్రికెట్ అభిమాని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మొబైల్లో రికార్డు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక, ఈరోజు ( ఫిబ్రవరి 25న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ జరగనుంది. అయితే, గ్రూప్–2 నుంచి సెమీఫైనల్కు చేరే రెండో జట్టును డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Play silly games, win silly prizes.
Serial offender. Time for the @ICC to take a stand. #cricket #worldcup pic.twitter.com/pdbrAG13tY
— Jake Jeakings (@JakeJeakings1) February 24, 2026
తాజావార్తలు
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
-
Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!