అన్నవరం ఆలయంలో కొత్త రగడ !
అన్నవరం ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆయన చెప్పిందే వేదమట. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నా.. ఆయన మాటకు తిరుగే లేదట. రిటైరైన మరుసటిరోజే కొత్త పదవి చేపట్టి.. పెత్తనం చేయడానికి వస్తున్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రత్నగిరి కొండపై ఈ కొత్త రగడ ఏంటి?
వ్రత పురోహితులకు కామేశ్వరరావు చెప్పిందే వేదం
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉద్యోగులతోపాటు.. అర్చకులు.. పురోహితులు.. సిద్ధాంతులు.. ఇలా ఎంతో మంది.. ఎన్నో విభాగాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం ఆలయంలోనూ ఇలాంటి వ్యవస్థలే ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణస్వామి వ్రతాలకు ప్రసిద్ధి. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా వ్రత పురోహితులు అనే వ్యవస్థ ఉంటుంది. వ్రత పురోహితుల సంఖ్య దాదాపు 250 పైమాటే. వీరిలో ఒకరు నాగభట్ల కామేశ్వరరావు. వ్రత పురోహితులకు ఆయన ఎంత చెబితే అంతట. గత 20 ఏళ్లుగా ఆయన చెప్పిందే వేదం.. శాసనమని టాక్. కామేశ్వరరావుకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదట. రత్నగిరికి కొత్తగా ఏ అధికారి వచ్చినా మచ్చిక చేసుకోవడంలో నేర్పరిగా ఆయనకు పేరుందట. ఆయనపై ఆరోపణలు కూడా అదేస్థాయిలో ఉన్నాయని చెబుతారు.
read also : తెలంగాణలో కేసీఆర్ ను కనుమరుగు చేస్తాం : బండి సంజయ్
అన్నవరం వైదిక సలహాదారుగా కామేశ్వరరావు?
సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తెచ్చుకుని కొనసాగుతున్నారా?
జూన్ 30తో కామేశ్వరరావు రిటైర్ అవుతుండటంతో ఆయనంటే గిట్టని వారు సంతోషించారు. కానీ.. ఏం జరిగిందో ఏమో.. అన్నవరం ఆలయంలో వైదిక సలహాదారుగా కొత్త పోస్టులో మరో ఐదేళ్లపాటు పదవీయోగం పొందినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో పాలకవర్గాలు.. అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారన్నది ఉద్యోగ వర్గాలు చేసే ఆరోపణ. ఈ సందర్భంగా గతంలో కామేశ్వరరావుపై వచ్చిన ఆరోపణలను తవ్వి తీస్తున్నారు. కామేశ్వరరావుపై 2010లో వచ్చిన ఆరోపణలపై అప్పటి అన్నవరం ఈవో రామచంద్రమోహన్ విచారణ చేసి సస్పెండ్ చేశారు. ఆయన గుత్తాధిపత్యానికి చెక్ పెట్టి వ్రతపురోహితులకు స్వేచ్ఛ ఇచ్చారని ఆలయ వర్గాలు ఇప్పటికీ చెప్పుకొంటాయి. అయితే తనను సస్పెండ్ చేసే అధికారం ఈవోకు లేదని నాడు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారట కామేశ్వరరావు. ఇక లాభం లేదనుకొని కొందరు పురోహితులు ఆయనపై లోకాయుక్తతోపాటు మానవహక్కుల కమిషన్లోనూ పిటిషన్లు వేశారని చెబుతారు.
రిటైర్ అయిన మరుసటి రోజే కొత్త పోస్టు?
దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రిటైర్ అయ్యాక ఏ విధంగా వైదిక సలహాదారుగా నియమిస్తారన్నది అన్నవరం ఆలయంలో ఓ వర్గం వేసే ప్రశ్న. గడిచిన పాలకమండలి సమావేశంలో కామేశ్వరరావును వైదిక సలహాదారుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారట. వైదిక సలహాదారు అంటే.. ఆ రంగంలో నిష్ణాతులై ఉండాలన్నది వారి వాదన. ఆరోపణలు.. కోర్టు కేసులు పెండింగ్ ఉన్నప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పదవి కట్టబెట్టడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారట. కొన్ని హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు సైతం ఈ అంశంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. మొత్తానికి ఎవరి వాదనలో ఎంత పస ఉందో కానీ.. అన్నవరం సత్యనారాయణ స్వామి కొలువైన రత్నగిరి కొండపై కొత్త రగడ కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!