YCP : కొందరు మంత్రులు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారా.? అసలు జరిగిందేంటి.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొట్టు సత్యనారాయణ. ఏపీ డిప్యూటీ సీఎం. దేవాదాయశాఖ మంత్రి. గత మూడేళ్ల కాలంలో ఎక్కువగా చర్చల్లో నలిగింది ఈ శాఖే. కొట్టుకు ఆ విషయం తెలియంది కాదు. కానీ.. మంత్రిగారు ఎటుపడితే అటు నాలిక మడత పెట్టేస్తున్నారని సొంత శాఖలోనే సణుగుడు ఎక్కువైంది. దీంతో దేవాదాయశాఖ వర్గాలు.. ప్రభుత్వ పెద్దల్లో చర్చగా మారిపోయారట కొట్టు సత్యనారాయణ.
ఇటీవల మంత్రి కొట్టు సత్యనారాయణ కొన్ని కామెంట్స్ చేశారు. ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ఆలయాలను అర్చకులకు అప్పజెప్పాలని కోర్టు ఆదేశించింది. చాలామంది అర్చకులు కోరుకుంటున్నది అదే. ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేయాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా మంత్రి కొట్టు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అలాగే ప్రధాన ఆలయాల్లో కూడా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మరో కీలక వ్యాఖ్య చేశారు. కొన్ని గుళ్లకు చెందిన ఈనాం భూములు పూజారుల చేతుల్లో ఉన్నాయనే అర్థం వచ్చేలా మాట్లాడం కూడా అర్చకులతోపాటు బ్రాహ్మణ సామాజికవర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. ఆ ఫీడ్ బ్యాక్ ప్రభుత్వ పెద్దల దగ్గరకు వెళ్లిందట.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
ఈ క్రమంలో సీఎం సూచనల మేరకు ప్రభుత్వ పెద్దలు మంత్రి కొట్టు సత్యనారాయణను పిలిపించి.. ఓ చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. సున్నితమైన అంశాల్లో ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే.. ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటాయన్న విషయాన్ని గమనించాలని హితవు పలికారట. ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాయని.. అందులోనూ మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న అంశాన్ని గమనించాలి కదా అని అక్షింతలు వేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇకపై సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు అన్నికోణాల్లో ఆలోచించాకే.. మీడియా ముందుకు వెళ్లాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మరో చర్చా జరుగుతోంది. కొత్తగా వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ ఇప్పుడిప్పుడే తమశాఖపై పట్టు సాధించే దిశగా పని చేస్తుంటే.. కొంతమంది దేవదాయశాఖ ఉన్నతాధికారులు.. ఆయనకు రాంగ్ ఇన్పుట్స్ ఇస్తూ.. మిస్ లీడ్ చేస్తున్నారట. అధికారులు రాజకీయకోణంలో ఆలోచించకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. మంత్రికి అదే విషయాన్ని బ్రీఫ్ చేస్తుండడంతో.. కొట్టు కూడా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనా.. అన్ని రకాలుగా ఆలోచించుకుని మాట్లాడాల్సిన బాధ్యత మంత్రిదే. ఒకమాట ఎక్కువైనా.. తక్కువైనా ఇబ్బందులు తప్పవు. మరి.. సీఎంవో హితోక్తులు అమాత్యుల వారికి వంట బట్టాయో లేదో చూడాలి.
తాజావార్తలు
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
TPCC: సీఎం రేవంత్రెడ్డితో మల్లు రవి భేటీ.. కొండా సురేఖ ఎపిసోడ్పై మీనాక్షి నటరాజన్, పీసీసీకి నివేదిక..
-
Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
-
Minister Anitha: హోంమంత్రి అనితకు స్వల్ప గాయం!
-
Sangareddy: ప్రియుడి మోజులో కన్న తల్లిదండ్రులను చంపిన యువతి.. అదే మత్తు ఇంజెక్షన్తో తానూ ఆత్మహత్య
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..