Off The Record: సీఎస్గా శాంతికుమారినే ఎందుకు ఎంపిక చేశారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: హైకోర్టు తీర్పు.. కేంద్రం ఆదేశాలతో తెలంగాణ సీఎస్గా కొత్త అధికారి తెరమీదకు వచ్చారు. రాష్ట్ర సర్కార్ శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసింది. 1989 బ్యాచ్కు చెందిన ఈ మహిళా ఐఏఎస్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. అంతకుముందు శాంతికుమారి కంటే జూనియరైన 1991 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ రామకృష్ణరావు పేరు దాదాపు ఖరారనే ప్రచారం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా శాంతికుమారిని చీఫ్ సెక్రటరీ పదవీ వరించింది. కేవలం సీనియారిటీనే ప్రాదిపదికగా తీసుకున్నారు అనుకుంటే.. ఆమె కంటే మరో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. 1987 బ్యాచ్కు చెందిన వసుధామి శ్రా, 1988 బ్యాచ్కు చెందిన రాణికుముదిని సీనియర్లు. వసుధామిశ్రా కేంద్ర సర్వీసుల్లో ఉండగా, రాణికుముదిని తెలంగాణలోనే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ నియామకంలో సీనియారిటీని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదని టాక్. మొన్నటిదాకా సిఎస్గా ఉన్న సోమేష్కుమార్ను కూడా చాలామంది సీనియర్లను కాదని CS సీట్లో కూర్చోబెట్టారు.
Read Also: Off The Record: బీజేపీలో ఉక్కపోత..? కన్నా వల్ల ఎవరి సీటుకు ఎసరు..?
Also Read
TRS.. భారత రాష్ట్ర సమితిగా మారాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణకు సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఏపీలో ఉన్న రెండు పార్టీలు రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కాపు సామాజికవర్గంపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాపు సామాజికవర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ను నియమించారు. ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ నియామకంలోనూ అదే సామాజికవర్గానికి చెందిన శాంతికుమారిని ఎంపిక చేశారనే చర్చ జరుగుతోంది. సీఎస్ నిమామకం ఇలా పూర్తయిందో లేదో తమిళనాడు మాజీ సీఎస్.. జనసేన సలహాదారు, కాపు వర్గానికి చెందిన రామ్మోహన్రావు సీఎం కేసీఆర్ దగ్గర వాలిపోయారు. శాంతికుమారిని చీఫ్ సెక్రటరీని చేసినందుకు అభినందనలు తెలిపారు.
ఇక శాంతికుమారి కంటే రామకృష్ణారావు సీఎంకు దగ్గరగా ఉంటున్నారు. సుధీర్ఘకాలంగా ఆయన ఆర్థికశాఖను చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ కీలక శాఖలను పర్యవేక్షించారు రామకృష్ణారావు. ఈసారి సీఎస్ నియామకంలో సామాజిక లెక్కలు ప్రభావం చూపాయన్న చర్చ నడుస్తోంది. బీహార్కు చెందిన సవిల్ సర్వెంట్లకు తెలంగాణలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు కూడా ఉండటంతో తెలుగు అధికారులను తెరపైకి తెచ్చారనే వాదన ఉంది. మహిళ కావడం కూడా ప్లస్ అయ్యిందంటున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన శాంతికుమారి గతంలో మెదక్ కలెక్టర్గా చేశారు. తర్వాతి కాలంలో దాదాపు నాలుగేళ్లు తెలంగాణ సీఎంవోలో కూడా విధులు నిర్వర్తించారు. ఆపై మిగిలిన అధికారులను సీఎంవో నుంచి మార్చకుండా శాంతికుమారికి మాత్రమే మరో చోట విధులు అప్పగించారు. ఇప్పుడు మాత్రం చాలా సమీకరణాలు శాంతికుమారికి కలిసొచ్చి చీఫ్ సెక్రటరీ అయ్యారని అనుకుంటున్నారు.
తాజావార్తలు
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
-
Ramcharan : రామ్ చరణ్ చేతికి గాయం?..అసలు ఏమైంది?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..