Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Anantapur Ysrcp Politics

వైసీపీలో గ్రూపులు ఎక్కువై అధికారులపై ఒత్తిడి పెరిగిందా…?

Published Date :September 2, 2021 , 4:12 pm
By Manohar
వైసీపీలో గ్రూపులు ఎక్కువై అధికారులపై ఒత్తిడి పెరిగిందా…?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ జిల్లాలో మొన్నటి వరకు ఒక్కరే పెత్తనం చేసేవారు. అధికారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అధికార పార్టీలో గ్రూపులు పెరిగి.. ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తిరుగుబాటులు మొదలయ్యాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలు జూలు విదిల్చారా?

పదేళ్లు అధికారంలో లేం. పవర్‌లోకి వచ్చాక చెబుతాం. రెండేళ్ల క్రితం వైసీపీ నేతల వాయిస్‌ ఇది. కానీ.. సీఎం జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గ్రామ, మండల స్థాయి వైసీపీ నాయకులకు పెద్దగా పనిలేకుండా పోయింది. ప్రజలకు ఏ పని కావాలన్నా వాలంటీర్లు, సచివాలయాలు ఉన్నాయి. దీంతో పార్టీ నాయకులను పట్టించుకునేవారే లేకుండా పోయారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇకపైనా ఇలాగే ఉంటే లాభం లేదని అనుకున్నారో ఏమో అనంతపురం జిల్లా వైసీపీ నేతలు ఒక్కసారిగా జూలు విదిలిస్తున్నారు.

చెప్పిన పని చేయకపోతే ఏసీబీకి పట్టిస్తామని బెదిరింపులు!

మండలస్థాయిలో జరిగే ప్రతిపనిలో తమ పెత్తనం ఉండాలన్నది వైసీపీ నేతల వాదన. అయితే పార్టీలోనే గ్రూపులు ఎక్కువై అంతా కలిసి అధికారులపై పడుతున్నారు. కదిరి నియోజకవర్గంలోని తలుపుల మండలంలో వైసీపీ గ్రూపు రాజకీయాలవల్ల ఒత్తిళ్లు పెరిగి అధికారులు తట్టుకోలేని పరిస్థితి వచ్చిందట. చెప్పినట్టు చేయకపోతే బెదిరించడం కామనైపోయిందట. పని చేయకపోతే ఏసీబీకి పట్టిస్తామని కూడా వార్నింగ్‌లు ఇస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు ఉద్యోగులు.

సామూహిక సెలవులు పెట్టిన తలుపులు మండల ఉద్యోగులు!

వాలంటీర్లను మార్చాలని ఒత్తిడి చేయడం.. పనులను తాము చెప్పిన వారికే ఇవ్వాలని వైసీపీ నాయకులు భీష్మిస్తున్నారట. దీంతో ఎంపీడీవో సహా సిబ్బంది అంతా సామూహిక సెలవు పెట్టేశారు. ఈ చర్య కలకలం రేపింది. రాజకీయ ఒత్తిళ్లతో పనిచేయలేక పోతున్నామని జడ్పీ సీఈవోకు రాసిన లేఖలో ఉద్యోగులు స్పష్టం చేశారు కూడా. ఉన్నతాధికారుల జోక్యంతో సెలవులను ఉద్యోగులు ఉపసంహరించుకున్నా.. స్థానికంగా వైసీపీ నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ల తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది.

వేధింపులు ఆపి.. విషం ఇవ్వాలన్న కదిరి టీపీవో

కదిరి మున్సిపాల్టీలోనూ అధికార పార్టీ నేతల అజమాయిషీ మామూలుగా లేదట. కౌన్సిల్ మీటింగ్ లో వైసీపీ కౌన్సిలర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అధికారుల అవినీతి కారణంగా చెడ్డపేరు వస్తోంని ఆరోపించారు కౌన్సిలర్లు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేస్తున్నా టీపీవో చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన టీపీవో రహమాన్ తాను అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని కోరారు. తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వేధించడం కంటే.. కాస్త విషమివ్వండి చస్తా అని టీపీవో వాపోయారు. దీనికి కౌన్సిలర్లు మరింత భగ్గుమన్నారు. మమ్మల్నే బెదిరిస్తావా.. చెట్టుకు కట్టేస్తాం అని హెచ్చరించారు. ఈ పరిణామం ఉద్యోగులలో అలజడి సృష్టిస్తోంది.

వైసీపీ నేతల గ్రూప్‌వార్‌.. ఉద్యోగులపై ఒత్తిళ్లు!

నేతల మధ్య ఉన్న గ్రూప్‌వార్‌.. ఆధిపత్య పోరును తమపై చూపెడితే ఎలా అన్నది ఉద్యోగుల ప్రశ్న. తలుపులు, కదిరి ఘటనలు రాజకీయవర్గాల్లోనూ చర్చగా మారింది. గతంలోలా ఉద్యోగులు సహించే పరిస్థితి లేదు. మరి.. ఈ సమస్యను సర్దుబాటు చేసేందుకు జిల్లా పార్టీ నేతలు చొరవ తీసుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anantapur
  • Andhra Pradesh
  • ycp
  • ysrcp politics

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions