Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు భారత జట్టు ఎంపికపై చర్చ కొనసాగుతున్న వేళ మాజీ వికెట్కీపర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమే అయినప్పటికీ, ప్రస్తుత ఫామ్ను పరిగణనలోకి తీసుకుంటే సంజూ శాంసన్ను పక్కన పెట్టడాన్ని సమర్థించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో సంజూకు నిలకడలేమి అనే విమర్శలు ఎదురైనా, ఇటీవలి కాలంలో అతను తన ఆటతీరుతో ఆ విమర్శలను అధిగమించాడని పార్థివ్ పేర్కొన్నారు. ఒకే ఆటగాడిని వేర్వేరు ప్రమాణాలతో అంచనా వేయకూడదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తు దృష్ట్యా యువ ప్రతిభకు అవకాశాలు ఇవ్వడం అవసరమే అయినా, ప్రస్తుత ప్రదర్శనను విస్మరించరాదని సూచించారు.
అదే సమయంలో, భారత క్రికెట్లో జట్టులో లేని ఆటగాడే అత్యుత్తమ ఎంపికగా కనిపిస్తాడనే అభిమానుల మనస్తత్వాన్ని కూడా పార్థివ్ ప్రస్తావించారు. యువతకు అవకాశాలు కల్పించడం, అనుభవజ్ఞులకు న్యాయం చేయడం మధ్య సమతుల్యతను పాటించడమే సెలెక్టర్ల ముందున్న అసలు సవాలని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. జియోస్టార్తో మాట్లాడుతూ పార్థివ్ పటేల్, గత 11-12 ఏళ్లుగా సంజు శాంసన్ కెరీర్ను ఒకే ప్రశ్న వెంటాడుతోందని అన్నారు.. అదే అతని నిలకడ. ఈ కారణంగా అతన్ని జట్టు నుండి చాలాసార్లు తొలగించారు, కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
- VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
- Rohit Sharma: 2027 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సంజు శాంసన్ను ఎందుకు ఎప్పుడూ పక్కన పెడుతున్నారు? గతంలో అతను నిలకడగా పరుగులు చేయడం లేదని లేదా వేగంగా బ్యాటింగ్ చేయడం లేదని అనేవారు. కానీ ఒకే ఆటగాడిని వేర్వేరు కొలమానాల ఆధారంగా అంచనా వేయలేం అన్నారు పార్థి్వ్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడం భావోద్వేగపరంగా సరైన నిర్ణయమేనని, ఎందుకంటే అతను భారత క్రికెట్లో చాలా ప్రతిభావంతుడైన యువ తార అని పార్థివ్ ఇంకా పేర్కొన్నాడు. అయితే, ఎంపిక కేవలం ప్రదర్శన మరియు తర్కం ఆధారంగానే జరిగితే, సంజు శాంసన్ ను పక్కన పెట్టడానికి బలమైన కారణం ఏదీ ఉండదు అన్నారు..
కాగా, టీ20 ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజు శాంసన్ వరుసగా మూడు ఇన్నింగ్స్లలో పెద్ద స్కోరు చేయడంలో విఫలమవడంతో, 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీని భారత టీ20 జట్టులోకి తీసుకున్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ యువ బ్యాట్స్మన్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ, వైభవ్ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపడంలో విఫలమయ్యాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20ఐ సిరీస్లో భారత్ ప్రస్తుతం 0-3తో వెనుకబడి ఉంది. ఈ సిరీస్లోని ఐదవ, చివరి మ్యాచ్ ఈ రోజు జరగనున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
-
JNTU Hyderabad : JNTUHలో పదవుల పోరు.. బలి అవుతున్న విద్యార్థుల భవిష్యత్తు?
-
IND Vs PAK: హై-వోల్టేజ్ పోరుకు వేళాయె.. పాకిస్థాన్తో తలపడనున్న ఇండియా..
-
CM Revanth Reddy : అభివృద్ధిలో సరికొత్త మైలురాళ్లు తాకుతున్న తెలంగాణ
-
Rahul Gandhi: ఆంగ్ల భాష ఖూనీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తూ ప్రొఫెసర్ అక్షర దోషాలు.. వైరల్
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!