Off The Record : టీడీపీ నుంచి బీజేపీలోకి గుమ్మనూరు నారాయణ.!
- టీడీపీ నుంచి బీజేపీలోకి గుమ్మనూరు నారాయణ
- ఆలూరు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జయరాం
- వైసీపీ హయాంలో మంత్రిగా చేసిన గుమ్మనూరు జయరాం
- అప్పట్లో జయరాం వ్యవహారాలు చక్కబెట్టిన నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ మంత్రి సోదరుడికి పసుపు వాసన పడలేదా? అందుకే కాషాయం కప్పుకుని మురిసిపోతున్నారా? టీడీపీ ఎమ్మెల్యే బ్రదర్ మిత్రపక్షం బీజేపీలో చేరడాన్ని ఎలా చూడాలి? పాత నియోజకవర్గంలో పట్టు పోతోందని ఆ టీడీపీ ఎమ్మెల్యేనే బ్రదర్ని పంపారా? లేక అక్కడున్న పొలిటికల్ వ్యాక్యూమ్తో అలా అయిపోయిందా? ఎక్కడ జరిగిందా వ్యవహారం? ఎవరా బ్రదర్స్? మాజీ మంత్రి, గుంతకల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వరుసకు సోదరుడు నారాయణ టీడీపీ కండువా తీసేసి కాషాయమ కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ సమక్షంలో అపార్టీ తీర్థం పుచ్చుకున్నారాయన. తెలంగాణ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తో కలసి చర్చించిన ఫోటోల్ని పార్టీలో చేరక ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రచారం కూడా చేసుకున్నారాయన. ఆలూరు నియోజకవర్గం నుంచి గుమ్మనూరు జయరాం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో ఐదేళ్ళు మంత్రిగా పని చేశారాయన. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీ కండువా కప్పుకుని గుంతకల్ టికెట్ మీద గెలిచారు జయరాం. ఆ తర్వాత ఆలూరు నియోజకవర్గంపై పట్టు కోల్పోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. జయరాం మంత్రిగా కొనసాగుతున్నపుడు ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నిటిని నడిపించారు గుమ్మనూరు నారాయణ. అదే సమయంలో ఎక్కువగా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారాయన.
అప్పట్లోనే జయరాం సొంతూరిలో భారీ పేకాట క్లబ్ పై మహిళా ఏఎస్పీ దాడి చేయడం, అక్కడి వ్యవహారాలు చూసే జయరాం కజిన్ నారాయణపై కేసు పెట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. చివరికి వైసీపీ కార్యకర్తల మీద కూడా గుమ్మనూరు నారాయణ దాడిచేయడం వంటి పరిణామాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు నారాయణ. జయరాం ఆలూరు నియోజకవర్గం వదిలిపెట్టి గుంతకల్లు ఎమ్మెల్యే అయ్యాక కూడా గుమ్మనూరు నారాయణకు గుత్తి మండల బాధ్యతలు అప్పగించారు. అక్కడ కూడా గుమ్మనూరు నారాయణ వివాదాలకు కేరాఫ్ అయ్యారట. ఆ క్రమంలోనే… పాణ్యం మండల ఇన్చార్జిగా ఉన్న జయరాం కుమారుడు ఈశ్వర్కు, గుమ్మనూరు నారాయణకు విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరిగింది. కారణం ఏదైనాగానీ… నారాయణను గుత్తి మండల ఇన్చార్జిగా తొలగించడంతో తిరిగి ఆలూరు మీద ఫోకస్ పెట్టారట. ఒక దశలో జనసేనలో చేరేందుకు ప్రయత్నించినా… వర్కౌట్ అవలేదు. ఆ తరువాత నుంచి మళ్ళీ గుమ్మనూరు జయరాం, నారాయణ తరచూ కలుస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఆలూరు రాజకీయ సమీకరణలు మారిపోవడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా వైకుంఠం జ్యోతిని నియమించారు. దీంతో జయరాంకు నియోజకవర్గంలో ఏమాత్రం పట్టులేకుండా పోయిందట. ఇది గుమ్మనూరు కుటుంబాన్ని తీవ్ర మనస్తాపానికి గురిచేసిందనే ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనాసరే… టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మిత్రపక్షం బీజేపీ కండువా కప్పుకోవడం ఆసక్తికరమైన పరిణామమేనని అంటున్నారు పరిశీలకులు. తొలుత ఆ వార్తలు బయటికి వచ్చినప్పుడు జయరాం బ్రేక్ వేస్తారా….లేక పోనీలే అని మౌనం వహిస్తారా అన్న చర్చ జరిగింది. ఫైనల్గా మాజీమంత్రి అందులో జోక్యం చేసుకోలేదనే వారు కొందరైతే అంతా… ఆయనకు తెలిసే జరిగిందనే వాళ్ళు మరికొందరు. ఆలూరు నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ కొరత ఉంది. గుమ్మనూరు నారాయణ ఆ పార్టీలో చేరి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచే ఆలోచనలో ఉన్నారట. గుమ్మనూరు జయరాంకు మొన్నటి వరకు కుడి భుజంగా ఉన్న నారాయణ బీజేపీ చేరడంతో లోకల్గా తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని చూస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.
తాజావార్తలు
-
IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!