Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో గొడవ
- పాకిస్తాన్ టీమ్, అభిమానులకు ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ..
- మైదానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న పాక్- ఇంగ్లాండ్ ఫ్యాన్స్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న చిన్న జట్లపై భారీ విజయాలు సాధిస్తూ, తమను తాము టాప్ జట్టుగా చెప్పుకునే పాకిస్తాన్, జింబాబ్వే, నేపాల్ లాంటి అసోసియేట్ జట్లపై చెలరేగే బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ ను ‘కింగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ప్రయాణం ఆశించినంత సాఫీగా కొనసాగడం లేదు. భారత్ చేతుల్లో ఓడిన తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్–8కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో లక్కీగా ఒక పాయింట్ను ఖాతాలో వేసుకుంది.
Read Also: Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్లో గెలిచినా సెమీఫైనల్ చేరాలనే పాకిస్తాన్కు బాగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఆతిథ్య శ్రీలంక క్రికెట్ జట్టుపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, న్యూజిలాండ్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలని ఆశిస్తుంది.
Read Also: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
కాగా, పల్లెకెలేలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇంగ్లాడ్ రెండు వికట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో హ్యారీ బ్రూక్ సేన సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఓటమిపై ఓ ఇంగ్లాండ్ అభిమాని చేసిన కామెంట్కు ఆగ్రహించిన దాయాది దేశ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త కొట్టుకునే స్థాయికి చేరడంతో.. ఇతర క్రికెట్ ఫ్యాన్స్ జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ మొత్తం ఘటనను ఓ శ్రీలంక క్రికెట్ అభిమాని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మొబైల్లో రికార్డు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక, ఈరోజు ( ఫిబ్రవరి 25న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ జరగనుంది. అయితే, గ్రూప్–2 నుంచి సెమీఫైనల్కు చేరే రెండో జట్టును డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Play silly games, win silly prizes.
Serial offender. Time for the @ICC to take a stand. #cricket #worldcup pic.twitter.com/pdbrAG13tY
— Jake Jeakings (@JakeJeakings1) February 24, 2026
తాజావార్తలు
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!