Off The Record: జగ్గారెడ్డి మౌనం వ్యూహాత్మకమేనా..? అసలు వేరే ఉందా?
- అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి బాసటగా జగ్గారెడ్డి..
- ఇతరులు స్పందించని రోజుల్లో సైతం అండగా జగ్గారెడ్డి..
- భట్టి, ఉత్తమ్ మీద విమర్శలు వచ్చినా గాంధీభవన్ నుంచి కౌంటర్..
- ఇటీవల పూర్తిగా మూగనోములో మాజీ ఎమ్మెల్యే..
- సాధారణ కార్యక్రమాలు తప్ప నో పొలిటికల్ కామెంట్స్..
- సంగారెడ్డి అభివృద్ధి మీదే ఫోకస్ చేశారా?..
- దసరాకు రాహుల్ను రప్పించే ప్లాన్ ఉందా?..
- అసంతృప్తి ఉన్నా దాచుకోబోరన్న అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి. తెలంగాణ పాలిటిక్స్లో ఆయన గురించి పరిచయం అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం … పార్టీ పై వచ్చే ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పారు. మంత్రులు కూడా స్పందించని రోజుల్లో సైతం… అంతా తానై నడిపారాయన. సీఎం రేవంత్పై సోషల్ మీడియాతో పాటు బీఆర్ఎస్ లీడర్స్ ఎంతలా అటాక్ చేసినా, ఒక దశలో అసభ్యంగా మాట్లాడినా…. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ గాంధీ భవన్ వేదికగా.. సీఎంకు మద్దతుగా గళం విప్పారు జగ్గారెడ్డి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. ఎన్నికలకు ముందు నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా…అధికారంలోకి వచ్చాక.. ఉత్తం మీద.. భట్టి మీద ఆరోపణలు వచ్చినా గాంధీ భవన్లో మీడియా సమావేశాలు పెట్టి ఖండించేవారు జగ్గారెడ్డి. అలా…బీజేపీ, brs నేతల విమర్శలకు కౌంటర్ ఎటాక్ లు చేస్తూ వచ్చారు. అదంతా ఒక ఎత్తయితే….. ఈ మధ్య కాలంలో… అసలు గాంధీ భవన్ మెట్లెక్కడమే మానేశారు మాజీ ఎమ్మెల్యే. పూర్తిగా మూగనోము నోస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు సంగారెడ్డి దాటి రావడం లేదు. కూతురు పెళ్లి నుంచి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం మానేశారట జగ్గన్న. అవసరం ఉన్న వాళ్ళకు సాయం, పార్టీ కార్యకర్తలతో వేడుకలకు హాజరవడం లాంటి కార్యక్రమాలకే పరిమితం అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో… జగ్గారెడ్డి కనిపించారంటే…. అక్కడ బోనాలో.. జాతరో జరుగుతుండాలి. లేదంటే ఆయన అస్సలు బయటికి రావడం లేదట.
Read Also: EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
Also Read
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధుల మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే సంగారెడ్డి చెరువు.. పట్టణంలో అభివృద్ధి పనులకు నిధుల వేటలో ఉన్నారట. సీఎం రేవంత్తో అక్కడ భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దసరా వేడుకలకు రాహుల్ గాంధీని రప్పించే స్కెచ్ ఏదో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే… అలాంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా…జగ్గన్న గాంధీ భవన్కి రాకుండా ఉండరని, ఇలా గ్యాప్ తీసుకోవడం వెనక వెనక.. ఏదైనా కారణం ఉండి ఉంటుందన్న అనుమానాలు వెంటాడుతున్నాయట కాంగ్రెస్ నేతల్ని. అది అలకా… అసంతృప్తా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఐతే… జగ్గారెడ్డి రాజకీయంగా అలకలు… అసంతృప్తి తో ఉండే వ్యక్తి కాదని, అవసరం అనుకుంటే బహిరంగంగా మాట్లాడేస్తారుగానీ.. ఇలా ముసుగులో గుద్దులాట ఉండదన్నది కొందరి అభిప్రాయం. కారణం ఏదైనా… చాలా రోజుల నుంచి ఎలాంటి పొలిటికల్ స్టేట్మెంట్ రాకపోవడంతో అసలు ఆయనకేమైందన్న చర్చ మొదలైంది. ఆయన మాట్లాడినా చర్చలో ఉంటారు. లేక ఇలా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నా ఆయన గురించే మాట్లాడుకుంటారు. మొత్తంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇలా మౌనంగా ఉన్నారంటే… అది వ్యూహాత్మకమేనని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు.
తాజావార్తలు
-
Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!