విజయనగరం జిల్లా శృంగవరపు కోట రాజకీయం సలసలకాగుతోందట. ఇక్కడ.. ఎవరు సొంతోళ్ళో... ఎవరు ప్రత్యర్థులో కూడా అర్ధంకానంత గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో... ఆ రాజకీయ వైరం సహజమేననుకున్నారు.
విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది…