Off The Record : రేవంత్ సర్కార్ కు సవాల్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్లు సిద్ధం చేస్తోందా? గెలుపు ఇప్పుడు పరువు ప్రతిష్టల సమస్యగా మారిపోయిందా? అందుకే… అందరికంటే ముందే కసరత్తు మొదలుపెట్టేసిందా? ఇంతకీ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి? తెలంగాణ కాంగ్రెస్కు ఇప్పుడో అగ్ని పరీక్ష ఎదురైంది. అదే… జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్లో గెలుపన్నది అటు పార్టీ… ఇటు ప్రభుత్వానికి సవాల్ అన్న అభిప్రాయం అన్ని వర్గాల్లో ఉంది.18 నెలల పరిపాలన ముగిసిన క్రమంలో… జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గెలిచి తీరక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. ఇందులో మంత్రుల మధ్య సమన్వయం, పార్టీ వ్యూహం చాలా కీలకంగా మారబోతున్నాయి. అందుకే… ఇంకా నోటిఫికేషన్ రాక ముందే… సీఎం రేవంత్రెడ్డితో మొదలుకుని.. పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ వరకు అంతా బైపోల్ కసరత్తులో మునిగిపోయినట్టు సమాచారం. ఇటీవల ఖర్గే పర్యటనలో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో జూబ్లీహిల్స్ సీటు కొట్టాల్సిందేనని టార్గెట్ ఫిక్స్ చేశారట. అందుకే నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రెండు సార్లు సర్వే జరగ్గా…. బీఆర్ఎస్ కంటే తాము ఐదు నుంచి 7 శాతం ముందున్నట్టు తేలిందన్నది కాంగ్రెస్ వర్గాల మాట. అధికార పార్టీ అవ్వడం తో అది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి తోడు.. ఇప్పటికే ప్రభుత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఐదు నుంచి 10 కోట్ల మేర పనులు మొదలయ్యాయి. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపు బాధ్యతను ఇప్పటికే మంత్రి వివేక్కి అప్పగించింది పార్టీ. దీనికి తోడు.. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డివిజన్స్ వారీగా ఫోకస్ పెంచారు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు లోకల్గా ఉన్న రాజకీయ పరిస్థితిని సమీక్షిస్తున్నారట. చేతిలో అధికారం ఉంది… హంగు…ఆర్భాటాలు భేష్. అయితే… అభ్యర్థిగా ఎవరిని బరిలో దించాలన్న విషయమై పార్టీ పెద్దలు మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు.
Also Read
ఇప్పుడు కూడా తానే పోటీ చేయాలన్నది ఆయన ఆరాటం. ఐతే ఆయన విషయంలో పార్టీ అంత అనుకూలంగా కనిపించడం లేదు. మైనార్టీ నుంచే మరో నేత కూడా ఇక్కడి నుండి బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మైనార్టీల ఓటు బ్యాంకు లక్షా 20 వేల వరకు ఉంది. పార్టీ మొత్తం ప్రస్తుతం బీసీ రిజర్వేషన్.. కుల గణన లాంటి అంశాల చుట్టూ తిరుగుతోంది కాబట్టి.. బీసీకి ఛాన్స్ ఇస్తారా..ఇస్తే ఎలా ఉంటుంది అనే కోణం లో చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. బీసీ కోటాలో నవీన్ యాదవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఏదేమైనా.. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలి అనేదే కాంగ్రెస్ పార్టీ టార్గెట్. అందుకే.. అందరికంటే ముందుగా కసరత్తు మొదలుపెట్టి… కార్యకర్తలు ప్రతి ఓటర్ని కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!