YCP : కొందరు మంత్రులు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారా.? అసలు జరిగిందేంటి.?
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ.
ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశించింది. చాలామంది అర్చకులు కోరుకుంటున్నది అదే. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా మంత్రి కొట్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే ప్రధాన ఆలయాల్లో కూడా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మరో కీలక వ్యాఖ్య చేశారు. కొన్ని గుళ్లకు చెందిన ఈనాం భూములు పూజారుల చేతుల్లో ఉన్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడం కూడా అర్చకులతోపాటు బ్రాహ్మణ సామాజికవర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫీడ్ బ్యాక్ ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లిందట.
Also Read
- Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
- Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
- Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!
- Off The Record : గులాబీ బాస్ పోస్ట్ మార్టం.. అసెంబ్లీ ఎన్నికల తప్పులపై BRS సీరియస్ ఫోకస్!
ఈ క్రమంలో సీఎం సూచనల మేరకు ప్రభుత్వ పెద్దలు మంత్రి కొట్టు సత్యనారాయణను పిలిపించి.. ఓ చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. సున్నితమైన అంశాల్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటాయన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారట. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాయని.. అందులోనూ మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న అంశాన్ని గమనించాలి కదా అని అక్షింతలు వేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు అన్నికోణాల్లో ఆలోచించాకే.. మీడియా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మరో చర్చా జరుగుతోంది. కొత్తగా వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఇప్పుడిప్పుడే తమశాఖపై పట్టు సాధించే దిశగా పని చేస్తుంటే.. కొంతమంది దేవదాయశాఖ ఉన్నతాధికారులు.. ఆయనకు రాంగ్ ఇన్పుట్స్ ఇస్తూ.. మిస్ లీడ్ చేస్తున్నారట. అధికారులు రాజకీయకోణంలో ఆలోచించకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. మంత్రికి అదే విషయాన్ని బ్రీఫ్ చేస్తుండడంతో.. కొట్టు కూడా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా.. అన్ని రకాలుగా ఆలోచించుకుని మాట్లాడాల్సిన బాధ్యత మంత్రిదే. ఒకమాట ఎక్కువైనా.. తక్కువైనా ఇబ్బందులు తప్పవు. మరి.. సీఎంవో హితోక్తులు అమాత్యుల వారికి వంట బట్టాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Polavaram Project : పోలవరం ప్రాజెక్ట్పై కేంద్రం మెగా ప్లాన్..
-
RBI Gold Reserves: భారత్కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
-
PBKS Income: 2008 నుంచి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కొట్టని పంజాబ్కు డబ్బులే డబ్బులు.. ఎలా అంటే..
-
AP Mobile Alert: మొబైల్లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!
-
Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్లో కలకలం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!