Off The Record : పోలీస్ శాఖపై జుక్కల్ ఎమ్మెల్యే హాట్ హాట్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే పోలీస్ డిపార్ట్మెంట్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఓపెన్గానే నెగెటివ్ కామెంట్స్ ఎందుకు చేశారు? అదీకూడా… అధికార పార్టీ శాసనసభ్యుడు అయి ఉండి పోలీస్ మాఫియా లాంటి ఘాటు పదజాలాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది? ఎక్కడ తేడా కొట్టింది? ఎవరా ఎమ్మెల్యే? కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బాన్సువాడలో ఇటీవల పోలీస్ శాఖను ఉద్దేశించి చేసిన కామెంట్స్ రాష్ట్రస్దాయిలో చర్చకు దారి తీశాయి. జిల్లా స్థాయి అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు ప్రభుత్వ అనుమతితో ఇసుక తీసుకువెళ్తుంటే… ఆ ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే.. ఎమ్మెల్యే లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఇసుక ట్రాక్టర్లను వదిలి పెట్టాలని ఆదేశించారట. అందుకు అట్నుంచి మాకు ఎస్పీ ఆదేశాలు ఉన్నాయంటూ సమాధానం వచ్చింది. దాంతో లక్ష్మీకాంతరావు నేరుగా జిల్లా ఎస్పీకి కాల్ చేశారట. కానీ అప్పటికే కేసు బుక్ అయిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీసుకువెళ్తుంటే కేసులు పెడుతున్న పోలీసులు.. మహారాష్ట్రకు అక్రమంగా ఇసుక తరలిస్తుంటే పట్టించుకోవడం లేదని అన్నారు. మహారాష్ట్రకు ఇసుక తరలిస్తుండగా.. స్వయంగా తానే ఎస్పీకి ఫోన్ చేసి.. జీపీఎస్ తో సహా లొకేషన్ పెడితే పట్టుకోలేదని ఆరోపించారు. 400 మీటర్ల దూరంలో ఉండి సమాచారం ఇస్తే పట్టుకోలేకపోయారంటూ చురకలు అంటించారు. పేదలపై ప్రతాపం చూపి పెద్దలను వదిలేస్తే .. తన నియోజకవర్గంలో నడవదంటూ ఓ దశలో హెచ్చరించారట ఎమ్మెల్యే. పోలీస్ శాఖ మాఫియాలా మారిపోయిందని ఎమ్మెల్యే చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మంట పెడుతున్నాయి.
జుక్కల్ ఎమ్మెల్యే సాధారణంగా వివాదాలకు దూరం అన్న అభిప్రాయం పార్టీలో ఉంది.కానీ ఇసుక విషయంలో ఓ అడుగు ముందుకేసి డైరెక్ట్గా పోలీస్ శాఖకు చురకలంటించడం వెనుక అసలు ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ళ ఇసుక ట్రాక్టర్లను విడిచిపెట్టాలని స్వయంగా తానే ఫోన్ చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో.. ఆయన ఈగో హర్ట్ అయ్యిందట. అధికారులు ఎమ్మెల్యేల మాట పట్టించుకోకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, లేదంటే డీజీపీకి ఫిర్యాదు చేస్తారు.. కానీ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాత్రం.. ఏకంగా సభలో పోలీసుల తీరుపై రుసరుసలాడారంటే ఈగో హర్ట్ అవడమే కారణమన్నది ఆయన సన్నిహితుల మాట. పేదలకు సపోర్ట్గా తాను ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఆయన తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. సీఎం సహా… డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారట ఎమ్మెల్యే. ఈ వివాదం కాస్తా.. ఇప్పుడు జుక్కల్ నియోజకవర్గంలో ఖద్దర్ వర్సెస్ ఖాకీలా మారింది. ప్రస్తుతం జుక్కల్లో ఈ వ్యవహారం బయటపడ్డా… కామారెడ్డి జిల్లాలో అధికారులు ఎమ్మెల్యేల మాట వినడం లేదన్న చర్చలు చాలా రోజులుగా జరుగుతున్నాయి. ఇప్పుడు రచ్చ అయింది గనుక ప్రభుత్వ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Off The Record: మీనాక్షి నటరాజన్ అవకాశానికి గండి కొట్టింది ఎవరు? రాష్ట్ర నేతలు ఎవరైనా లీకులు ఇచ్చారా?
- Off The Record: దువ్వాడకు వైసీపీలోకి నో రీ ఎంట్రీ?.. రీల్స్ రాజా పొలిటికల్ కెరీర్ ఖతం అయినట్టేనా..?
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
తాజావార్తలు
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
-
Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
-
Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
-
Health Benefits of Eggs: ప్రతిరోజూ ఒక గుడ్డు తింటున్నారా..? శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే..
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!