సయోధ్య తప్పదా: MLA Nomula Bhagath Vs MLC Kotireddy
నాగార్జునాసాగర్ ఎమ్మెల్యే నోములు భగత్, ఎమ్మెల్సీ యంసీ కోటిరెడ్డి మధ్య దూరం చాలా పెరిగిపోయిందట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య పెరిగిన ఈ గ్యాప్ తప్పకుండా పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు కార్యకర్తలు. మనుషులు ఇద్దరూ ఒకే దగ్గర, ఒకే వేదిక మీద ఉన్నా పెదవి విప్పకపోవడం… పలకరించుకోకపోవడం వంటి ఘటనలు రొటీన్గా మారాయి. వారిద్దరూ పలకరించుకుంటే పెద్ద విశేషంలా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. ఇద్దరి మధ్య పంచాయితీ విషయంలో అధినేత జోక్యం చేసుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అని స్పష్టత ఇచ్చారు. అయినప్పటీకీ…..ఎమ్మెల్సీ కోటిరెడ్డి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో గ్యాప్ మరింత పెరిగిదని టాక్. ఎమ్మెల్యే ఒకవైపు ఉంటే…మరోవైపు ఎమ్మెల్సీ ఉండటంతో అధికారులకు నియోజకవర్గంలో పనిచేయడం కత్తిమీద సాములా తయారైందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఐతే…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి సైతం వీరి విషయంలో సైలెంట్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. స్థానికేతరులు అని సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై పరోక్షంగా కామెంట్స్ చేయడం…వారికి ముఖ్యనేతలు కొందరు సపోర్టు చేస్తున్నారట. చిన్నచిన్న పొరపాట్లను పెద్దదిగా చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కేలా చేయడం వెనక ఎమ్మెల్సీ హస్తం ఉందని ఎమ్మెల్యే భగత్ వర్గీయుల ఆరోపణ. విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని… వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని…వారికోసం అధికార యంత్రాంగం పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఖండించకపోయినా..ఎందుకో ఎమ్మెల్యే భగత్ను సాగర్ నియోజకవర్గం నుండి సాగనంపాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయల టాక్.
Also Read
ఇక…ఈనెల 14న నియోజకవర్గంలో కేటీఆర్ టూర్ ఉంది. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదాలకు చెక్ పడుతుందని అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు. సీనియర్ నేత జానారెడ్డి ప్రత్యర్ధిగా ఉండే అవకాశం ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి నేతల మధ్య సయోధ్య తప్పని సరి అంటున్నారు కార్యకర్తలు.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!