Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Tdp Ex Mla And Ex Mlc Doing Minus To The Party In Parvathipuram

లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తే పార్టీ బలపడుతుందా..?

Published Date :November 24, 2021 , 12:21 pm
By Manohar
లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తే పార్టీ బలపడుతుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించిన నాయకులు ఉంటే.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ.. అక్కడ సీన్‌ రివర్స్‌. లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తున్నారట. ఆ ఇద్దరూ ఉమ్మడిగా పార్టీని కిల్‌ చేస్తున్నారనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ? ఎవరా నాయకులు..?

పార్టీ పవర్‌కు దూరం కావడంతో నేతలు సైలెంట్‌ మోడ్‌..!

టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆ పార్టీ నాయకులు ఆడింది ఆట.. పాడింది పాట..! పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కూడా ఇక్కడ ఎవరి ఆట వాళ్లు ఆడేస్తున్నారు. వారి చర్యలు.. వైఖరి.. పార్వతీపురంలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసేలా ఉందని కేడర్‌ ఆందోళన చెందుతుందట. గతంలో బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యేగా.. ద్వారపురెడ్డి జగదీష్‌ ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీ ఓడిన తర్వాత.. తామూ ఓడి.. చేతిలో పవర్‌ లేకపోవడంతో పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు ఆ ఇద్దరు. కేవలం అధికారం లేక వీళ్లు ఇలా కాలేదు. గతం వెంటాడుతుండటంతో గమ్మున అయ్యారట.

అధికారంలో ఉన్నప్పుడు నిధులు పక్కదారి పట్టించారా?

మాజీ ఎమ్మెల్సీ జగదీష్ భార్య 2015 నుంచి 2020 వరకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జగదీష్ సోదరుడితో కలిసి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు టీడీపీ కేడర్‌ ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకొంటోందట. కాంట్రాక్టులన్నీ మరిదికి కట్టబెట్టి మున్సిపల్‌ నిధులు పక్కదారి పట్టించారని చెబుతారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తక్కువేం చేయలేదన్నది తమ్ముళ్ల వాదన. పార్టీ నాయకులు ఏదైనా పనిపై వెళ్లితే.. నాకేంటి లాభం అని ముఖం మీదే అడిగేవారని ఆరోపిస్తూ.. నాటి ఘటనలను మర్చిపోలేకపోతున్నారట.

తమ బాగోతాలు బయటపడి దొరికిపోతామని భయపడ్డారా?

మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్సీల వైఖరితో జనమే కాకుండా టీడీపీ కేడర్‌ విసుగెత్తిపోయినట్టు చెబుతారు. రివెంజ్‌ కోసం ఎదురు చూసి.. 2019 ఎన్నికల్లో సగం మంది టీడీపీ కేడర్‌ వైసీపీ వైపు టర్న్‌ తీసుకున్నట్టు సమాచారం. దాంతో ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాలకు గండిపడి… వైసీపీ నుంచి బరిలో ఉన్నా జోగారావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాతైన పార్టీ నేతలు గుణపాఠం నేర్చుకోలేదట. అధికారమే దూరమైన తర్వాత రోడ్డెక్కడం ఎందుకు అనుకున్నారో లేక.. బయటకొస్తే తమ బాగోతాలు బయటపడి అధికార వైసీపీకి దొరికి పోతామని భయపడ్డారో కానీ ఇద్దరికి ఇద్దరూ సైలెంట్‌ అయిపోయారు. ప్రస్తుతం పార్వతీపురం ప్రజల సమస్యలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదట.

ఆరు వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం..లోపాయికారీ ఒప్పందమేనా?

పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం చిరంజీవులు, జగదీష్‌లు లీడ్‌ రోల్‌ తీసుకోలేదనే విమర్శ పార్టీ వర్గాల్లో ఉంది. పైగా ఇద్దరూ వైసీపీతో కుమ్మక్కయ్యారని చెవులు కొరుక్కుంటోంది కేడర్‌. పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటే.. 24 చోట్లే మాత్రమే టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరు వార్డుల్లో అభ్యర్ధులే కరువయ్యారు. దీంతో ఆ ఆరు వార్డులు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఆ ఇద్దరూ వైసీపీతో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందం మేరకే ఆ ఆరుచోట్లా అభ్యర్థులను పెట్టలేదని ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట పార్టీ కేడర్‌.

టీడీపీ కేడర్‌ గగ్గోలు పెట్టినా.. పట్టించుకోవడం లేదా?

ఇక నియోజకవర్గంలో టీడీపీకి కీలకమైన సీతానగరం మండలంలో ఆ పార్టీ పూర్తిగా వాష్‌ అవుట్‌. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యే జోగారావు సైతం టీడీపీలో ఉన్న లుకలుకలను క్యాష్ చేసుకుంటూ.. పూర్తిస్థాయిల పార్వతీపురంలో విస్తరిస్తున్నారట. ఇది కూడా టీడీపీ బలహీనం కావడానికి కారణమవుతోంది గగ్గోలు పెడుతోంది కేడర్‌. రాష్ట్రంలో కీలక రాజకీయ అంశాలపై ఫోకస్‌ పెట్టిన టీడీపీ పెద్దలు.. పార్వతీపురాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో జెండా పట్టుకుని ఉన్న కొద్దిమందీ మెల్లగా జారుకునే పనిలో ఉన్నారట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ex-mlc
  • parvathipuram
  • tdp ex-mla
  • TDP Party

తాజావార్తలు

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions