Off The Record: దెబ్బకు దెయ్యం వదిలిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలతో విసిగిపోయిన హైకమాండ్ కీలెరిగి వాతలు పెట్టింది. రాజకీయ ప్రత్యర్థితో పోరాటం చేయమంటే.. కీచులాటలకు దిగడంతో కన్నెర్ర చేసింది. టికెట్ రేస్లో ఉన్నవాళ్లను కాదని కొత్త కృష్ణుడిని తెరపైకి తెచ్చింది. ఆ షాక్ ట్రీట్మెంట్తో దెబ్బకు దెయ్యం వదిలిందనే చర్చ నెలకొంది. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
విశాఖ తూర్పుపై వైసీపీ ఫోకస్
విశాఖలో తూర్పు నియోజకవర్గం రాజకీయాలు చాలా ప్రత్యేకం. 2009 తర్వాత టీడీపీ గట్టి పట్టు సాధించింది. వెలగపూడి రామకృష్ణబాబు వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వెలగపూడిని ఓడించేందుకు ఒకసారి ప్రజారాజ్యం, రెండుసార్లు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు అధికారపార్టీ వైనాట్ 175 అంటోంది. టీడీపీ గెలిచిన స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఆ జాబితాలో ఉన్నదే తూర్పు నియోజకవర్గం. కాపు, యాదవ, మత్స్యకార, బ్రాహ్మణ సామాజికవర్గాలు ఇక్కడ బలమైనవి. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్యే దూకుడికి బ్రేకులు వేయాలని భావించింది వైసీపీ. 2019లో పోటీ చేసి ఓడిన అక్కరమాని విజయనిర్మలను నియోజకవర్గ కోఆర్డినేటర్గా కొనసాగిస్తూనే.. కీలకమైన VMRDA చైర్మన్ను చేసింది. తొలిసారి కార్పొరేటర్గా గెలిచిన గోలగాని హరి వెంకట కుమారికి మేయర్ పీఠం కట్టబెట్టింది. సీనియర్ నాయకుడు వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఓకే సామాజికవర్గానికి పదవులు ఇవ్వడంపై పార్టీలోని ఇతర వర్గాలు అసంతృప్తితో ఉన్నా హైకమాండ్ మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించింది.
పదవులు పొందిన నేతల మధ్య వర్గపోరు
నేతలకు పదవులు కట్టబెట్టినా తూర్పులో వైసీపీకి ఆశించినస్థాయిలో ఊపు రాలేదనే చర్చ ఉంది. దీనికి కారణం వర్గ రాజకీయాలే. మేయర్ కుమారి, అక్కరమాని మధ్య నెలకొన్న ప్రచ్చన్న యుద్ధం డైరెక్ట్ ఫైట్గా మారింది. ఆధిపత్యం కోసం అక్కరమాని నేరుగా సీఎంకి ఫిర్యాదు చేశారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో గతంలో తూర్పు ఇంఛార్జ్గా పనిచేసిన MLC వంశీకృష్ణ సైతం టికెట్ ఆశిస్తున్నారు. అక్కరమాని రాజకీయాలను అంగీకరీంచేది లేదని ప్రకటించి.. ఆమె నిర్వహించే కార్యక్రమాలకు వంశీ వర్గం దూరమైంది. ఈ సమస్యలు పరిష్కరించేందుకు పలుమార్లు హైకమాండ్ సమన్వయ కమిటీ సమావేశాలు పెట్టినా గ్రూపు రాజకీయాల రచ్చ చల్లారలేదు.
ఎంపీ ఎంవీవీని అధిష్ఠానం ఎంచుకుందా?
ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే పార్టీకి జరిగే నష్టాన్ని గుర్తించి ఈస్ట్లో కొత్త యాక్షన్ ప్లాన్ షురూ చేసింది అధిష్ఠానం. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఎంచుకుంది. ఈసారి ఎంపీగా కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి వెలగపూడిపై గెలిస్తే.. పార్టీ పవర్లోకి వస్తే ప్రమోషన్ ఉంటుందనే అంచనాల్లో ఉన్నారు MVV. తూర్పులో ఉన్న నాయకులు, కేడర్ కు దగ్గరయ్యే చర్యలు ప్రారంభించారు ఎంపీ. కుమారుడు వివాహ రిసెప్షన్లో తూర్పు కేడర్, లీడర్లకు ప్రయారిటీ లభించిందట. ఒకటి రెండు నెలల్లో ఎంవీవీని కోఆర్డినేటర్గా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. గడప గడపకు బాధ్యతలను అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.
అధిష్ఠానం మూడ్ తెలుసుకున్నాక మూడు గ్రూపులు అప్రమత్తం
అధిష్ఠానం మూడ్ తెలుసుకున్నాక తూర్పు వైసీపీలోని మూడు గ్రూపులు అలెర్ట్ అయ్యాయి. ఎడముఖం పెడముఖంగా ఉన్న అక్కరమాని, వంశీకృష్ణ, మేయర్ వర్గాలు ఒక తాటి మీదకు వచ్చేయనే చర్చ సాగుతోంది. సీఎం పాల్గొన్న కార్యక్రమంలో మూడు గ్రూపులు ఐక్యంగా ఉన్నామని కలరింగ్ ఇచ్చాయి. సీటు కోసం కోట్లాడుకుంటే జరిగే నష్టం గుర్తించి ఇటీవల సామాజికవర్గంలో పెద్ద చర్చ జరిగినట్టు తెలిసింది. తమలో సీటు ఎవరికి ఇచ్చిన కలిసి పనిచేయాలని..ఇప్పుడు అవకాశం కోల్పోతే మళ్లీ రాదనే అభిప్రాయం వ్యక్తమైందట. అలాగని అధినాయకత్వం నిర్ణయాన్ని ధిక్కరించే ధైర్యం వాళ్లకు లేదు. ఈ పరిస్థితుల్లో తమకున్న అవకాశాలను దెబ్బతీయవద్దనే విజ్ఞప్తిని హైకమాండ్ దగ్గరకు తీసుకుని వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారట. ఐతే, అభ్యర్థిత్వం మార్పు దాదాపు ఖరారైన తరుణంలో మూడు గ్రూపుల ట్రయిల్స్ ఎంత వరకు వర్కవుట్ అవుతాయో సందేహమే.
తాజావార్తలు
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!