తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమిషనర్లు దూకుడు పెంచారా.?
కొత్త బాస్ లు వచ్చాక కొత్త పనులు జరగటం సహజమే. తెలంగాణలో నలుగురు కొత్త పోలీస్ కమీషనర్ లు దూకుడు పెంచారట. అధికారుల బదిలీలతో పాటు, విధినిర్వహణపై ఒత్తిడి కూడా పెంచారట. ఇది డిపార్ట్మెంట్ లో కలకలానికి కారణమైందట..
పోలీస్ డ్యూటీ అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఏ పోస్టింగ్ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో ప్రభుత్వం నాలుగు పోలీస్ కమిషనరేట్ లకు కొత్త గా అధికారులను నియమించింది. కొత్త కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు. సిబ్బంది బదిలీలు మొదలు పెట్టడంతో, డిపార్ట్ మెంట్ లో కలకలం కనిపిస్తోంది.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్ళిపోతుంది. పోలీస్ శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎస్పీ తో పాటు పోలీస్ కమిషనర్ రాగానే గతంలో పని చేసిన అధికారులను బదిలీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ప్రభుత్వం 4 పోలీస్ కమిషనరేట్ లకు కొత్తగా అధికారులను నియమించింది. కొన్నాళ్ళ క్రితం వరంగల్ పోలీస్ కమిషనర్ గా తరుణ్ జోషి నియమించింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా సత్యనారాయణ నియమించారు. రామగుండం పోలీస్ కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డికి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నలుగురు పోలీస్ కమిషనర్ లు వచ్చీ రాగానే దూకుడు పెంచారు.
కొత్త కమీషనర్ లు ఇప్పటికే పాత సిబ్బందికి మంగళం పాడుతున్నారట. ఇప్పటికే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ బదిలీ ప్రక్రియ మొదలుపెట్టారు. చాలా కాలం నుంచి ఎక్కడో లూప్ లైన్ లో పనిచేస్తున్న అధికారులకు మంచి పోస్టింగ్ ఇచ్చారు. అటు పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు అధికారులంతా బదిలీ అయ్యారు. రామగుండం లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కరీంనగర్లో కూడా పాత అధికారుల్ని బదిలీ చేసి కొత్తవారికి పోస్టింగ్ ఇస్తున్నారు. ఇకపోతే ఊహించని రీతిలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ అయ్యారు. ఈ స్థానానికి స్టీఫెన్ రవీంద్ర ను తీసుకు వచ్చారు.
స్టీఫెన్ రవీంద్ర వచ్చీ రాగానే తన పనితీరును మొదలు పెట్టారు. చాలా వరకు స్టేషన్ ఇంచార్జి అధికారులు బదిలీ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది పోలీసు అధికారులు రేంజ్ కు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. దీనికోసం అధికారులకు విన్నపాలు వెళ్తున్నట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో స్టీఫెన్ రవీంద్ర లా అండ్ ఆర్డర్ సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ కేసులు పెరిగిపోయిన పోలీస్ స్టేషన్ల అధికారులకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నిర్ణీత టైం లోగా కేసులను సాల్వ్ చేయాలని, చార్జిషీటు వేయాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు విచారణ పై దృష్టి పెట్టి వెంటనే కేసులను సాల్వ్ చేయాలని సైబరాబాద్ కొత్త కమీషనర్ ఆదేశించారట.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!