YCP : ఆయన లేనిదే అడుగు కూడా వేసేవారు కాదట..! ఇంతకీ ఎవరాయన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది ఇద్దరికి ఏమైందో ఏమో.. ఉప్పు నిప్పులా మారిపోయారు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదట ఇద్దరు నాయకులు. అదే శృంగవరపుకోట వైసీపీలో చర్చగా మారింది.
రఘురాజు ఎమ్మెల్సీ అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చిందని చెవులు కొరుక్కుంటాయి వైసీపీ శ్రేణులు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు.. ఎమ్మెల్సీ రఘురాజులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బొత్స ఆశీసులతో ఎమ్మెల్సీ అయ్యాక శృంగవరపుకోటలో రఘురాజు దూకుడు పెంచినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఆయన లెక్క చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. ప్రొటోకాల్ పక్కాగా పాటించాలని అధికారులు హుకుం జారీ చేసినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట. ఈ మార్పు ఏంటో అర్థంకాక ఎమ్మెల్యే బిత్తరపోతున్నారట.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
మనోడే కదా అని చంకన పెట్టుకుంటే.. ఇప్పుడు ఏకంగా నెత్తిన కూర్చున్నారని ఎమ్మెల్సీ రఘురాజును ఉద్దేశించి అనుచరుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే శ్రీనివాస్రావు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో.. నియోజకవర్గంలో పట్టు సాధించడం ఎలాగో అర్థం కావడం లేదట. ఇన్నాళ్లూ జరిగిన పొరపాట్లు ఏంటా అని జాబితా సిద్ధం చేస్తున్నారట. వాటిని సరిదిద్దుకొనే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దూరం పెట్టిన సొంత సామాజికవర్గాన్ని మళ్లీ చేరదీసుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారట. ఎమ్మెల్సీపై ఏదోలా రివేంజ్ తీసుకోవాలని చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ మిత్రభేదంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. లేక విభేదాలను పక్కన పెట్టి మళ్లీ మిత్రులుగా ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!