Munugode By-Elections : ఉపఎన్నిక ద్వారా భవిష్యత్ రాజకీయానికి కామ్రేడ్ బాట వేసుకోవాలని చూస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Munugode By-Elections : ఉపఎన్నిక ద్వారా భవిష్యత్ రాజకీయానికి బాట వేసుకోవాలని కామ్రేడ్స్ చూస్తున్నారా? తమ మద్దతు కోరే పార్టీలకు షరతులు పెట్టే ఆలోచనలో వామపక్ష నేతలు ఉన్నారా? మునుగోడు వేదికగా లెఫ్ట్ కొత్త వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్..!
మునుగోడు ఉపఎన్నిక సన్నాహాల్లో ప్రధాన పార్టీల ఎత్తుగడలు స్పీడందుకున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. ఒకప్పుడు మునుగోడులో పాగా వేసి.. బలమైన కేడర్ ఉన్న వామపక్ష పార్టీల వైఖరిపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. CPI, CPMలు ఉపఎన్నికలో పోటీ చేస్తాయా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు లెఫ్ట్ శిబిరం నుంచి వస్తోన్న సంకేతాల ప్రకారం.. ఇతర పార్టీలకు మద్దతిచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆ లైన్ ఎంచుకుంటారనే చర్చ బలపడుతోంది.
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
మునుగోడులో గెలిచే పార్టీకే తమ మద్దతు అని వామపక్ష పార్టీల సంకేతాలతో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ లెఫ్ట్ ఓటు బ్యాంకుపై ఆశలు పెట్టుకున్నాయి. గతంలో జరిగిన ఉపఎన్నికలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనుసరించిన వైఖరే ఇప్పుడూ రిపీట్ అవుతుందనే లెక్కల్లో టీఆర్ఎస్ ఉంది. అయితే మునుగోడులో మద్దతిచ్చే విషయంలో సీపీఐ, సీపీఎంలు ప్రధాన పార్టీలకు కొన్ని షరతలు పెట్టొచ్చని ప్రచారం జరుగుతోంది. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకటి రెండు సీట్లు తమకు కేటాయించాలని టీఆర్ఎస్, కాంగ్రెస్లను కోరే అవకాశం ఉందట. దానికి ఎవరైతే ఒప్పుకొంటారో వాళ్లకు మునుగోడులో లెఫ్ట్ పార్టీల మద్దతు లభిస్తుందని టాక్.
ఇప్పటికే కమ్యూనిస్ట్లు మునుగోడులో తమ కసరత్తు ప్రారంభించాయి. సీపీఐ, సీపీఎంలు వేర్వేరుగా నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఉపఎన్నికలో పోటీ చేస్తే లాభమా.. కాదా? బీజేపీని ఓడించడానికి తమ శక్తి సామర్థ్యాలు సరిపోతాయా.. లేదా? అనే అంశాలపై నేతలు ఆరా తీశారు. కొందరు పోటీ చేయాలని.. మరికొందరు గెలిచే పార్టీకి మద్దతు ఇవ్వాలని సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారట. బరిలో దిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలి.. అది కమలం పార్టీకి మేలు జరుగుతుందనే అంచనాకు వచ్చాయట లెఫ్ట్ పార్టీలు.
2014 ఎన్నికల్లో మునుగోడులో CPM ఒంటరిగా పోటీ చేయగా.. CPI కాంగ్రెస్ జతకలిసి బరిలో దిగాయి. 2018లో సీపీఐ మరోసారి కాంగ్రెస్తో కలిసి పోటీ చేయగా… CPM బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో పోటీలో నిలిచింది. తాజా పరిస్థితుల్లో ఉపఎన్నికలో పోటీ చేయడంకంటే గెలిచే పార్టీకి మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అది కాంగ్రెస్కా.. టీఆర్ఎస్కా అనేది వడపోసే పనిలో ఉన్నాయి వామపక్షాలు. కమ్యూనిస్ట్ పార్టీలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంతనాలు సాగిస్తోంది. గత ఎన్నికల్లో CPI మద్దతిచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూనే.. CPMని కూడా కలుపుకొని వెళ్లాలని లెక్కలేస్తున్నారట. మునుగోడులో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు 30 వేలకు పైగా ఓటు బ్యాంక్ ఉందని అంచనా. ఆ మొత్తం గంపగుత్తగా పడే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ కూడా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇలా కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి వస్తోన్న డిమాండ్స్ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలకు బాట వేసుకుంటున్నారు వామపక్ష నేతలు. మరి.. మునుగోడులో లెఫ్ట్ అడుగులు ఎటు పడతాయో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!