Off The Record: దువ్వాడ గట్టిగా ఇరుక్కుంటున్నారా..? పోసాని తర్వాతే ఆయనేనా..?
- వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ గట్టిగా ఇరుక్కుంటున్నారా?..
- పోసాని తర్వాత దువ్వాడేనన్నది నిజమేనా?..
- డిప్యూటీ సీఎం పవన్ మీద తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు..
- గతంలో చెప్పుతో కొడతానంటూ వివాదం..
- దువ్వాడ మీద రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికుల ఫిర్యాదులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఇంట్లో రచ్చ… బయటా రచ్చే…. ముందూ వెనకా చూసుకోకుండా మాట విసిరేయటం, తర్వాత గొడవ కొని తెచ్చుకోవడం…. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గురించి శ్రీకాకుళం పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ ఇది. తన దూకుడుతో పొలిటికల్ మైలేజీ సొంతం చేసుకున్న దువ్వాడ నోటికి సెక్షన్తోనే చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి స్థానికంగా. సినీ నటుడు పోసాని తరువాత వంతు ఎమ్మెల్సీ దువ్వాడేనా అని గుసగుసలాడుకుంటున్నారట స్థానికంగా. కొంత కాలంగా కుటుంబ వ్యవహారాలతో వైరల్ అవుతున్న దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు మాధురి సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారన్న అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో తాజా అసెంబ్లీ సమావేశాలలో పాల్గొంటున్న దువ్వాడ తాను పెద్దల సభ సభ్యుడినన్న స్థాయి మర్చిపోయి డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేసారన్నది జనసైనికుల వాదన. గతంలో చెప్పుతో కొడతా అంటూ దువ్వాడ మాట్లాడటం, దానికి సంబంధించి ఫిర్యాదు చేయడం లాంటివి ఒకవైపు నడుస్తుండగానే…
తాజాగా పవన్ కల్యాణ్ మీద వ్యాఖ్యలతో మరోసారి వివాదం క్రియేట్ చేశారాయన. అసలు పవన్ కళ్యాణ్ మీదికి ఒంటికాలిపై లేస్తుంటారు దువ్వాడ. దానికి జనసేన కూడా ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక తాజాగా… చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు పవన్ 50 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణ దువ్వాడను ఇరకాటంలో పెట్టబోతోందన్న చర్చ నడుస్తోంది. దానికి సంబంధించి ఎమ్మెల్సీ మీద చర్యలు తీసుకోవాలంటూ…. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు చేస్తున్నారు జనసైనికులు. డిప్యూటీ సీఎం మీద నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ… పలు పోలీస్ స్టేషన్లలో కేసులు బుక్ అవుతున్నాయి. దువ్వాడపై ఇప్పటికే….గుడివాడ, మచిలీపట్నం, పామర్రు, పెడన, తిరువూరు, కొవ్వూరు , అమలాపురం , అవనిగడ్డ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారట జనసేన నేతలు. మరోవైపు దువ్వాడకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో…. ఇప్పుడు దువ్వాడ నోటి దురదే ఆయనకు శాపంగా మారబోతోందని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. అందుకే పోసాని తర్వాత దువ్వాడ శ్రీనివాసేనా అన్న చర్చ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ప్రాంతాల్లో కేసులు బుక్ అవుతాయో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
-
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!