Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో గొడవ
- పాకిస్తాన్ టీమ్, అభిమానులకు ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ..
- మైదానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న పాక్- ఇంగ్లాండ్ ఫ్యాన్స్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న చిన్న జట్లపై భారీ విజయాలు సాధిస్తూ, తమను తాము టాప్ జట్టుగా చెప్పుకునే పాకిస్తాన్, జింబాబ్వే, నేపాల్ లాంటి అసోసియేట్ జట్లపై చెలరేగే బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ ను ‘కింగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ప్రయాణం ఆశించినంత సాఫీగా కొనసాగడం లేదు. భారత్ చేతుల్లో ఓడిన తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్–8కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో లక్కీగా ఒక పాయింట్ను ఖాతాలో వేసుకుంది.
Read Also: Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
Also Read
- T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ విడుదల.. ఈ సారి టీమిండియా ర్యాంక్ ఎంతో తెలుసా..
- Shubman Gill Instagram Post Creates Stir: శుభ్మన్ గిల్ పోస్ట్పై దుమారం.. ఆటాడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్..
- Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్దీప్ సింగ్ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!
- Prize Money : టీ20 వరల్డ్ కప్ లో.. జట్ల వారీగా ప్రైజ్ మనీ ఎంతెంతంటే....?
అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్లో గెలిచినా సెమీఫైనల్ చేరాలనే పాకిస్తాన్కు బాగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఆతిథ్య శ్రీలంక క్రికెట్ జట్టుపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, న్యూజిలాండ్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలని ఆశిస్తుంది.
Read Also: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
కాగా, పల్లెకెలేలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇంగ్లాడ్ రెండు వికట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో హ్యారీ బ్రూక్ సేన సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఓటమిపై ఓ ఇంగ్లాండ్ అభిమాని చేసిన కామెంట్కు ఆగ్రహించిన దాయాది దేశ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త కొట్టుకునే స్థాయికి చేరడంతో.. ఇతర క్రికెట్ ఫ్యాన్స్ జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ మొత్తం ఘటనను ఓ శ్రీలంక క్రికెట్ అభిమాని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మొబైల్లో రికార్డు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక, ఈరోజు ( ఫిబ్రవరి 25న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ జరగనుంది. అయితే, గ్రూప్–2 నుంచి సెమీఫైనల్కు చేరే రెండో జట్టును డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Play silly games, win silly prizes.
Serial offender. Time for the @ICC to take a stand. #cricket #worldcup pic.twitter.com/pdbrAG13tY
— Jake Jeakings (@JakeJeakings1) February 24, 2026
తాజావార్తలు
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!