EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EPFO 3.0: ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే కొత్త సౌకర్యాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను సులభంగా నిర్వహించుకునేందుకు EPFO 3.0 పేరుతో కొత్త విధానాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. వాస్తవానికి సెప్టెంబర్ 2025లో ఈ కొత్త విధాలను ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాటిని నిలిపివేశారు. తాజా సమాచారం ఏమిటంటే దీపావళికి ముందు ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే వెసులుబాటును ఖాతాదారులకు కల్పించనున్నట్లు సమాచారం. బ్యాంకుల మాదిరిగా సరళమైన లావాదేవీని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు పేర్కొంది.
READ ALSO: Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్ ఎందుకు మారింది..?
Also Read
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
- Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
అక్టోబర్ 10, 11 తేదీల్లో సమావేశం..
2025 అక్టోబర్ 10, 11 తేదీల్లో ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక కమిటీ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరగనుంది. దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ చందాదారుల నోటిఫికేషన్కు సంబంధించి ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో ఈపీఎఫ్వో 3.0 అని పిలిచే ప్రాజెక్ట్పై ముఖ్యమైన నిర్ణయాలు వెలువడనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకునే సౌకర్యం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును ప్రవేశపెట్టడం వంటి బ్యాంకింగ్ సేవలపై చర్చించనున్నట్లు సమాచారం. అదనంగా నెలకు కనీస పెన్షన్ను రూ.1000 నుంచి రూ.1,500 నుంచి రూ. 2,500 కు పెంచే ప్రణాళిక గురించి కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తుంది.
వైద్య, విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు వంటి కొన్ని నిర్దిష్ట కారణాలతో పీఎఫ్ ఖాతాదారులు ఇంటర్నెట్ ద్వారా రూ. 5 లక్షల వరకు వారి డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఆ డబ్బులు చేతుల్లోకి రాడానికి కనీసం 2-3 రోజులు పడుతుంది. కొత్తగా పీఎఫ్లో ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తే డబ్బును తీసుకోవడం మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. బ్యాంకుల ద్వారా పీఎఫ్ డబ్బును సులభంగా పొందేలా చేయడం చేస్తే పథకం ఉద్దేశ్యమే దెబ్బతింటుందని పలు కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పీఎఫ్ అనేది ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో, అత్యవసర పరిస్థితులకు ఉపయోగించే పథకం అని వాటిని ఏటిఎంల ద్వారా తీసుకోడానికి అనుమతించేలా చేస్తే పథకం ఉద్దేశ్యం దెబ్బతింటుందని వారు అంటున్నారు.
తాజావార్తలు
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!