Off The Record : బెజవాడ వైసీపీలో కాపు సామాజిక వర్గం నుంచి నో ప్రాతినిధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెజవాడలో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆ సామాజిక వర్గం నుంచి వైసీపీకి డిమాండ్ వస్తుందట. గతంలో తమ సామాజిక వర్గానికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటంతో లోలోన మథనపడుతుందట. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా నగరంలో ఓ టికెట్ కేటాయించాలని అధిష్టానం దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్తున్నారట. ఈ అంశంపై పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ ఏ సామాజిక వర్గం నుంచి వైసీపీకి ఈ విజ్జప్తులు వెళ్తున్నాయి. ఏంటా చర్చా…లెట్స్ వాచ్
ఏపీ రాజకీయ రాజధానిగా ఉన్న బెజవాడలో వైసీపీకి కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిద్యం వహించే ప్రజాప్రతినిధులు లేరు.దీంతో ఆ ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతోంది ఆ సామాజిక వర్గం. విజయవాడ నగరంలో పశ్చిమ, తూర్పు, సెంట్రల్ మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు నియెజకవర్గాల్లో తూర్పులో 65 వేలు, సెంట్రల్ లో 75 వేలు జనాభా కాపు సామాజిక వర్గం నుంచి ఉంది.ఈ విషయాన్ని వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం… అధిష్టానం దృష్టికి తీసుకు వస్తోందట. గతంలో కాంగ్రెస్ , ప్రస్తుతం టీడీపీ, జనసేనలు కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్నీ గుర్తు చేస్తున్నారట. తమకు మాత్రం వైసీపీలో గత రెండు ఎన్నికల్లోనూ విజయవాడ నగరంలో టికెట్ దక్కలేదని లోలోపల మధన పడుతున్నారట. 2014లో ఒక టికెట్ ను వైసీపీ అధిష్టానం కాపులకు కేటాయించిందని… ఆ తర్వాత రెండు ఎన్నికల్లో…తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదని, దీని వల్ల తమకు ప్రాతినిధ్యం వహించే లీడర్ లేక ఇబ్బందులు పడుతున్నామని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
బెజవాడ నగరంలో కాపులకు పార్టీలు ఇచ్చిన గుర్తింపుతోపాటు ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అసంతృప్తిని తగ్గించాల్సిన అవసరం గురించి కూడా వైసీపీ అధిష్టానం దృష్టికి పదే పదే ఆ పార్టీ నేతలు తీసుకెళ్తున్నారట. బెజవాడ నగరం నుంచి వైసీపీ 2014లో వంగవీటి రాధాకృష్ణకు విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి టికెట్ ఇవ్వగా ఆయన ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల ముందే జగన్ వంగవీటి రాధాకు రాష్ట్ర వైసీపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాద్యతలు ఇచ్చి కాపులకు తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని చెప్పారని పార్టీ నేతలు చెబుతున్నారట. 2014 తర్వాత అంటే 2019, 2024 రెండు ఎన్నికల్లో విజయవాడ నగరంలో కాపులకు సీటును వైసీపీ కేటాయించలేదు. ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే జగ్గయ్యపేట నుంచి సామినేని ఉదయభానుకు కాపు సామాజిక వర్గం నుంచి టికెట్ ను వైసీపీ అధిష్టానం కేటాయించింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉదయబాను జనసేనలో చేరటంతో ఆ నియోజకవర్గ ఇన్చార్జిని కూడా కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వటంతో…అసలు ఇన్చార్జి కూడా ఎన్టీఆర్ జిల్లాలో లేకుండా పోయారని లెక్కలు చెబుతున్నారట వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు.
గత ఎన్నికల్లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని కాపు సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ గా పనిచేసిన అడపా శేషు, బొమ్మదేవర సుబ్బారావు, ఆకుల శ్రీని వాస్ వంటి వారు పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం నుంచి పోటీ చేయటానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ను తీసుకువచ్చి సెంట్రల్ లో పోటీకి నిలిపారు. ఒకే సమయంలో బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలను పక్కన పెట్టి కాపులకు సీటును కేటాయిస్తే రెండు సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం గత ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని స్థానిక నేతలు చెబుతున్న మాట. మరోవైపు టీడీపీ బెజవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే సీటు, జనసేన కృష్ణాజిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించటం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటోందని నేతలు ఈక్వేషన్స్ చెబుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో బెజవాడ నగరం నుంచి తమకు కాపు కాసే.. ఓ నాయకుడికి ప్రాతినిద్యం కల్పించాలని కోరుతున్నారట. మరి అధిష్టానం ఈ ఈక్వేషన్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!