Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Do Those Two Leaders Have To Be Angry

ఆ ఇద్దరు నేతల రగడ ఉండాల్సిందే..?

Published Date :May 2, 2022 , 11:53 am
By Premchand Chowdary
ఆ ఇద్దరు నేతల రగడ ఉండాల్సిందే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌ పార్టీలో రెడ్డి సామాజికవర్గం డామినేషన్‌ ఎక్కువ. అలాంటి పార్టీలో బీసీ సామాజికవర్గానికి చెందిన మధుయాష్కీ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా.. మహేష్‌గౌడ్‌ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను మహేష్‌గౌడే పర్యవేక్షిస్తున్నారు. ఇద్దరు బీసీ నేతలు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ సఖ్యత లేదు. నిత్యం కయ్యమే. గాంధీభవన్‌లో ఇద్దరు గౌడ్‌లు కలిశారంటే.. ఉప్పు నిప్పులా ఉంటారు. అసలు ఈ ఇద్దరికీ ఎక్కడ తేడా కొట్టింది అనేది ఎవరికీ అంతుచిక్కదు.

ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీకి గాంధీభవన్‌లో ప్రత్యేక రూమ్‌ కావాలని అప్పట్లో పంచాయితీ జరిగింది. చివరకు ఉన్న గదుల్లోనే సర్దాల్సి వచ్చిందని చెబుతున్నారు మహేష్‌గౌడ్‌. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డికి, మధుయాష్కీకి ఒకే రూమ్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఇద్దరు గౌడ్‌ల వైరం ఢిల్లీకీ చేరింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో పంచాయితీ అయింది. హస్తినలో రాహుల్‌గాంధీ నిర్వహించిన సమావేశంలోనూ మహేష్‌గౌడ్‌, మధుయాష్కీలు పరస్పరం కామెంట్స్‌ చేసుకున్నారు. ఒక్కరోజు కూడా జిల్లాకు రానివారికి పదవులు ఎందుకు… ఒక్కరికే రెండు పదవులు ఎందుకు అంటూ రాహుల్ ఎదుటే ప్రశ్నలు సంధించుకున్నారు నేతలు. చివరకు అన్నీ సర్దుకుని పనిచేయాలని హితవు పలికి పంపారు పార్టీ అగ్రనేత. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సమావేశంలోనూ లొల్లి తప్పలేదట. వాళ్ల మధ్య తగువులోకి AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ను లాగడంతో సమావేశం హీటెక్కినట్టు చెబుతున్నారు.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

ఇటీవల నిజామాబాద్ జిల్లా నాయకులు మధుయాష్కీ మాకు వద్దు అంటూ తీర్మానం చేశారు. అలా తీర్మానం ఎలా చేస్తారు అని మధుయాష్కీ… మహేష్‌గౌడ్‌ల మధ్య గొడవ జరిగిందట. ఆ సందర్భంగానే ఈ వివాదంలోకి ఠాగూర్‌ను లాగారట యాష్కీ. ఆ ప్రస్తావన తేగానే మీటింగ్‌ వాతావరణం మారిపోయినట్టు చెబుతున్నారు. ప్రచారకమిటీకి పని విభజన చేయాలని యాష్కీ అడిగారట. ఆ పాయింట్‌కు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మద్దతు పలికినట్టు సమాచారం. అయితే పని విభజన చేసి.. పని చెప్పడానికి ఫండ్ ఎక్కడిది అని మహేష్‌గౌడ్ ఎదురు ప్రశ్నలు వేశారట. ప్లానింగ్.. ఫండ్ లేకుండా పని విభజన ఏంటని అనడంతో చర్చ కొంత సద్దుమణిగింది. ఆ తర్వాత అనుబంధ సంఘాల పోస్టింగ్‌లకు మహేష్‌కి సంబంధం ఏంటని ప్రశ్నించారట యాష్కీ. అనుబంధ సంఘాలు పార్టీలో అంతర్భాగమని.. వాటి బాధ్యత కూడా పీసీసీపైనే ఉందన్న మహేష్‌గౌడ్‌.. పీసీసీ అనుమతి లేకుండా ఎవరికీ పోస్టింగ్‌లు ఇవ్వడం లేదని బదులిచ్చారట. ఇలా ఇద్దరి మధ్య వాడీవేడీ వాగ్యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది.

వాస్తవానికి మధుయాష్కీ, మహేష్‌గౌడ్‌ ఇద్దరూ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నాయకులే. ఒకరంటే ఒకరికి పడదు. ఈ వైరం ఎంత వరకు వెళ్తుంది.. ఎన్నాళ్లిలా వైరిపక్షాల్లా ఉంటారో పార్టీ వర్గాలకు అర్థం కాని పరిస్థితి. ఆది అంతాలు తెలియని నేతల విభేదాలకు ఫుల్‌ స్టాప్‌ ఎప్పుడు పడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • congress
  • Madhu Yashki
  • Mahesh Goud
  • PCC
  • telangana

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?

  • NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ

  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions