Off The Record: కేసీఆర్ వ్యూహం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో ఒక అడుగు వేయాలన్నా.. ఒక మాట మాట్లాడాలన్నా.. ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది. అసెంబ్లీలో ఈటల పేరును ప్రస్తావించడంలోనూ ఆ లెక్కే ఉందా? బీజేపీ నుంచి గెలిచిన వెంటనే తెగిడి.. ఇప్పుడు ఆకాశానికి ఎత్తేలా గులాబీ పార్టీ నేతలు మాట్లాడం వెనుక కథేంటి?
Also Read
- Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
- Off The Record: ఖమ్మంలో కలకలం.. గాయత్రి రవి కంపెనీలపై వరుస దాడులు ఎందుకు?
- Off The Record: నల్గొండ కాంగ్రెస్లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
- Off The Record: మళ్లీ యాక్టివ్ అయిన చెవిరెడ్డి.. జగన్ కొత్త వ్యూహమా?
గత రెండు సమావేశాల్లో సభ నుంచి ఈటల సస్పెండ్
ఈటెల రాజేందర్. గులాబీ కండువా తీసేసి.. బీజేపీలోకి వెళ్లిన తర్వాత అధికారపార్టీ నేతలు ఈటలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యే వారు. ఆయన ఏమీ మాట్లాడినా కౌంటర్ వచ్చేంది. బీజేపీ ఎమ్మెల్యేగా గెల్చిన తరవాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఈటలను సభలో ఉండనివ్వలేదు. రెండుసార్లు ఆయన్ని సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బయట చేసిన కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆయన్ని సభలోకి రానివ్వలేదు. అసెంబ్లీ ఆవరణలోను నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీ ప్రాంగణంలోనే అదుపులోకి తీసుకుని ఈటలను ఇంటి దగ్గర వదిలి వచ్చారు పోలీసులు. తన సొంత వాహనంలో కూర్చోవడానికి కూడా మాజీ మంత్రికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్లోనూ అదే పరిస్థితి.
తాజా సమావేశాల్లో నాటకీయ పరిణామాలు
సీఎం తన ముఖాన్ని చూడొద్దనే సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. సభలో తన గొంతు నొక్కేస్తున్నారని ఆక్రోశించారు. అయితే తాజా బడ్జెట్ సమావేశాల్లో సీన్ మారింది. ఈటలను సభలో ఉండనిస్తారా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈటలపై ఎలాంటి చర్య లేదు. పైగా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పదే పదే ఈటల పేరును ప్రస్తావించారు. మంత్రులతో కలిసి ఈ మాజీ మంత్రి లంచ్ కూడా చేశారు. అంతేనా.. సీఎంతోపాటు ఇతర మంత్రులు కూడా ‘మా ఈటల’అని పలకరించడం ఆశ్చర్యపరిచింది.
ఈటలపై వైఖరి మారిందా అని ఆరాలు
అసెంబ్లీ లాబీలో కేటీఆర్తో ఈటల ముచ్చట్లపై అధికారపార్టీలో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఈటల పేరు ప్రస్తావనకు రావడంతో ఏం జరుగుతుందా అనే ఆరాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో హుజూరాబాద్కు చెందిన ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డికి మండలిలో విప్ పదవి ఇచ్చారు. ఈటల సామాజికవర్గానికే చెందిన బండా ప్రకాష్ను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ను చేశారు. ఇవన్నీ చూసినవాళ్లు.. జరుగుతున్న ఘటనలను బేరీజు వేసుకుంటున్నవాళ్ల అభిప్రాయం మరోలా ఉందట. బీజేపీలో ఒక గందరగోళ వాతావరణం ఏర్పరిచేందుకే సీఎంతోపాటు ఇతర మంత్రులు ఈటల విషయంలో ఆ కామెంట్స్ చేశారని అనుకుంటున్నారట. స్వయంగా ఈటల సైతం తనను డ్యామేజ్ చేసేందుకే తన పేరును ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. తాను బీజేపీని వీడేది లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. మొత్తానికి గులాబీ బాస్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుందని.. ఈటల విషయంలోనూ అదే స్ట్రాటజీ అమలు చేశారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
-
Anantapur Murder: 20 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు వెళ్లిన వ్యక్తిని కొట్టి చంపిన మామా-అల్లుడు!
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!