ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ స్పెషల్ మిషన్ పై దృష్టి పెట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం?
నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్లో ప్రస్తావించారా?
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ వస్తోంది. సీఎం కేసీఆర్ తాజా ఢిల్లీ పర్యటనలో ఆ అంశాన్నే ప్రధానంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారట. దానిపైనే ఇప్పుడు అధికారపార్టీలోనూ.. పొలిటికల్ సర్కిళ్లలోనూ చర్చ జరుగుతోంది.
చట్ట సవరణ ద్వారా పెంపు సాధ్యమని కేసీఆర్ చెప్పారా?
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రెండు పర్యాయాలు భేటీ కావడం వెనక ప్రధాన ఉద్దేశం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపేనని తెలుస్తోంది. అయితే పునర్విభజన చట్టానికి కొద్దిపాటి సవరణలు చేయడం ద్వారా ఈ సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నది టీఆర్ఎస్ వాదన. ఈ చట్టానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను చట్ట సవరణ ద్వారానే ఏపీలో కలిపింది కేంద్రం. అదే విధంగా చట్టంలోని సెక్షన్ 26కు సవరణ చేస్తే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపునకు మార్గం సుగమం అవుతుందని టీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది.
2026 తర్వాతే డీలిమిటేషన్ అని గతంలో కేంద్ర ప్రకటన..!
చట్టపరమైన సాధ్యాసాధ్యాలు.. గత సంప్రదాయాలు.. పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలపై ప్రధానంగా అమిత్ షాతో సీఎం కేసీఆర్ మాట్లాడారట. త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మధ్య నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన చేసింది. మిగతా రాష్ట్రాలతో కలిపే తెలుగు రాష్ట్రాల్లోనూ 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేసింది. కానీ.. ఇంతలోనే జమ్ముకశ్మీర్ పునర్విభజన చట్టం ప్రకారం.. ఆ రాష్ట్రంలో డీలిమిటేషన్ ప్రక్రియ మొదలైంది.
కశ్మీర్లో జోరందుకున్న డీలిమిటేషన్..!
కశ్మీర్లో సాధ్యమైన అంశం తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదన్నది టీఆర్ఎస్ ప్రశ్న. కశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ జోరందుకోవడంతో.. ఇదే సరైన సమయంగా భావించి సీఎం కేసీఆర్ కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. ఇందుకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులను ఎలా అధిగమించాలో కేంద్రం దృష్టికి ఆయన తీసుకెళ్లారట. మరి.. సీఎం కేసీఆర్ చెప్పిన అంశాలను సావధానంగా విన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సానుకూలంగా స్పందిస్తారా? ప్రధాని మోడీ ఆలోచన ఏంటి? అనేది పెద్ద ప్రశ్న.
డీలిమిటేషన్పై బీజేపీ లెక్కలేంటి?
రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపుపై బీజేపీకి వేరే లెక్కలు ఉన్నాయి. పార్టీకి కలిగే సానుకూలతలు.. వ్యతిరేకతలను కేంద్ర నాయకత్వం ద్వారా మోడీ సర్కార్కు చేరవేశారు. అప్పటి నుంచి ఆ అంశం కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు పొలిటికల్ అవసరాలు పెరిగాయి. ఎన్నికలు వస్తే అందరినీ అకామిడేట్ చేయడం పెను సవాల్. ఈ విషయంలో ఎవరి వాదన వారిది. కాకపోతే సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ఈ కదలిక పరిష్కారం దిశగా వెళ్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?