పదవి వచ్చిన మూడు నెలలకే మూడాఫ్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవి వచ్చిన మూడు నెలలకే ఆయన మూడ్ ఆఫ్ అయింది. ఛైర్మన్ పోస్ట్ ఉన్నట్టా.. లేనట్టా అని ఒక్కటే అనుమానం. కనీసం కుర్చీ కూడా లేదు. దీంతో లబోదిబోమంటున్నారట ఆ నాయకుడు. ఆయనెవరో.. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
ఛైర్మన్ పదవి ఇచ్చారు.. కుర్చీ లేదు..!
Also Read
- Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్గా వైసీపీ నేత చందన నాగేశ్వర్ను నియమించి మూడు నెలలైంది.
ఇంతవరకు ఆయన బాధ్యతలు చేపట్టలేదు. ఇందుకు కారణం పదవి ఇష్టం లేక కాదు.. పదవి ఇచ్చారు కానీ కుర్చీ కేటాయించలేదు. స్మార్ట్ సిటీ చైర్మన్కు కుర్చీ ఎక్కడ వేయాలనేది చర్చగా మారింది. రాష్ట్రంలో అన్ని స్మార్ట్ సిటీ చైర్మన్ల పేర్లుతో చందన పేరును అధికారికంగా ప్రకటించారు. ఆ జాబితాలో ఉన్నవారిలో చందన తప్ప మిగతావారంతా బాధ్యతలు చేపట్టేశారు కూడా.
రాజమండ్రిని స్మార్ట్ సిటీగా గుర్తించని కేంద్రం..!
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా రాజమండ్రిని గుర్తించలేదు. స్మార్ట్ సిటీని చేయాలనే డిమాండ్ ఉంది. అన్ని పక్షాలు ఈ డిమాండ్ను తమ అజెండాలో చేర్చుకున్నాయి. ఎంపీ భరత్రామ్ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం రాజమండ్రిని స్మార్ట్ సిటీని చేస్తుందని.. అదిగో..ఇదిగో అంటూ ఎదురు చూడటమే సరిపోతోంది. ఢిల్లీ నుంచి ఎలాంటి ఉలుకు.. పలుకు లేకపోయినా.. స్మార్ట్ సిటీ కాని రాజమండ్రికి చందన నాగేశ్వర్ ఛైర్మన్ అయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయడానికి సాంకేతిక అంశాలు అడ్డుగా మారాయి.
పదవి ఉందా.. రద్దు చేస్తారా అని డైలమా?
అసలు లోగట్టు ఇలా ఉంటే.. స్మార్ట్ సిటీ ఛైర్మన్ హోదాలో చందన నాగేశ్వర్కు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లోని డిప్యూటీ మేయర్ ఛాంబర్ను కేటాయించాలని కమిషనర్పై ఒత్తిళ్లు వస్తున్నాయట. 3 నెలలుగా ఈ విషయం ఎటూ తేలడం లేదు. పదవి దక్కినా.. అది ప్రకటనకు పరిమితం కావడం.. కుర్చీ లేకపోవడంతో చందన మూడ్ ఆఫ్ అయినట్టు సమాచారం. స్మార్ట్ సిటీ చైర్మన్ పదవి ఉంటుందా? లేక రద్దు చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.
ఆదిలోనే వికటిస్తున్న చికిత్స..!
సమస్యలతో కునారిల్లుతున్న రాజమండ్రి వైసీపీని గాడిలో పెట్టేందుకు చందన నాగేశ్వర్కు నామినేటెడ్ పదవి ఇచ్చి చికిత్స చేయాలని చూశారు. ఇప్పటికే ఇద్దరు వైసీపీ కోఆర్డినేటర్లు మారారు. మూడో కో ఆర్డినేటర్గా మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వచ్చారు. అనారోగ్యంతో ఆయన యాక్టివ్గా లేరు. చందన నాగేశ్వర్ రాజమండ్రి రూరల్ వైసీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. ఆయన పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లోని పది డివిజన్లు ఉన్నాయి. పదవి ఇవ్వడంతో ఇక్కడ పార్టీ ఇంకా బలపడుతుందని వైసీపీ నేతలు లెక్కలేసుకున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్. మరి.. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో.. మూడ్ ఆఫ్ అయిన నేతలో తిరిగి చురుకు పుట్టించడానికి ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!