Off The Record: ఎమ్మెల్యే రాజాసింగ్ను పట్టించుకోని బీజేపీ అధిష్ఠానం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వీడియోల్లో ఒక వర్గాన్ని దూషించినట్టు తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. అయితే, ఆ విమర్శలు కేవలం ప్రత్యర్థులు, ఇతర మతాల వాళ్లు మాత్రమే చేయలేదు. స్వయంగా ఆయన పార్టీ అధిష్టానం కూడా ఆ వీడియోలను సీరియస్గానే తీసుకుంది. అప్పుడప్పుడే నూపుర్ శర్మ వివాదం నుంచి తేరుకుంటున్న బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ వ్యవహారం మరో తలనొప్పిగా మారకూడదని నిర్ణయించుకుంది. అందుకే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వివరణ అడిగింది.
Read Also: Off The Record: వైసీపీ ఓపెన్ ఆఫర్..! ముద్రగడ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా?
Also Read
- OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
తెలంగాణ ప్రభుత్వం కూడా రాజాసింగ్ అంశాన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించింది. ఏకంగా పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపింది. తర్వాత హైకోర్టు పీడీ యాక్ట్ను కొట్టేసింది. ఆయన జైలు నుంచి బయటకొచ్చారు. అయినప్పటికీ రాజాసింగ్ కదలికలపైనా, మాటలపైనా, సోషల్ మీడియా యాక్టవిటీ పైనా ఆంక్షలను పెట్టింది న్యాయస్థానం. ఇటు బీజేపీ అధిష్టానానికి రాజాసింగ్ ఇచ్చిన వివరణలో ఆయన ఎలాంటి పశ్చాత్తాపాన్నీ వ్యక్తం చేయలేదు. అసలు తన వీడియోలకి మతానికి సంబంధంలేదని ఆ వివరణలో చెప్పారు. ఆ వివరణ ఇచ్చి కూడా నెల 15 రోజులు అవుతుంది. ఇప్పుడు బంతి కేంద్ర బీజేపీ కోర్టులో ఉంది. ఆయనపై సస్పెన్షన్ ఇంకా ఎత్తేయలేదు. ఈ మధ్యలో రాజాసింగ్ భార్య కూడా బిజెపి నేతలతో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆమెకు భరోసా ఇచ్చారు.
Read Also: Off The Record: రసకందాయంలో నల్లగొండ రాజకీయం.. రూటు మార్చేసిన ఎమ్మెల్యే..
బీజేపీ నేతలు చెప్పినట్టు.. వారి సూచనల మేరకే రాజాసింగ్ రిప్లయ్ ఇచ్చారని.. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని కొందరు రాష్ట్ర నేతలు అంటున్నారు. మునుగోడు పోలింగ్ కన్నా ముందే సస్పెన్షన్ ఎత్తివేస్తారని ఆ వర్గం ఆశపడింది. ఈ నెల 28 నుండి బండి సంజయ్ ఐదో విడత సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఆ యాత్రను హిందూ సెంటిమెంట్ ప్రభావం ఉన్న భైంసా నుండి ప్రారంభం అవుతున్న తరుణంలో మరోసారి రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం చర్చకొచ్చింది. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం రాజాసింగ్ అంశాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని అర్థమవుతోంది. నూపుర్ శర్మ సస్పెన్షన్తో రాజాసింగ్ ఇష్యూ కూడా ముడిపడి ఉండడం.. దేశానికి అంతర్జాతీయ సంబంధాలతో లింక్ ఉండడంతో రాజాసింగ్ చేసిన పని చిన్నదేం కాదని జాతీయపార్టీ భావిస్తోందని అనుకోవాలి.
తాజావార్తలు
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
-
SEBI F&O New Rules: ఎఫ్అండ్ఓ (F&O) ట్రేడింగ్ను మార్చబోతున్న సెబీ కొత్త రూల్.. అసలు మ్యాటర్ ఇదే!
-
US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!