TRS : ఆ నియోజక వర్గంలో ఆ రెండు పార్టీల మధ్య దళితబంధు అగ్గి రాగేస్తుందా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో దళితబంధు లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రగడగా మారింది. ఎమ్మెల్యే శ్రీధర్బాబును ఈ పథకానికి సంబంధించి నియోజకవర్గంలో ఇంఛార్జ్గా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే కావడంతో.. ఆయన రోల్ కీలకంగా మారిపోయింది. దీనిని మంథనిలోని టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట.
కాంగ్రెస్ కార్యకర్తలకే ఎమ్మెల్యే దళితబంధు ఇప్పిస్తున్నారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్డివిజన్లో అధికారపార్టీ నేతలు రహస్య మీటింగ్ పెట్టుకున్నారట. ఈ పథకాన్ని ముందుగా టీఆర్ఎస్ కార్యకర్తలకు వర్తింప చేయాలనే డిమాండ్తో అధిష్ఠానం దగ్గరకు వెళ్లాలని నిర్ణయించారట. టీఆర్ఎస్వాళ్లకు పథకాన్ని వర్తింప చేయకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని తీర్మానించారట. మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల ప్రజాప్రతినిధులు మహాముత్తారంలో సమావేశం ఏర్పాటు చేసుకుని మంథని టీఆర్ఎస్ ఇంఛార్జ్ పుట్టా మధు సూచించిన వారికే ఇవ్వాలని కోరారట. పుట్టా మధునే దళితబంధు పథకం అమలుకు ఇంఛార్జ్ను చేయాలని విన్నవించారట. ఎమ్మెల్యే శ్రీధర్బాబు సిద్ధం చేసిన జాబితాను రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి కాకుండా టీఆర్ఎస్ ఇంఛార్జులకే దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు అప్పగించారని.. ఒకటి రెండుచోట్ల ఆ మినహాయింపు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అలాంటి మినహాయింపు మంథనిలో ఇవ్వడంతో గుర్రుగా ఉన్నారు గులాబీ నేతలు. పార్టీనే నమ్ముకుని ఉన్న తమను కాదని వ్యతిరేకంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదో విధంగా అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేలా ప్రస్తుతం రాజీనామా అస్త్రాలను బయటకు తీశారు మంథని గులాబీ నేతలు. ఈ పరిణామాలను ఎమ్మెల్యే శ్రీధర్బాబు శిబిరం కామ్గా గమనిస్తోందట. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి.. దళితబంధు రగడ రానున్న రోజుల్లో మంథనిలో ఎలాంటి రాజకీయ చిచ్చు రాజేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!