సయోధ్య తప్పదా: MLA Nomula Bhagath Vs MLC Kotireddy
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జునాసాగర్ ఎమ్మెల్యే నోములు భగత్, ఎమ్మెల్సీ యంసీ కోటిరెడ్డి మధ్య దూరం చాలా పెరిగిపోయిందట. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య పెరిగిన ఈ గ్యాప్ తప్పకుండా పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు కార్యకర్తలు. మనుషులు ఇద్దరూ ఒకే దగ్గర, ఒకే వేదిక మీద ఉన్నా పెదవి విప్పకపోవడం… పలకరించుకోకపోవడం వంటి ఘటనలు రొటీన్గా మారాయి. వారిద్దరూ పలకరించుకుంటే పెద్ద విశేషంలా చెప్పుకుంటున్నారు కార్యకర్తలు. ఇద్దరి మధ్య పంచాయితీ విషయంలో అధినేత జోక్యం చేసుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాటే ఫైనల్ అని స్పష్టత ఇచ్చారు. అయినప్పటీకీ…..ఎమ్మెల్సీ కోటిరెడ్డి వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంతో గ్యాప్ మరింత పెరిగిదని టాక్. ఎమ్మెల్యే ఒకవైపు ఉంటే…మరోవైపు ఎమ్మెల్సీ ఉండటంతో అధికారులకు నియోజకవర్గంలో పనిచేయడం కత్తిమీద సాములా తయారైందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు సొంత పార్టీ నేతలు.
ఐతే…ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి సైతం వీరి విషయంలో సైలెంట్ కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. స్థానికేతరులు అని సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై పరోక్షంగా కామెంట్స్ చేయడం…వారికి ముఖ్యనేతలు కొందరు సపోర్టు చేస్తున్నారట. చిన్నచిన్న పొరపాట్లను పెద్దదిగా చేసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కేలా చేయడం వెనక ఎమ్మెల్సీ హస్తం ఉందని ఎమ్మెల్యే భగత్ వర్గీయుల ఆరోపణ. విపక్ష పార్టీలకు చెందిన ముఖ్యకార్యకర్తలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని… వారితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని…వారికోసం అధికార యంత్రాంగం పనిచేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను ఖండించకపోయినా..ఎందుకో ఎమ్మెల్యే భగత్ను సాగర్ నియోజకవర్గం నుండి సాగనంపాలని ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయల టాక్.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
ఇక…ఈనెల 14న నియోజకవర్గంలో కేటీఆర్ టూర్ ఉంది. ఈ ఇద్దరి నేతల మధ్య వివాదాలకు చెక్ పడుతుందని అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు. సీనియర్ నేత జానారెడ్డి ప్రత్యర్ధిగా ఉండే అవకాశం ఉండటంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి నేతల మధ్య సయోధ్య తప్పని సరి అంటున్నారు కార్యకర్తలు.
తాజావార్తలు
-
Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!