Munugode By Elections : :మునుగోడు లో ఉప ఎన్నిక అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode By Elections :Congress Leaders are ready for by-election candidate in Munugodu..?
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి వేట మొదలు పెట్టిందా..? సొంత పార్టీలోని నాయకులు బరిలో ఉంటారా..? లేక పక్కపార్టీ నుంచి నాయకులను తీసుకొస్తారా..? అసలు… కాంగ్రెస్ లెక్క ఏంటి..!?
తెలంగాణ కాంగ్రెస్కి మునుగోడు ఉపఎన్నికల సవాల్ గా నిలవనుంది. ఇన్నాళ్లు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే .. మునుగోడులో ఉపఎన్నిక వస్తే మరింత సవాల్గా మారనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మునుగోడు ఎన్నిక పెద్ద సవాల్. రేవంత్కే కాదు… కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరనుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రెండు రోజుల్లో సెట్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఓవైపు దారి లోకి తెచ్చే ప్రయత్నం.. ఇంకొకటి పార్టీని సెట్ చేసుకునే పని. పీసీసీ ఇప్పటికే సర్వే చేస్తున్నట్టు సమాచారం. పార్టీకి బలమైన అభ్యర్దిని వెతికే పనిలో పడ్డారు. జిల్లా నాయకులు… పార్టీ బలంగా ఉందని చెప్పినా… ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికపై ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదట. సీనియర్ నేతలు జిల్లాలో ఉన్నా… జానారెడ్డికి అందరినీ కో ఆర్డినేట్ చేసి పని అప్పగించారు.
మునుగోడు ఉపఎన్నిక వేస్తే బీజేపీ నుంచి రాజగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ నుంచి రెడ్డి సామాజికవర్గం అభ్యర్థే బరిలో ఉంటారని.. కాంగ్రెస్ అభిప్రాయ పడుతోంది. అదే జరిగితే బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందట. బీసీ ఓటు బ్యాంక్ మునుగోడులో ఎక్కువ. కానీ రెడ్డి సామాజికవర్గం డామినేషన్ ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులలో ఎవరి బలం ఎంతో లెక్క తీస్తోందట. కాంగ్రెస్లో బీసీ సామాజిక వర్గం నుండి… టీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనే నాయకుడు ఉన్నారా..? ఆర్థికంగానూ సత్తా చాటగలరా? అనేది ప్రశ్న. కాంగ్రెస్లో ఉన్న నాయకుల పేర్లను పరిశీలించడంతో పాటుగా… ఇతర పార్టీలలో ఉన్న బీసీ నాయకుల కోసం వేట మొదలు పెట్టినట్టు సమాచారం.
సొంత పార్టీ లో జర్నలిస్ట్ నాయకుడు పల్లె రవి, అధికార ప్రతినిధి కైలాష్ నేతలు ఉన్నారు.. వీరికి తోడుగా మునుగోడు నియోజక వర్గంలో అధికార పార్టీ కి చెందిన ఇద్దరు బీసీ నాయకులతో కాంగ్రెస్ నాయకత్వం టచ్ లో ఉందట. ఇందులో ఒకరు మునుగోడు నియోజకవర్గం నాయకుడు కాగా… ఇంకొకరు గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే అవకాశం ఉందట.
అయితే సొంత పార్టీలో నాయకులను కాదని … పొరుగుపార్టీ నాయకులను తెచ్చుకుంటారా..? కాంగ్రెస్లో చేరడానికి అధికార పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా..? అనేది తేలాలి. మరి.. కాంగ్రెస్ అభ్యర్థి వేటలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!