EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO 3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం. బ్యాంకుల మాదిరిగా సరళమైన లావాదేవీని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు పేర్కొంది.
READ ALSO: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?
Also Read
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్పాట్!
అక్టోబర్ 10, 11 తేదీల్లో సమావేశం..
2025 అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక కమిటీ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరగనుంది. దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారుల నోటిఫికేషన్కు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్వో 3.0 అని పిలిచే ప్రాజెక్ట్పై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును ప్రవేశపెట్టడం వంటి బ్యాంకింగ్ సేవలపై చర్చించనున్నట్లు సమాచారం. అదనంగా నెలకు కనీస పెన్షన్ను రూ.1000 నుంచి రూ.1,500 నుంచి రూ. 2,500 కు పెంచే ప్రణాళిక గురించి కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.
వైద్య, విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు వంటి కొన్ని నిర్దిష్ట కారణాలతో పీఎఫ్ ఖాతాదారులు ఇంటర్నెట్ ద్వారా రూ. 5 లక్షల వరకు వారి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ డబ్బులు చేతుల్లోకి రాడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. కొత్తగా పీఎఫ్లో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తే డబ్బును తీసుకోవడం మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. బ్యాంకుల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా పొందేలా చేయడం చేస్తే పథకం ఉద్దేశ్యమే దెబ్బతింటుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పీఎఫ్ అనేది ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో, అత్యవసర పరిస్థితులకు ఉపయోగించే పథకం అని వాటిని ఏటిఎంల ద్వారా తీసుకోడానికి అనుమతించేలా చేస్తే పథకం ఉద్దేశ్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు.
తాజావార్తలు
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
-
Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
-
Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్తో అతడిని నిందించొద్దు!
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్లో విజయ్ స్పెషల్ హగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!