ఈటల రాజేందర్ ఖర్చు చూసి భయపడుతున్న బీజేపీ నేతలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలు డబ్బుమయంగా మారాయనేది పాత మాటే.పంచాయతీ ఎన్నికలకే కోట్లు పెట్టే చోట, అసెంబ్లీకి ఎంత ఖర్చవుతుందో ఊహకు కూడా అందని పరిస్థితి. అయితే భారీ హైప్ వచ్చిన హుజూరాబాద్ ప్రచారం జరిగిన తీరు…. బిజెపి నేతల్ని కంగారు పెడుతుందట. ఈ స్థాయిలో ఖర్చు చేయాలంటే కష్టమే అనుకుంటున్నారట.
హుజూరాబాద్ ఎన్నికల ల్లో డబ్బుల ప్రవాహాన్ని చూసిన బీజేపీ నేతలు ఖంగుతింటున్నారు… ఇదేం ఖర్చు , ఇన్ని పైసలు ఎక్కడి నుండి తేవాలి.. రేపు పోటీ చేసే అవకాశం వస్తే మా పరిస్థితి ఏంటి… తట్టుకోగలమా అని హడలిపోతున్నారట. హుజూరాబాద్ ఎన్నికల్లో అధికార పార్టీనే కాదు బీజేపీ కూడ ఖర్చు పెట్టింది. పోటా పోటీగా సభలు నిర్వహించింది. ప్రచారం చేసింది. రెండు పార్టీలు ఇక్కడ అంచనాలకు మించే ఖర్చు చేశారనే టాక్ ఉంది. అధికార పార్టీ కాస్త ఎక్కువ సమర్పించుకుంటే, కాషాయం పార్టీ కాస్త తక్కువ సమర్పించుకుని ఉండొచ్చు. మొత్తానికి ఈ ఎన్నికతో రెండు పార్టీ లకు ఖర్చు తడిసి మోపెడు అయింది.
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
హుజూరాబాద్ ప్రచారానికి ఇతర జిల్లాల బీజేపీ నేతలు కూడా వెళ్లారు… కొన్ని రోజుల పాటు అక్కడే బస చేసి క్యాంపెయిన్ చేశారు… బయట నుండి వచ్చిన కార్యకర్తలకు, నేతలకు మంచి ఏర్పాట్లు చేసారట. ఎక్కడ ఎన్నికలు ఉన్నా, అక్కడికి వెళ్లి ప్రచారం చేయడం బీజేపీ నేతలకు, కార్యకర్తలకు అలవాటు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోతారు కూడా. అయితే ఈసారి ప్రచారానికి వెళ్లిన నేతలు తమకు ఏర్పాటు చేసిన వసతులను చూసి ఆశ్చర్యపడ్డారట… ఏమిటీ ఏర్పాట్ల అని చర్చించుకున్నారట. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చూడలేదనుకున్నారట
ఇంతవరకు బాగానే ఉంది.. ఖర్చు చేసినా, ఫలితం కాషాయం పార్టీకే అనుకూలంగా వచ్చింది కాబట్టి కాస్త ఊరటగానే ఉంది. కానీ, ఈ హాడావుడి అంతా చూసిన తరువాత కొందరు నేతల్లో భయం మొదలు అయిందట.రేపు తమకు సీటు వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారట.కార్యకర్తలు , నేతల ఆకామడేషన్ కోసం ఇంత ఖర్చు పెడితే…ఇక ఎన్నికల్లో కొట్లాడడానికి ఎంత ఖర్చు పెట్టాల అని వర్రీ అవుతున్నారట.
హుజూరాబాద్ లో చేసిన ఏర్పాట్లు తమ దగ్గర కూడా చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని ఇతర నేతలు అంటున్నారట.హుజూరాబాద్ నుండి పోటీ చేసిన ఈటల దగ్గర అర్థ బలం ఉంది కాబట్టి చేయగలిగారు… పార్టీ సిస్టమ్ కి కొత్త కాబట్టి ఆ విధమైన ఏర్పాట్లు చేసారు.దీన్ని కొనసాగించాలంటే కష్టమని చెప్పుకుంటున్నారట. ఒక విధంగా ఆయన కమలం పార్టీకి లేని కొత్త అలవాటు నేర్పినట్టే అనే టాక్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!