Off The Record: పార్టీలో చేరికల సంగతేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీలక నేతల మధ్య గ్యాప్ తగ్గించే పనిపై ఢిల్లీ బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు సరే..! తెలంగాణ బీజేపీలో అడుగు ముందుకు పడని చేరికల సంగతి ఏంటి? ప్రత్యేకంగా కమిటీ వేసినా.. ఎందుకు పురోగతి లేదు? ఈ అంశంపై బీజేపీ హైకమాండ్ ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? దిశానిర్దేశం చేసిందా? అమిత్ షా నిర్వహించిన మీటింగ్లో ఏం జరిగింది?
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
చేరికలపై సమీక్షలతోనే సరి..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బీజేపీ నేతలు అధికారంలోకి వస్తామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి.. బలమైన నాయకులను పార్టీలోని ఆహ్వానించడానికి పార్టీ ప్రత్యేకంగా చేరికల కమిటీని వేసింది. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలకు కాషాయ కండువా కప్పాలన్నది పార్టీ పెద్దల ఆలోచన. కానీ.. బీజేపీ ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. ఈ అంశంపై హైదరాబాద్లోనూ.. హస్తినలోనూ పలుమార్లు సమీక్షలు చేసినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది సమస్య.
చేరికల కమిటీకి అమిత్ షా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?
చేరికలు లేకపోవడానికి బీజేపీ నేతలు చెబుతున్న కారణం ఒక్కటే. టికెట్పై హామీ ఇస్తే జంప్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని. అయితే అలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చేరిక కమిటీలోని నేతలు చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. దీనికితోడు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులు వివరాలు లీక్ కావడంతో ఆగిపోతున్నారని మరో వాదన ఉంది. తాజాగా ఢిల్లీలో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో చేరికలపై గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. బీజేపీ ఇతర పార్టీల నేతలు ఎందుకు చేరడం లేదు? అని షా ప్రశ్నిస్తే.. టికెట్పై హామీ లభించక ఎవరూ రావడం లేదని రాష్ట్ర నాయకులు బదులిచ్చారట. బలమైన నాయకులు రావడానికి ఆసక్తితో ఉన్నా.. టికెట్పై భరోసా లేక ముందడుగు పడటం లేదని చెప్పారట. ఈ విషయంలో రాష్ట్ర నాయకులకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట అమిత్ షా. బలమైన నాయకులు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే.. అలాంటి హామీ ఇవ్వాలని స్పష్టం చేశారట. అయితే ఒకరొస్తుంటే.. ఇంకొకరు అడ్డుకుంటున్నారని మరికొందరు ప్రస్తావించారట. ఆ తరహా సమస్యలు వస్తే అధ్యక్షుడితో మాట్లాడి సెట్ చేసుకోవాలని.. రెగ్యులర్గా అంతా సమావేశం కావాలని సూచించారట షా.
ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు నో..!
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని ఇంకొందరు రాష్ట్ర నాయకులు ఢిల్లీ పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించారట. అన్నిచోట్లా కాకపోయినా.. బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఆ మేరకు ప్రకటన చేస్తే ఫీల్డ్లో పనిచేసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారట. ఇదే విషయాన్ని గతంలోనూ బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ ముందు పెట్టారు. బీజేపీలో అలాంటి సాంప్రదాయం లేదని ఆయన నో చెప్పారు. తాజా సమావేశంలోనూ ఈ అంశంపై రిప్లయ్ లేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా టికెట్పై హామీ ఇవ్వాలని చెప్పారు కానీ.. వాళ్లే అభ్యర్థులని మాత్రం ప్రకటన చేయొద్దని ఢిల్లీ పెద్దలు గీత గీశారట. మరి.. బీజేపీ లైన్లో చేరికలు ఎంత వరకు ముందుకెళ్తాయో కాలమే చెప్పాలి.
- Tags
- bjp
- cm kcr
- off the record
- telangana
తాజావార్తలు
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!