సంగారెడ్డిలో డీఎంహెచ్వో కుర్చీకోసం ఎత్తుగడలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
సంగారెడ్డి డీఎంహెచ్వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట!
Also Read
జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్. సంగారెడ్డి DMHO పోస్ట్ కూడా ఈ జాబితాలోకే చేరింది. కరోనా పగడ విప్పిన సమయంలో DMHO పోస్ట్ చాలా కీలకం. అలాంటిది మార్చి నెల నుంచీ ఈ పోస్ట్ కోసం కుర్చీలాట ఓ రేంజ్లో సాగుతోంది. రాజకీయ ఒత్తిళ్లో.. పనిభారమో తెలియదు కానీ.. ఇంఛార్జ్గా వచ్చిన అధికారులు పట్టుమని పదిరోజులు ఉండలేని పరిస్థితి. మాతా శిశు సంరక్షణ కేంద్రం POగా ఉన్న గాయత్రీదేవిని ఇంఛార్జ్గా మార్చి 30న వేశారు. ఆ తర్వాత నాలుగు రోజులకే మెదక్ టీబీ ఆఫీసర్ లక్ష్మణ్సింగ్కు DMHOగా పోస్టింగ్ ఇచ్చారు. సమస్య పరిష్కారమైందని సంబరపడుతున్న సమయంలో అసలు కథ మొదలైంది. నాలుగు నెలలుగా కుర్చీలాట రసరత్తరంగా జరుగుతోంది.
వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకున్న అధికారులు!
డీఎంహెచ్వోగా వచ్చిన లక్ష్మణ్సింగ్కు ఛార్జ్ ఇవ్వడానికి గాయత్రీదేవి నిరాకరిస్తున్నారట. ఆమె వెనక కలెక్టర్తోపాటు ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తానే డీఎంహెచ్వోగా ఉండేందుకే గాయత్రీదేవి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారట. లక్ష్మణ్సింగ్ ఛార్జ్ తీసుకోవడానికి నాలుగు నెలలుగా రోజూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. రోజూ ఆఫీస్ వస్తున్నారు.. రిజిస్టర్లో సంతకాలు పెడుతున్నారు.. సాయంత్రం వెళ్లిపోతున్నారు. DMHO కుర్చీలో కూర్చోకుండా.. వేర్వేరు ఛాంబర్లు ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. ఎవరి మాట వినాలో ఆఫీస్ సిబ్బందికి అర్థం కాని పరిస్థితి.
ఆమెకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు?
లక్ష్మణ్సింగ్కు డిపార్ట్మెంట్ పెద్దల అండ?
ఒక పోస్ట్.. ఇద్దరు అధికారులు!
ప్రభుత్వంలోని పెద్దల ఆశీసులు ఉండటంతో అధికారిక కార్యక్రమాలకు DMHO హోదాలో గాయత్రిదేవికే ఆహ్వానాలు పంపుతున్నారట. అయితే లక్ష్మణ్సింగ్కు వైద్య ఆరోగ్యశాఖలో పెద్దల మద్దతు ఉందట. దీంతో ఆయనా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గత నెల 15న లక్ష్మణ్సింగ్ను నారాయణపేట ఇంచార్జ్ DMHOగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడికి వెళ్లేందుకు ఆయన ససేమిరా అంటున్నారు. ప్రస్తుతం ఒకరికొకరు ఎదురుపడటం లేదు. లక్ష్మణ్సింగ్కు ఎక్కడ ఛార్జ్ అప్పగించాలో అని మొదట్లో గాయాత్రీదేవి ఆఫీస్కు రాలేదట. ఫైల్స్ అన్నీ ఇంటిదగ్గరే చూసేవారట. ఇప్పుడు ఇద్దరూ ఆఫీస్కు వస్తున్నా.. వేర్వేరు ఛాంబర్లో ఉంటూ కాలం గడిపేస్తున్నారు. మొత్తానికి రాజకీయ ఒత్తిళ్లు.. ఉన్నతాధికారుల పంతాలు.. సంగారెడ్డి DMHO పోస్ట్ను కీచులాటగా మార్చేశాయి. ఒక కుర్చీ ఇద్దరు అధికారులు అన్నట్టుగా మారిపోయింది. ఈ విషయం తెలిసినా.. జిల్లాలోని మంత్రులు.. ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..