Off The Record: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం గులాబీ పార్టీ స్కెచ్ మార్చిందా..?
- ఎలాగైనా కొట్టాలన్న పట్టుదలతో కాంగ్రెస్..
- దమ్మేంటో చూపించాలనుకుంటున్న బీజేపీ..
- సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీజేపీ..
- జూబ్లీహిల్స్లో మూడున్నర లక్షల మంది ఓటర్లు..
- లక్షా 25 వేల మందికి పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు..
- మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో స్పెషల్ మీటింగ్..
- గతంలో ఎంఐఎంతో దోస్తీ కారణంగా ప్రత్యేక వ్యూహాలు..
- నాడు ముస్లిం ఓట్లు చీల్చి గెలిచారన్న విశ్లేషణలు..
- ఇప్పుడు కాంగ్రెస్కు అనుకూలంగా ఎంఐఎం..
- ముస్లిం ఓట్లు చీలకుండా బీఆర్ఎస్ జాగ్రత్తలు..
- మైనార్టీల ప్రభావం ఉండే డివిజన్స్పై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం గులాబీ స్కెచ్ మారుతోందా? గతానికి భిన్నంగా కొత్త అస్త్రాలకు పదును పెడుతోందా? నియోజకవర్గంలోని కీలక ఓట్ బ్యాంక్ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోందా? అసలిక్కడ బీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? కొత్తగా అనుసరించబోతున్న వ్యూహం ఏంటి? ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది?..
Read Also: Box ofice : బాక్సాఫీసు పై స్టార్ హీరోల దండయాత్ర!
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. అందుకే నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగవేయాలన్న ప్లానింగ్లో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును ఎలాగైనా కొట్టాలని అధికార పార్టీ ప్లాన్ చేస్తుంటే…తాము గెలిచిన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ సీటు కాబట్టి మా దమ్మేంటో చూపించాలని ఆరాటపడుతున్నారట కాషాయ నేతలు. ఇక సిట్టింగ్ స్థానం తమదే కాబట్టి.. కచ్చితంగా గెలిచి తీరాలని బిఆర్ఎస్ కూడా స్కెచ్ వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక తర్వాత సంగతి… ముందు నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాల మీద దృష్టి పెట్టాలనుకుంటోందట గులాబీ అధిష్టానం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో మూడున్నర లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
అయితే, వీరిలో లక్షా 25 వేల మందికి పైగా ముస్లిం మైనార్టీలే. గెలుపు ఓటముల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించేది కూడా వీళ్ళే. అందుకే వాళ్ళని ప్రభావితం చేయగలిగిన అన్ని అంశాల మీద బీఆర్ఎస్ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే.. పార్టీ మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో.. ఓ స్పెషల్ మీటింగ్ నిర్వహించింది. జూబ్లీహిల్స్లో ఉన్న లక్షా 25వేల మంది మైనార్టీ ఓటర్లకు హైదరాబాదులోని మిగతా సెగ్మెంట్స్లోని వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి కాబట్టి… సిటీలో ఉన్న మిగతా మైనార్టీ నాయకులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేసేలా గులాబీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో కాంగ్రెస్, 2014లో టిడిపి, 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతి ఎన్నికలోనూ ముస్లిం మైనారిటీల ఓట్లే కీలకంగా మారాయి. గతంలో ఎంఐఎంతో దోస్తీ ఉన్న సమయంలో ఆ పార్టీ సపోర్ట్తో పొలిటికల్ స్కెచ్లు వేసింది బీఆర్ఎస్. సాధారణంగా మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటారని, ఆ ఓట్లను చీల్చేందుకు మజ్లిస్ పార్టీ అభ్యర్థిని పోటీచేయించి బీఆర్ఎస్ సక్సెస్ అయిందని చెబుతుంటారు రాజకీయ విశ్లేషకులు. జూబ్లీహిల్స్ మైనార్టీ ఓటర్లలో చీలిక ద్వారా.. అప్పట్లో కారు పార్టీ తేలిగ్గా గెలవగలిగిందన్నది వాళ్ళ అభిప్రాయం. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయ్.
Read Also: Modi-Trump: అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. భారత వాణిజ్య శాఖ వెల్లడి
ఇక, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక.. ఎంఐఎం వైఖరి కూడా మారిపోయింది. ప్రస్తుతం పతంగి పార్టీ కాంగ్రెస్కు దగ్గరగా ఉంది. దీంతో ఈసారి ఔట్రైట్గా అధికార పార్టీకి సపోర్ట్ చేయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని ముందే గ్రహించినందునే.. బీఆర్ఎస్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలోని ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్, ఎంఐఎంలవైపునకు మళ్లకుండా.. తమకే మొగ్గేలా జాగ్రత్త పడుతున్నారట గులాబీ పెద్దలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్న షేక్పేట, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ , యూసుఫ్ గూడ డివిజన్స్లో మైనారిటీల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకే.. ఆయా ప్రాంతాల్లోని ముస్లిం నాయకులతో ముందు నుంచే మీటింగ్స్ పెట్టి.. మచ్చిక చేసుకునే పని మొదలు పెట్టిందట. ముస్లిం ఓట్లలో సింహభాగాన్ని గనుక రాబట్టుకోగలిగితే.. జూబ్లీహిల్స్లో తమకు తిరుగుతు ఉండదన్నది బీఆర్ఎస్ అధిష్టానం అంచనా. కాంగ్రెస్, ఎంఐఎంలను కాదని వాళ్ళు ఎంత వరకు కారుకు సపోర్ట్ చేస్తారన్నది చూడాల్సిందేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
- Tags
- BRS
- congress
- hyderabad
- Jubilee Hills
- MIM
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!