శింగనమల టీడీపీ టుమెన్ కమిటీకి కొత్త సంకటం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇల్లు అలకగానే పండగ కాదు. ప్రస్తుతం శింగనమల టీడీపీ పరిణామాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. ఇంఛార్జ్ ఉండగానే వచ్చిన టుమెన్ కమిటీకి.. రెండు మండలాలను టచ్ చేయాలంటే ధైర్యం సరిపోవడం లేదట. ఆ మండలాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే జేసీ బ్రదర్స్ పర్మిషన్ తీసుకోవాలట. దానిపైనే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ..!
శింగనమలలో టీడీపీ టు మెన్ కమిటీ బలప్రదర్శన..!
Also Read
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీలో తలెత్తిన రచ్చ ఇప్పట్లో తగ్గేలా లేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఇంఛార్జ్ బండారు శ్రావణికి కొందరు సీనియర్ లీడర్లకు మధ్య విభేదాలు రావడంతో టుమెన్ కమిటీ తెరపైకి వచ్చింది. శ్రావణి అండ్ కో ఈ టు మెన్ కమిటీని తీవ్రంగా వ్యతిరేకించింది. అభ్యంతరాలను, అసంతృప్తులను పట్టించుకోకుండా టుమెన్ కమిటీ కొన్ని మండలాల్లో ఆత్మీయ సమావేశాల పేరుతో బలప్రదర్శనకు దిగింది.
యల్లనూరు, పుట్లూరులో జేసీ బ్రదర్స్ చెప్పిందే వేదం?
టు మెన్ కమిటీలోని నేతల సొంత మండలాలైన నార్పల, గార్లదిన్నెలే కాకుండా శింగనమల నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి. అవే శింగనమల, బుక్కరాయసముద్రం, పుట్లూరు, యల్లనూరు. వీటిలో యల్లనూరు, పుట్లూరు మండలాల్లో పార్టీ పరంగా జేసీ బ్రదర్స్ చెప్పిందే వేదం. వీరి ఆజ్ఞ లేకుండా ఒక్క కార్యకర్త కూడా కదలడు. పైగా తాడిపత్రికి చేరువలోనే ఉండే మండలాలివి. అంతేకాదు.. టీడీపీ ఇంఛార్జ్ శ్రావణికి జేసీ బ్రదర్స్ ఫుల్ సపోర్ట్ ఉంది. అందుకే ఆ రెండు మండలాల్లో పర్యటన.. కార్యకర్తలతో భేటీ ఎలాగో టుమెన్ కమిటీకి అంతుచిక్కడం లేదట.
జేసీ బ్రదర్స్ను కాదని ఆ మండలాలకు టు మెన్ కమిటీ వెళ్తుందా?
నార్పల, గార్లదిన్నె మండలాలలో మీటింగ్స్ పూర్తయ్యాక ఇతర మండలాల్లో కూడా అలాంటి సమావేశాలు పెట్టాలని కార్యకర్తలు కోరుతున్నట్టు టు మెన్ కమిటీ వర్గాల వాదన. అసలు సంగతి మాత్రం మరొకటి అన్నది పార్టీ వర్గాలకు తెలుసు. ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. శింనగమల, బుక్కరాయసముద్రం మండలాల్లో ఎలాగోలా నెట్టుకొచ్చినా.. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పరిస్థితి ఏంటన్నది వాళ్లకు పాలుపోవడం లేదట. ఇంచార్జ్ శ్రావణి లేకుండా ఈ మండలాలకు టు మెన్ కమిటీ వెళ్లకపోవచ్చని టాక్. జేసీ బ్రదర్స్ను కాదని అక్కడికి వెళ్లితే పరిస్థితులు.. పరిణామాలు మరోలా ఉంటాయని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే టుమెన్ కమిటీ ఎత్తుగడలపై ఆసక్తి నెలకొంది. అసలే జిల్లాలో పాత టీడీపీ నాయకులు.. జేసీ సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గ్యాప్ వచ్చింది. ఇలాంటి తరుణంలో శింగనమలలో టుమెన్ కమిటీ తీసుకునే నిర్ణయం.. కదలికలు టీడీపీలో ఇంకెలాంటి రచ్చకు కారణం అవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!