Off The Record: మీనాక్షి నటరాజన్ వైఖరిపై గాంధీ భవన్ లో గుసగుసలు..!
- మీనాక్షి నటరాజన్ వైఖరిపై గాంధీభవన్లో గుసగుసలు..
- స్థానిక నేతలతో సంబంధం లేకుండా నిర్ణయాలు?..
- నాయకుల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందా?..
- అంతా మేడమే అనేస్తున్న సీనియర్ లీడర్స్..
- డీసీసీల వివాదానికి ఆమే బాధ్యురాలన్న టాక్..
- ఆల్రెడీ పదవి ఉన్న వాళ్ళకు మళ్లీ డీసీసీ పోస్ట్..
- విప్ బీర్ల ఐలయ్యని కేబినెట్ రేస్ నుంచి తప్పించడానికేనా?..
- ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్స్కు డీసీసీలు..
- పలువురు పాత అధ్యక్షుల కొనసాగింపు..
- పీసీసీ కమిటీల్లో ఉన్న వాళ్ళకు కూడా పదవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆదర్శంగా ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. గాంధీ సిద్ధాంతాలను ఫాలో అవడం గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఆ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండకూడదు కూడా. కానీ… తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ఉందంటూ ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…. ఆమె వ్యవహార శైలి కొరకరాని కొయ్యలా మారిందన్న చర్చ నడుస్తోంది గాంధీభవన్లో. స్థానిక నాయకులతో సంబంధం లేకుండానే పని కానిచ్చేస్తున్నారని, ఏమీ చర్చించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె ఏం చేశారంటూ విచారించడం, విషయం తెలిసి సణుక్కోవడం, మరీ ఆపులేకపోతే… గాంధీభవన్ గోడలకు గోడు వెళ్ళబోసుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామంటూ కొందరు నాయకులు ఫ్రస్ట్రేట్ అవుతున్నారట. ఒకరిద్దరు చొరవ తీసుకుని సార్… ఇదేంటి, ఇలా చేస్తున్నారేంటి అంటూ… రాష్ట్ర నాయకులకు విన్నవిస్తే… వాళ్ళు కూడా మా చేతిలో ఏముంది..? అంతా మేడమే అనేస్తున్నారట. ముఖ్యంగా డీసీసీ అధ్యక్షుల నియామకానికి ముందు పార్టీ నేతలకు చాలా విషయాలు చెప్పారు మీనాక్షి నటరాజన్.
కానీ… ఆ మాటలకు, జరిగిన దానికి అస్సలు పొంతనే లేదన్నది తాజా వాదన. పార్టీకి ఏది లాభమో…అదే చేస్తే తప్పులేదు. కానీ…నియామకాలకు ముందు పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం ఎందుకనేది వాళ్ళ ప్రశ్న. పార్టీలో ఒకరికి ఒకే పదవి అన్నారు. ఒక పోస్ట్ ఉంటే ఇంకోదానికి ఛాన్సే లేదన్నారు. కానీ… ప్రభుత్వ విప్.. బీర్ల ఐలయ్యకి యాదాద్రి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. దాంతో ఆయన్ని మంత్రి పదవి రేస్ నుండి తప్పించడానికే ఈ ఎత్తుగడ వేశారా..అన్న చర్చ నడుస్తోంది. అలాగే… ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్స్కు కూడా డీసీసీ పీఠాలు దక్కాయి. పాత DCC అధ్యక్షులకు తిరిగి పదవులు ఇవ్వబోమన్నారు. కానీ… ఎమ్మెల్యేలుగా ఉన్న డీసీసీ అధ్యక్షులను అలాగే కంటిన్యూ చేశారు. ఎమ్మెల్యేలు కాని వాళ్ళలో మెదక్, ములుగు, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులను కొనసాగించారు. అలాగే పీసీసీ కమిటీలో ఉన్న వాళ్లకు పదవులు దక్కాయి. ఆరుగురు జనరల్ సెక్రటరీలు, ముగ్గురు ఉపాధ్యక్షులను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించారు. ఇక నాయకుల కుటుంబ సభ్యులకు పదవులు లేవంటూ భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు మీనాక్షి. కానీ…సిద్దిపేట పగ్గాలు dcc మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురుకు దక్కాయి. మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే భార్యకు డీసీసీ పీఠం దక్కింది.
Also Read
- OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Off The Record: రొటీన్కు భిన్నంగా ఆ మౌనవ్రతం ఎందుకు?.. కోలగట్ల వైఖరిపై వైసీపీలో చర్చ
హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎక్కడి నుండి వచ్చారన్నది పార్టీలో ఎవరికీ అంతుచిక్కడం లేదట. కర్నూలు నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళకు ఇచ్చారని మైనార్టీ నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. జనగామ జిల్లాను ఆశించిన జంగా రాఘవ రెడ్డి నారాజ్ లో ఉన్నారు. ఐదేళ్ల కాలం పార్టీలో ఉంటేనే పదవి అని చెప్పారు…కానీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చి పోటీ చేసిన ఆత్రం సుగుణకి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ రకంగా డీసీసీ అధ్యక్షుల నియామకంలో మొత్తం కంగాళీనే నడిచిందని, రాష్ట్ర ఇన్ఛార్జ్ స్థాయిలో ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కట్టుబడి ఉండటానికి బదులు ఈ పిల్లి మొగ్గలేంటంటూ…కాంగ్రెస్ నాయకులు ఫీలవుతున్నారు. ఒకవేళ వీలవకుంటే… ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి బిల్డప్లు ఇవ్వడం ఎందుకన్నది వాళ్ళ క్వశ్చన్.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!