Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ysrcp And Bjp Relationship

Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?

Published Date :August 9, 2024 , 11:01 pm
By Sudhakar Ravula
  • ఇన్నాళ్ళు బీజేపీ ఆడించినట్టు ఆడిన వైసీపీ?..
  • బీజేపీ టీడీపీతో కలిశాక వైసీపీకి ద్వారాలు బంద్‌..
  • బీజేపీ ఇక సహకరించదని జగన్‌ డిసైడయ్యారా?..
  • ఇండియా కూటమివైపు వెళ్ళడం ఖాయమా?..
  • క్లారిటీ ఇవ్వకున్నా..కనిపిస్తున్న సంకేతాలు..
  • తాజాగా వక్ఫ్‌ బోర్డ్‌ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ..
Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి… ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ… బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ… ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట. బీజేపీ కావాలి కానీ… ఆ పార్టీతో పొత్తు మాత్రం వద్దంటూ ఒంట్టెద్దు పోకడలు పోయిన వైసీపీ ఎన్నికల్లో దారుణ ఓటమిని మూట కట్టుకుంది. ఇక ప్రస్తుతం బీజేపీ తన ప్రధాన శత్రువు టీడీపీతో కలిసి ఉండటంతో అట్నుంచి తనకు ద్వారాలు మూసుకుపోయినట్టేనని గ్రహించారట జగన్‌. బీజేపీ జాతీయ నేతలకు లోపల ఎలా ఉన్నా… పైకి మాత్రం జగన్ వ్యతిరేకతనే చూపిస్తున్నారు. తనకు చేదోడుగా ఉండే పరిస్థితి ఇప్పట్లో బీజేపీ వైపు నుంచి అయ్యే పని కాదని అర్ధం అయ్యింది.

Read Also: Off The Record: ఆ ఎమ్మెల్యేకి కాషాయం బోర్ కొట్టిందా.. మూడు రంగులు ముద్దు వస్తున్నాయా..?

దీంతో జగన్ రూట్ మారుస్తున్నారట. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయంటూ, వాటికి నిరసనగా ఢిల్లీలో ఇటీవలే ధర్నా చేశారు జగన్. ఆ దీక్షకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పార్టీలన్నీ క్యూ కట్టాయి. ఇక జగన్ అటు వైపు వెళ్లడం ఖాయమని అదే రోజు అంచనాకు వచ్చారు అంతా. అయితే ఇండియా కూటమి వైపు వెళ్లడం మీద అవునని కానీ.. కాదని కానీ వైసీపీ నేతలు ఇప్పటికీ ధృవీకరించడం లేదు. వాళ్ల చర్యలు మాత్రం దాన్నే సూచిస్తున్నాయి. తాజాగా వక్ఫ్‌ బోర్డుల సవరణ బిల్లును బీజేపీ పార్లమెంట్ లో పెట్టింది. దీనికి వైసీపీ మద్దతు ఇవ్వలేదు సరికదా… ఆ బిల్లును వ్యతిరేకించింది. దాని మీద అసదుద్దీన్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించింది వైసీపీ. గతంలో ఇలాంటి ఇరకాటంలో పడేసే సమస్యలు వచ్చినప్పుడు అవుననకుండా… కాదనకుండా… ఉండే వైసీపీ ఈసారి ఓపెన్ అయ్యింది.

Read Also: Manish Sisodia: కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు.. సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు

బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వక్ఫ్‌ బోర్డు చట్ట సవరణకు జగన్ నో చెప్పేశారు. లోక్ సభలో వైసీపీ అవసరం లేకున్నా… రాజ్యసభలో ప్రభుత్వానికి వైసీపీ అవసరం పడుతుంది. కానీ, ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ ఎర్ర జెండా చూపేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తనను ఓడించిన కూటమికి ఏరకంగానూ సహకరించకూడదనే ఉద్దేశంతోపాటు తనకు అండగా ఉన్న ఇండియా కూటమి వైపే జగన్ మొగ్గుతున్నారట. మైనార్టీలు తనకు స్థిరమైన ఓటు బ్యాంకని నమ్ముతుంటారు జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీల సీరిస్ చివరల్లో నా మైనార్టీలు అని కూడా అంటుంటారు. మరి ఈ నిర్ణయం వారి కోసమే తీసుకున్నారా? అంటే… నేరుగా ఎస్‌ అని చెప్పలేని పరిస్థితి వైసీపీ నేతలది. మైనార్టీలంతా మాకే ఓట్లేసి ఉంటే 11 సీట్లే ఎందుకు వస్తాయి.? ముస్లింలు ఎక్కువగా ఉండే కర్నూల్, కడప, మదనపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోతాం. అని తిరిగి ప్రశ్నిస్తున్నాయి వైసీపీ వర్గాలు. అందుకే ఇదంతా పొలిటిక్ ఇంట్రెస్ట్ తో చేసేదేనని అంటున్నారట వైసీపీ నేతలు. మరి వైసీపీ ఆడుతున్న ఈ ఎఫెన్స్ గేమ్ కు బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్‌ అవుతుందో… పరిణామాలు ఎలా మారతాయో చూడాలన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Lok Sabha
  • off the record
  • PM Modi
  • Rajya Sabha

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions