Off The Record: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని రంజాన్ ఇరుకున పడేసిందా..?
- ముస్లిం ఉద్యోగులకు ఇరు ప్రభుత్వాల వెసులుబాట్లు..
- రంజాన్ మాసంలో గంట ముందే వెళ్ళేందుకు అనుమతి..
- మార్చి రెండు నుంచి నెలాఖరు వరకు వెసులుబాటు..
- తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్న బీజేపీ లీడర్స్..
- హిందూ మాలధారులకు ఆ వెసులుబాట్లు ఎందుకివ్వరని క్వశ్చన్..
- తెలంగాణ సర్కార్ మీద బండి సంజయ్, రాజాసింగ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో కొత్త రాజకీయ రగడ మొదలైంది. కాకుంటే… ఇది మత పరంగా సున్నితమైన అంశం కావడంతో… జాగ్రత్తగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. ఇదే సమయంలో బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ అనుసరిస్తోందన్న చర్చ సైతం మొదలైంది. త్వరలో రంజాన్ మాసం మొదలవబోతోంది. ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాయి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు. ఆఫీస్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందే… అంటే సాయంత్రం నాలుగు గంటలకే ముస్లిం ఉద్యోగులంతా విధులు ముగించుకుని వెళ్ళిపోవచ్చు. మార్చి రెండు నుంచి ఆ నెలాఖరు వరకు ఈ వెసులు బాటు ఉంటుంది. ఈ ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలకే విధులను ముగించుకుని వెళ్ళిపోవచ్చు. అయితే… తెలంగాణలోఈ వెసులుబాటునే తప్పు పడుతున్నాయి బీజేపీ వర్గాలు. టీజీ బీజేపీ సీనియర్ లీడర్స్ అయితే.. ఓ అడుగు ముందుకేసి ఈ వెసులుబాటుకు, అయ్యప్ప, భవానీ, హనుమాన్ మాలధారులకు ముడిపెట్టి మాట్లాడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాట్లు కేవలం రంజాన్కేనా? ఇతర మాలధారులకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. అలాగే, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, రంజాన్ పండుగ కోసం ప్రభుత్వం ఇచ్చిన జీవో సరైంది కాదని అన్నారు. దేవీ నవరాత్రుల సమయంలో హిందూ ఉద్యోగులకు ఇలాంటి వెసులుబాటు ఎందుకు ఇవ్వరన్నది ఆయన క్వశ్చన్. తెలంగాణ ప్రభుత్వానికి ఒక మతం పండగే కనిపిస్తుందా అని కూడా ప్రశ్నించారు రాజాసింగ్. వాళ్ళ ప్రశ్నలు, ఉద్దేశ్యాలు ఎలా ఉన్నా… అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. బీజేపీ వైఖరిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణలో పొలిటికల్గా ఏదో చేసేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారన్నది కాంగ్రెస్ అభిప్రాయం. అదే సమయంలో వేళ్ళు ఏపీ వైపు చూపిస్తున్నారు హస్తం పార్టీ లీడర్స్. ఆంధ్రప్రదేశ్లో మీరు భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కూడా వెసులుబాటు సర్క్యులర్ ఇచ్చింది కదా… మరి అక్కడెందుకు ప్రశ్నించరన్నది కాంగ్రెస్ క్వశ్చన్. ఏపీలో తమ ప్రభుత్వాన్ని వదిలేసి… తెలంగాణలో అదే తరహా వెసులుబాట్లు ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ని విమర్శించడం ద్వంద్వ నీతి కాక ఇంకేంటని అడుగుతున్నారట టీజీ కాంగ్రెస్ నాయకులు.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
మీకు నిజంగానే అభ్యంతరాలుంటే…. ఏపీలో ఉన్న మీ ప్రభుత్వానికి చెప్పండి… ఇక్కడ అనవసర రాజకీయాలు చేసి మతపరమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టవద్దని బీజేపీ నాయకులకు స్ట్రాంగ్గా చెబుతున్నారట కాంగ్రెస్ లీడర్స్. అంతలా అభ్యంతరాలుంటే… ఏపీ బీజేపీ లీడర్స్ కూడా మాట్లాడాలికదా…. ప్రభుత్వంలో ఉండి కూడా అక్కడ కామైపోయి తెలంగాణలో మాత్రం మాట్లాడ్డం ఏంటన్నది కాంగ్రెస్ క్వశ్చన్గా తెలుస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!