Pakistan Fans Clash: పాకిస్తాన్ ఘోర ఓటమి.. స్టేడియంలో ఇంగ్లాండ్ ఫ్యాన్స్తో గొడవ
- పాకిస్తాన్ టీమ్, అభిమానులకు ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ..
- మైదానంలో పొట్టు పొట్టు కొట్టుకున్న పాక్- ఇంగ్లాండ్ ఫ్యాన్స్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Fans Clash: ఆట తక్కువ, ఓవరాక్షన్ ఎక్కువ అనే మాట పాకిస్తాన్ క్రికెట్ టీమ్కు, వారి ఫ్యాన్స్ కి కరెక్టుగా సరిపోతుందని మరోసారి తేలిపోయింది. చిన్న చిన్న జట్లపై భారీ విజయాలు సాధిస్తూ, తమను తాము టాప్ జట్టుగా చెప్పుకునే పాకిస్తాన్, జింబాబ్వే, నేపాల్ లాంటి అసోసియేట్ జట్లపై చెలరేగే బ్యాట్స్మన్ బాబర్ ఆజమ్ ను ‘కింగ్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తోంది. కాగా, టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ ప్రయాణం ఆశించినంత సాఫీగా కొనసాగడం లేదు. భారత్ చేతుల్లో ఓడిన తర్వాత అసోసియేట్ దేశాలపై గెలిచి సూపర్–8కి చేరుకుంది. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడంతో లక్కీగా ఒక పాయింట్ను ఖాతాలో వేసుకుంది.
Read Also: Adulterated Milk: కల్తీ పాలు తాగి ఐదుగురు మృతి, 8 మంది ఆరోగ్య పరిస్థితి విషమం
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఇంగ్లాండ్ తో జరిగిన రెండో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో చివరి మ్యాచ్లో గెలిచినా సెమీఫైనల్ చేరాలనే పాకిస్తాన్కు బాగా లక్ కలిసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే ఆతిథ్య శ్రీలంక క్రికెట్ జట్టుపై భారీ విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాదు, న్యూజిలాండ్ కూడా తమ మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఓడిపోవాలని ఆశిస్తుంది.
Read Also: Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క మాత్రం వేరే!
కాగా, పల్లెకెలేలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై ఇంగ్లాడ్ రెండు వికట్ల తేడాతో గెలిచింది. ఈ గెలుపుతో హ్యారీ బ్రూక్ సేన సెమీఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ఇంగ్లాండ్, పాకిస్తాన్ అభిమానుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాక్ ఓటమిపై ఓ ఇంగ్లాండ్ అభిమాని చేసిన కామెంట్కు ఆగ్రహించిన దాయాది దేశ ఫ్యాన్స్ అతడితో వాగ్వాదానికి దిగాడు. మాటల యుద్ధం కాస్త కొట్టుకునే స్థాయికి చేరడంతో.. ఇతర క్రికెట్ ఫ్యాన్స్ జోక్యం చేసుకుని గొడవను ఆపారు. ఈ మొత్తం ఘటనను ఓ శ్రీలంక క్రికెట్ అభిమాని బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ మొబైల్లో రికార్డు చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇక, ఈరోజు ( ఫిబ్రవరి 25న) కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో న్యూజిలాండ్- శ్రీలంక మ్యాచ్ జరగనుంది. అయితే, గ్రూప్–2 నుంచి సెమీఫైనల్కు చేరే రెండో జట్టును డిసైడ్ చేసే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిస్తే శ్రీలంకతో పాటు పాకిస్తాన్ కూడా దాదాపు సెమీస్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
Play silly games, win silly prizes.
Serial offender. Time for the @ICC to take a stand. #cricket #worldcup pic.twitter.com/pdbrAG13tY
— Jake Jeakings (@JakeJeakings1) February 24, 2026
తాజావార్తలు
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
-
Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!