YCP : ఆయన లేనిదే అడుగు కూడా వేసేవారు కాదట..! ఇంతకీ ఎవరాయన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం.. విశాఖ జిల్లాలను కలుపుతూ ఉన్న నియోజకవర్గం శృంగవరపుకోట. ఇక్కడ వైసీపీలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ వర్గీయుడైన రఘురాజును వెంటపెట్టుకుని తిరిగేవారు. ఇద్దరూ పాలునీళ్లు అన్నంతగా కలిసి కనిపించేవారు. రఘురాజు లేకుండా సీసీరోడ్డును కూడా ప్రారంభించేవారు కాదు ఎమ్మెల్యే. సమావేశాలకు వెళ్లితే రఘురాజు ఎక్కడా అని ఆరా తీసేవారు. చివరకు రాజుగారి అనుగ్రహం లేకపోతే ఎమ్మెల్యే దగ్గర పని జరగదనే ప్రచారం ఉండేది. అలాంటిది ఇద్దరికి ఏమైందో ఏమో.. ఉప్పు నిప్పులా మారిపోయారు. ఒకరి పొడ మరొకరికి గిట్టడం లేదు. పేరు పలకడానికి కూడా ఇష్టపడటం లేదట ఇద్దరు నాయకులు. అదే శృంగవరపుకోట వైసీపీలో చర్చగా మారింది.
రఘురాజు ఎమ్మెల్సీ అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చిందని చెవులు కొరుక్కుంటాయి వైసీపీ శ్రేణులు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు.. ఎమ్మెల్సీ రఘురాజులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బొత్స ఆశీసులతో ఎమ్మెల్సీ అయ్యాక శృంగవరపుకోటలో రఘురాజు దూకుడు పెంచినట్టు సమాచారం. నియోజకవర్గంలో ఎమ్మెల్యేను ఆయన లెక్క చేయడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. ప్రొటోకాల్ పక్కాగా పాటించాలని అధికారులు హుకుం జారీ చేసినట్టు చెబుతున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట. ఈ మార్పు ఏంటో అర్థంకాక ఎమ్మెల్యే బిత్తరపోతున్నారట.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
మనోడే కదా అని చంకన పెట్టుకుంటే.. ఇప్పుడు ఏకంగా నెత్తిన కూర్చున్నారని ఎమ్మెల్సీ రఘురాజును ఉద్దేశించి అనుచరుల దగ్గర వాపోతున్నారట ఎమ్మెల్యే శ్రీనివాస్రావు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో.. నియోజకవర్గంలో పట్టు సాధించడం ఎలాగో అర్థం కావడం లేదట. ఇన్నాళ్లూ జరిగిన పొరపాట్లు ఏంటా అని జాబితా సిద్ధం చేస్తున్నారట. వాటిని సరిదిద్దుకొనే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు దూరం పెట్టిన సొంత సామాజికవర్గాన్ని మళ్లీ చేరదీసుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారట. ఎమ్మెల్సీపై ఏదోలా రివేంజ్ తీసుకోవాలని చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. ఈ మిత్రభేదంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో.. లేక విభేదాలను పక్కన పెట్టి మళ్లీ మిత్రులుగా ఉంటారో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!