Off The Record: కడప కార్పొరేషన్లో ఏం జరుగుతోంది..? వారి ఒతిళ్లతో ఉద్యోగులు బలి?
- సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ పాలకమండలి..
- ఎవరి మాట వినాలో తెలియని గందరగోళం..
- అడ్వాంటేజ్ తీసుకుని పని ఎగ్గొడుతున్న కొందరు..
- 23మంది సచివాలయ కార్యదర్శులు సస్పెండ్..
- 15 మంది కార్పొరేషన్ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు..
- రాజకీయ వత్తిళ్ళు ఉండవచ్చన్న టాక్..
- నెలవారీ మామూళ్ళకు కొందరు టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి ముగిసేసరికి మరొకటిగా పెరుగుతున్న వివాదాలు కాక రేపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అధికారులు కూడా బలి పశువులు అవుతున్నారట. సిట్టింగ్ ఎమ్మెల్యేది ఒక పార్టీ, మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గానిది మరో పార్టీ కావడంతో…. వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు మాకు శాపంగా మారాయని అంటున్నారు సిబ్బంది. ఒకరు పని చేయమంటే మరొకరు వద్దంటున్నారని, ఎవరి మాట వినాలో తెలియక గందరగోళంలో ఉన్నామని అంటున్నారట. కొందరైతే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని డ్యూటీలకు డుమ్మా కొడుతూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం మున్సిపల్ కమిషనర్కు చిరాకు తెప్పిస్తోందట.ఇక సచివాలయ ఉద్యోగులు అయితే తాము ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టుగా ఉంటున్నారట. పర్మిషన్ లేకుండా సెలవులు పెట్టడం, అసలు కనీస సమాచారం లేకుండా విధులకు డుమ్మా కొట్టడం లాంటి పనులు చేస్తున్నట్టు తెలిసింది.
మరీ… ఓవరైపోతున్నారనుకున్న వారి మీద ఆగ్రహించిన కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి… 23 మంది సచివాలయ కార్యదర్శుల్ని సస్పెండ్ చేశారు. అలాగే కార్పొరేషన్ ఆఫీస్లోని పలు విభాగాల్లో విధులు సక్రమంగా నిర్వహించలేదంటూ 15 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇలా… ఇంత భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అని మాట్లాడుకుంటున్నారు మున్సిపల్ ఎంప్లాయిస్. ఇది కేవలం తమ మీద కోపం ఒక్కటే కాదని, రాజకీయ ఒత్తిళ్లు కూడా పని చేసి ఉండవచ్చని గుసగుసలాడుకుంటున్నారట.
కడప కార్పొరేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే మాధవికి వేదికపై కుర్చీ వేకపోవడంతోనే వివాదం మొదలైందని, దీంతో ఆమె కార్పొరేషన్ ను టార్గెట్ చేశారని అనుకుంటున్నారట. ఎమ్మెల్యేకు సహకరిస్తే వేటు వేస్తామంటూ కార్పొరేషన్ పాలకవర్గం పరోక్షంగా అధికారులను హెచ్చరిస్తోందని చెప్పుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తమకు నెల మామూళ్ళు ఇవ్వాలంటూ అధికార పార్టీకి చెందిన కొందరు ఒత్తిళ్లు తెస్తున్నట్లు కడపలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు ఇప్పించాలంటూ అధికారులను వత్తిడి చేస్తున్నారట. మాట విననివారిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తున్నారని, ఇంజనీరింగ్ విభాగంలో షోకాజ్ నోటీసుల వెనక ఈ కారణాలు కూడా ఉండి ఉండవచ్చని మాట్లాడుకుంటున్నాయట ఉద్యోగ వర్గాలు. కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయకపోవడం, కొన్ని కాంట్రాక్టు పనులను రద్దు చేయకపొవడమే అధికారులు చేసిన పాపమని మాట్లాడుకుంటున్నారట. సకాలంలో గుంతలు పూడ్చడం లో విఫలమయ్యారని, తాగునీటి సరఫరా లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు కమిషనర్ షోకాజ్లు ఇచ్చారు. కానీ… అసలు మేటర్ పని చేయకపోవడం కాదని, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసి ఇప్పించకపోవడమేనని మున్సిపల్ సిబ్బంది గుసగుసలాడుతున్నట్టు తెలుస్తోంది. ఈ దెబ్బకు అసలు కాంట్రాక్టర్స్ కూడా పనులు చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. ఇలా…. రెండు పార్టీల మధ్య విభేదాలు ఇప్పుడు తమ ఉద్యోగాలకు ముప్పుగా పరిణమించాయనిఎంప్లాయిస్ మధనపడుతున్నట్టు సమాచారం. ఏది ఏమైనా కుర్చీ గోల….కడప మున్సిపాలిటీలో జీడిపాకం సీరియల్లా సాగుతోందని అంటున్నారు పరిశీలకులు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!