Namburu Shankarrao: అసలుకే ఎసరు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన రాజకీయాలకు కొత్త. గెలిచాం కదా..! అంతా నాదే.. నేను చెప్పిందే ఫైనల్ అనుకున్నట్టున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వాళ్లను ప్రోత్సహించడం మొదలు పెట్టారు. అది ఓల్డ్ బ్యాచ్కు చిర్రెత్తించింది. ఇంకేం ఉంది గ్రూపు కట్టేశారు. సమావేశాలు పెట్టేస్తున్నారు. ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనన్న భయం ఆయన్ను వెంటాడుతోందట.
రాజకీయాల్లో ఓనమాలు తెలియని తీరే ఎసరు పెట్టేలా ఉందా?
గుంటూరు జిల్లా పెదకూరపాడు వైసీపీలో గ్రూపు రాజకీయాలు మరింత ముదిరాయి. స్థానిక నేతల మధ్య విభేదాలు పీక్కు చేరాయి. పెదకూరపాడు నుంచి గత ఎన్నికల్లో నంబూరు శంకర్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. శంకర్రావు రాజకీయాలకు కొత్త. అందరిని సమన్వయం చేసుకునే అనుభవం లేదు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఎమ్మెల్యే తీరు.. ఇప్పుడు ఆయనకే ఎసరు పెట్టేలా మారింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి మధ్య విభేదాలు ఉన్నా తర్వాత అంతా సర్దుకుంటుందని భావించారు. కానీ.. ఎమ్మెల్యే కొత్తగా పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి మింగుడు పడటం లేదట. దీనికి తోడు ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు ఆయన్ను పక్కదారి పట్టిస్తున్నారని సొంతపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
ఐదు మండలాల్లో గ్రూపులుగా విడిపోయిన నేతలు
నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పార్టీ నేతలంతా గ్రూపులుగా విడిపోయారు. పెదకూరపాడు, అచ్చెంపేట, బెల్లంకొండ, క్రోసూరుల్లో రెండు గ్రూపులు.. అమరావతిలో మూడు గ్రూపులు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శంకర్రావు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గ్రామాలు, మండలాల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని కొంతమంది గతంలోనే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కూడా. ఎమ్మెల్యేతోపాటు ఆయనకు సన్నిహితంగా ఉండే మరో నాయకుడిపైనా పార్టీలకు ఫిర్యాదు చేశారట.
విందు పేరుతో సమావేశం కావడంతో కలకలం
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీలో గ్రూపు రాజకీయాలు ఇంకా ఎక్కువయ్యాయి. బెల్లంకొండ మండలానికి చెందిన కొందరు నేతలు చండ్రాజుపాలెం సమీపంలోని మామిడితోటలో సమావేశమయ్యారు. వైసీపీలో మొదటినుంచి ఉన్న నేతలతోపాటు స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. విందు పేరుతో వీరంతా సమావేశం కావడం కలకలం సృష్టించింది. విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో.. సమావేశంలో పాల్గొన్న కొందరికి ఫోన్లు వెళ్లాయట. వారం రోజుల్లో అంతా సర్దుబాటు చేసుకుందామని.. ఇలాంటి సమావేశాలు పెట్టొద్దని ఫోన్లోనే కోరారట. అయితే తామంతా కేవలం విందుకోసం వచ్చామని అసంతృప్తితో కాదని చెప్పి తప్పించుకున్నారట.
గ్రూపు రాజకీయాలతో ఎమ్మెల్యేకు తలబొప్పి
చండ్రాజుపాలెం సమావేశం గురించి బయటకు రావడంతో మిగతా మండలాల్లో అసమ్మతి నేతలు కూడా ఇదే తరహాలో భేటీలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీంతో గ్రూపు రాజకీయాలు.. నేతల మధ్య విభేదాలతో ఎమ్మెల్యేకు తలబొప్పి కడుతోందట. ఎవరికీ సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట శంకర్రావు. అసమ్మతి నేతలు మాత్రం తగ్గేదే లేదన్నట్టు పార్టీ పెద్దలను కలిసే ప్లాన్లో ఉన్నట్టు టాక్. మరి.. పెదకూరపాడు వైసీపీ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..