యెండల వర్సెస్ ఎంపీ.. కుమ్ములాటలేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యర్థులతో పోరాడాల్సిన బీజేపీ నాయకులు.. తమలో తామే కుమ్ములాడుకుంటున్నారా? ఎంపీ.. మాజీ ఎమ్మెల్యేల మధ్య బస్తీమే సవాల్ అనేవిధంగా పరిణామాలు నెలకొన్నాయా? బహిష్కరణలు.. కేసులు వరకు సమస్య వెళ్లిందా? ఎవరా నాయకులు?
ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్
నిజామాబాద్ జిల్లాలో బలంగా ఉన్నామని బీజేపీ నాయకులు చెబుతున్నా.. అక్కడ పార్టీలో నెలకొన్న విభేదాలు క్రమంగా రోడ్డున పడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అవి బయట పడకుండా మ్యానేజ్ చేసినా.. ప్రస్తుతం బస్తీమే సవాల్ అనే వరకు వెళ్లింది. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఆ పార్టీ ఎంపీ మధ్య జరుగుతున్న విభేదాలు కాషాయ శిబిరంలో ప్రస్తుతం హాట్ టాపిక్.
Also Read
యెండల వర్గానికి చెందిన నేతపై వేధింపుల కేసు
బీజేపీలో రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న నిజామబాద్ నేత ప్రసాద్ పటేల్పై ఇటీవల నమోదైన పోలీస్ కేసు పొలిటికల్ చర్చకు దారితీసింది. ప్రసాద్ వేధిస్తున్నారనే ఒక మహిళ ఫిర్యాదుపై.. చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. యెండల వర్గానికి చెందిన ప్రసాద్పై నమోదైన కేసు వెనక కుట్ర జరిగిందనేది ఒక ఆరోపణ. కొందరు బీజేపీ నాయకులే ఆ మహిళతో కేసు పెట్టించినట్టు యెండల అండ్ కో అనుమానిస్తోంది. న్యాయం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్, బీజేపీ రాష్ట్ర నాయకుల దగ్గరకు వెళ్తున్నారు మాజీ ఎమ్మెల్యే.
తాడోపేడో తేల్చుకుంటామని యెండల వర్గం ప్రకటన
గతంలోనూ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ స్థాయిలో రచ్చకెక్కలేదు. ఆ మధ్య ఆలయాల పరిరక్షణ పేరుతో పార్టీ నేత ఒకరు ర్యాలీ తీశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం బీజేపీలోని మరో వర్గానికి లేదట. అది కాస్తా రచ్చ అయింది. పార్టీలో బీఫామ్లు అమ్ముకున్నారని యెండల పార్టీలోని ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే వైఖరి కొనసాగించి.. తన వర్గాన్ని బలహీన పరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే. అవసరమైతే తాడోపేడో తేల్చుకుంటామని.. ఎన్నికల్లో పోటాపోటీగా బరిలో దిగుతామని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట.
యెండలపై కత్తులు నూరుతున్న ఎంపీ వర్గం
మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ వర్గం దూకుడు చూశాక.. పార్టీ ఎంపీ వర్గం కూడా కత్తులు నూరుతోందట. కేసులు, కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పేరు చెప్పకుండా హెచ్చరిస్తోంది. చినికి చినికి గాలివానలా సమస్య మారడంతో విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఒకరేమో పార్టీ సిట్టింగ్ ఎంపీ.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ కావాల్సిన వాళ్లే. ఒకే సామాజికవర్గం నేతలు కావడంతో.. సర్దిచెప్పడానికి తల ప్రాణం తోకకు వస్తోందట. చివరకు బండి సంజయ్ సైతం ఓ నేతను బుజ్జగించినట్టు సమాచారం. అయితే నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఏవిధంగా బరస్ట్ అవుతాయో అని కమలనాథులు ఆందోళన చెందుతున్నారట.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!